News November 21, 2024

13 నెలల యుద్ధం.. 44,056 మరణాలు: పాలస్తీనా

image

హమాస్-ఇజ్రాయెల్ మధ్య 13 నెలలుగా జరుగుతున్న యుద్ధం కారణంగా గాజాలో 44,056 మంది మరణించినట్లు పాలస్తీనా అధికారులు ప్రకటించారు. వీరిలో సగానికి పైగా మహిళలు, చిన్నారులే ఉన్నారని తెలిపారు. శిథిలాల కిందే వేలాది మృతదేహాలు సమాధి అయ్యాయని, తాము ప్రకటించిన దానికంటే మరణాలు ఎక్కువే ఉండొచ్చని వెల్లడించారు. అలాగే 1,04,268 మంది గాయపడ్డారన్నారు. మరోవైపు 17,000 మంది మిలిటెంట్లను హతమార్చినట్లు ఇజ్రాయెల్ చెబుతోంది.

News November 21, 2024

అసలు ఏంటీ ‘అదానీ స్కాం’!

image

ప్రభుత్వరంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SECI)కు <<14669944>>అదానీ<<>> గ్రూప్ 12 GW సోలార్ విద్యుత్‌ను సప్లై చేయాలి. SECI రాష్ట్రాల్లోని డిస్కంలతో ఆ పవర్‌ను కొనుగోలు చేయించాలి. ఇది ఒప్పందం. కానీ SECI విఫలం కావడంతో అదానీ ఆయా రాష్ట్రప్రభుత్వాల ప్రతినిధులు, డిస్కంలకు రూ.2వేల కోట్ల లంచం ఇచ్చి SECI నుంచి పవర్ కొనుగోలు చేయించారని అభియోగం. ఇందులో APకే రూ.1750 కోట్లు అందించారని US కోర్టులో కేసు నమోదైంది.

News November 21, 2024

టేబుల్ టాపర్‌గా తెలుగు టైటాన్స్

image

ప్రో కబడ్డీలో తెలుగు టైటాన్స్ మరో విజయం సాధించింది. బెంగాల్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 31-29 పాయింట్ల తేడాతో గెలిచింది. విజయ్ మాలిక్ సూపర్-10తో రాణించడంతో తెలుగు టైటాన్స్ విక్టరీ సాధించింది. ఈ గెలుపుతో టైటాన్స్ పాయింట్ల పట్టికలో అగ్ర స్థానానికి దూసుకెళ్లింది. టైటాన్స్ ఇప్పటివరకు 12 మ్యాచులు ఆడి 8 గెలిచి నాలుగింట్లో ఓడింది.

News November 21, 2024

అవును.. మా అమ్మాయికి పెళ్లి: కీర్తి సురేశ్ తండ్రి

image

నటి కీర్తి సురేశ్ త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. చిన్ననాటి స్నేహితుడు ఆంథోనీ తట్టిల్‌తో వచ్చే నెలలో గోవాలో ఆమె వివాహం చేయనున్నట్లు కీర్తి తండ్రి సురేశ్ కుమార్ ఆన్‌మనోరమ వార్తాసంస్థకు తెలిపారు. తట్టిల్‌కి కేరళ, చెన్నైలో వ్యాపారాలున్నాయి. కుటుంబీకులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో పెళ్లి జరుగుతుందని ఆయన వెల్లడించారు.

News November 21, 2024

కీర్తి సురేశ్ కాబోయే భర్త ఆస్తులెంతో తెలుసా?

image

హీరోయిన్ కీర్తి సురేశ్, ఆంథోనీ తట్టిల్‌ ఒకే స్కూళ్లో చదువుకున్నారు. 12వ తరగతి నుంచి వీరి స్నేహం ప్రేమగా మారిందని కీర్తి తండ్రి తెలిపారు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఆంథోనీ కొన్నాళ్లు గల్ఫ్ దేశం ఖతర్‌లో పని చేశారు. ఆ తర్వాత కొచ్చి (కేరళ)కి వచ్చి ఓ కంపెనీ స్థాపించారు. Asperos అనే మరో సంస్థ, హోటల్ వ్యాపారాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆంథోనీకి సుమారు రూ.300 కోట్ల ఆస్తులు ఉన్నాయని సమాచారం.

