India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: డిసెంబర్ 1 నుంచి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. అందుకు రూ.60వేల కోట్లు ఖర్చు అవుతాయని చెప్పారు. నాలుగేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని, అమరావతితో పాటు 26 జిల్లాలను అభివృద్ధి చేస్తామని నారాయణ స్పష్టం చేశారు.
అమెరికన్ సైకిలిస్ట్ క్రిస్టీ బెల్మెర్ తన పెంపుడు కుక్క జ్ఞాపకార్థం సైకిల్పై 4,707 కిలోమీటర్లు ప్రయాణించి గిన్నిస్ రికార్డు సృష్టించారు. నెదర్లాండ్స్లోని ఆమ్స్టర్డామ్లో ప్రారంభించి జర్మనీ, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, బెల్జియం గుండా సాగి తిరిగి స్టార్టింగ్ పాయింట్లో ముగించారు. ఈ పూర్తి రైడ్ GPS మ్యాప్ చూస్తే కుక్క ఆకారంలో ఉంటుంది. కుక్క పుట్టినరోజైన మే 1న రైడ్ స్టార్ట్ చేసినట్లు ఆమె తెలిపారు.
సెప్టెంబర్ నుంచి ఆర్థిక లావాదేవీల సందేశాల్లో అంతరాయాలు కలగొచ్చు. స్పామ్ను అడ్డుకొనేందుకు ట్రాయ్ కఠిన చర్యలు తీసుకుంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు URLs, OTT లింక్స్, APKs, కాల్ బ్యాక్ నంబర్లతో కూడిన మెసేజ్ టెంప్లేట్లను ఆగస్టు 31లోపు టెలింకం సంస్థలకు ఇవ్వాలంది. వాటితో సరిపోలితేనే అవి సందేశాలు పంపించాలి. నంబర్లు వైట్ లిస్ట్ కాకున్నా, టెంప్లేట్లు ఆలస్యమైనా లావాదేవీల సందేశాలు కస్టమర్లకు రాకపోవచ్చు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్కు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఆమె నటించిన ‘స్త్రీ-2’కు మంచి రెస్పాన్స్ రావడంతో ఇన్స్టాగ్రామ్లో భారీగా ఫాలోయింగ్ పెరిగింది. 91.9Mతో ఆమె అత్యధిక ఫాలోవర్లు కలిగిన రెండో ఇండియన్గా నిలిచారు. ప్రథమ స్థానంలో కోహ్లీ(271M), మూడో స్థానంలో ప్రియాంకా చోప్రా(91.8M), నాల్గో స్థానంలో ప్రధాని మోదీ(91.3M) ఉన్నారు.
ఫ్రెంచ్ ఫ్రైస్ తినొద్దని చెప్పిన భర్తపై భార్య ఏకంగా IPC 498ఏ సెక్షన్ కింద గృహహింస కేసు పెట్టింది. దీంతో ఆ భర్త కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. విచారణ చేపట్టిన జడ్జి నాగప్రసన్న మాట్లాడుతూ ఇలా కేసు పెట్టడం చట్టాలను దుర్వినియోగం చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. భర్తపై చర్యలు తీసుకుంటే న్యాయ ప్రక్రియను అపహాస్యం చేసినట్లే అవుతుందన్నారు. ఈ కేసుపై స్టేటస్ కో విధించారు.
‘ఇంద్ర’ రిలీజై 22 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ చిత్ర నిర్మాత, రచయితలు, డైరెక్టర్, సంగీత దర్శకుడిని చిరంజీవి సత్కరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తనకు మెగాస్టార్ ఇచ్చిన కానుక ఫొటోను నిర్మాత అశ్వినీదత్ Xలో పోస్టు చేశారు. ‘ఈ విజయశంఖాన్ని కానుకగా మీరు ఇచ్చారు. కానీ ఇంద్రుడై, దేవేంద్రుడై పూరించింది ముమ్మాటికీ మీరే. ఈ కానుక అమూల్యం. ఈ జ్ఞాపకం అపురూపం. అదెప్పటికీ నా గుండెల్లో పదిలం’ అని రాసుకొచ్చారు.
TG: సినీ హీరో నాగార్జునకు చెందిన N కన్వెన్షన్ కూల్చివేతపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. ‘బఫర్ జోన్లో కాదు. చెరువులోనే నిర్మాణాలు చేపట్టారు. చెరువులు ఆక్రమణకు గురికాకుండా చూసేందుకే హైడ్రాను ఏర్పాటు చేశాం. కబ్జాలు, నిర్మాణాలకు సంబంధించిన శాటిలైట్ ఫొటోలను ప్రజల ముందు ఉంచుతాం. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నాం’ అని తెలిపారు.
అమెరికన్లలో చాలా మందికి తాము తీసుకునే ఆహారం ఎలా వస్తుందనే విషయం తెలియదని ఓ సర్వేలో తెలిసింది. U.S. డైరీకి సంబంధించిన ఇన్నోవేషన్ సెంటర్ చేసిన సర్వే ప్రకారం 7 శాతం మంది అమెరికన్లు (23 మిలియన్ల మంది) చాక్లెట్ మిల్క్ గోధుమ రంగు ఆవుల నుంచి వస్తాయని నమ్ముతున్నారు. అమెరికన్లకు శాస్త్రీయ భావనలపై అవగాహన లేదని, సైన్స్ గురించి చాలా మందికి తెలియదని పరిశోధనలో వెల్లడైంది.
AP: బాపట్ల కేంద్రీయ విద్యాలయంలో <<13931210>>ప్రమాదంపై<<>> సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 24 మంది విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ప్రాణాపాయం లేదని, వైద్యం అందిస్తున్నామని అధికారులు ఆయనకు తెలిపారు. కాగా సైన్స్ ల్యాబ్లో రసాయనాలు లీకవడంతో ఆ వాయువులను పీల్చి విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.
పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహీన్ అఫ్రీది తండ్రయ్యారు. అతని భార్య అన్షా ఇవాళ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఆ చిన్నారికి అలీ యార్గా పేరు పెట్టినట్లు అఫ్రీది కుటుంబసభ్యులు వెల్లడించారు. మాజీ క్రికెటర్ షాహీద్ అఫ్రీది కుమార్తెనే అన్షా. దీంతో అతను 47 ఏళ్లకే తాత అయ్యారు. కాగా బిడ్డతో గడిపేందుకు వీలుగా షాహీన్ బంగ్లాదేశ్తో జరిగే రెండో టెస్టుకు దూరం కానున్నట్లు సమాచారం.
Sorry, no posts matched your criteria.