News November 21, 2024

2 జిల్లాల్లో 100% పూర్తయిన ఇంటింటి సర్వే

image

TG: సమగ్ర ఇంటింటి సర్వే జనగాం, ములుగు జిల్లాల్లో వందశాతం పూర్తయిందని ప్రభుత్వం తెలిపింది. నల్గొండ, కామారెడ్డి, మంచిర్యాల, భువనగిరి, జగిత్యాల, NZB, సిరిసిల్ల, గద్వాల, MBNR, మెదక్, మహబూబాబాద్, పెద్దపల్లి, ఆసిఫాబాద్, నారాయణపేట, భూపాలపల్లి, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో 90 శాతానికి పైగా సర్వే పూర్తయింది. GHMCలో 60.60% లక్ష్యాన్ని అందుకున్నట్లు సర్కార్ వివరించింది.

News November 21, 2024

విరాట్ ఒక సెంచరీ చేస్తే చాలు: పుజారా

image

విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాపై పరుగుల వరద పారిస్తారని చటేశ్వర్ పూజారా ఓ ఇంటర్వ్యూలో ధీమా వ్యక్తం చేశారు. ‘ఒక్క సెంచరీ చేస్తే చాలు విరాట్‌కు కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది. ఇక ఆ తర్వాత అతడిని ఎవరూ ఆపలేరు’ అని పేర్కొన్నారు. పుజారా BGT కోసం స్టార్ స్పోర్ట్స్‌లో హిందీ కామెంటేటర్‌గా వ్యవహరించనున్నారు. కాగా.. విరాట్‌కు ఆస్ట్రేలియాలో అద్భుతమైన రికార్డుంది. అక్కడ జరిగిన 13 మ్యాచుల్లో 1352 రన్స్ చేశారు.

News November 21, 2024

కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మకు పితృవియోగం

image

AP: నరసాపురం బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మకు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి సూర్యనారాయణ రాజు (91) అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో ఇవాళ మరణించారు. రేపు ఆయన అంత్యక్రియలు జరుగుతాయని తెలుస్తోంది. సూర్యనారాయణ రాజు మృతి పట్ల బీజేపీ రాష్ట్రాధ్యక్షురాలు దగ్గుబాటి పురందీశ్వరి, ముఖ్య నాయకులు సంతాపం తెలిపారు.

News November 21, 2024

పెన్షన్లపై కీలక ఆదేశాలు

image

AP: పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం ఇవాళ నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. వరుసగా 2 నెలలు తీసుకోకపోయినా మూడో నెల మొత్తం పింఛన్ ఇస్తామని తెలిపింది. NOV 1 నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని, DEC 1న రెండు నెలల పింఛన్ అందిస్తామని వెల్లడించింది. వరుసగా 3 నెలలు తీసుకోకపోతే పెన్షన్‌ను రద్దు చేస్తామంది. అలాంటి వారు తగిన కారణాలతో WEA/WWDS/MPDO/కమిషనర్లకు విన్నవిస్తే పెన్షన్లను పునరుద్ధరిస్తామని పేర్కొంది.

News November 21, 2024

‘నో లీవ్స్.. జ్వరమొచ్చినా రావాల్సిందే’.. ఆఫీస్ నోటీస్ వైరల్

image

డిసెంబర్‌ను విదేశాల్లో వెకేషన్ మంత్‌గా పరిగణిస్తుంటారు. అక్కడివారందరూ సుదీర్ఘ సెలవులో టూర్‌లకు వెళ్తుంటారు. దీంతో ఇండియా నుంచి వారికి పనిచేసే కంపెనీలు బిజీ అయిపోనున్నాయి. ఈ నేపథ్యంలో ఓ కంపెనీకి చెందిన నోటీస్ వైరలవుతోంది. ‘అత్యంత బిజీగా ఉండే రోజులు కాబట్టి ఈనెల 25 నుంచి డిసెంబర్ 31వరకు సెలవులుండవు. లీవ్స్ బ్లాక్ చేశాం. అనారోగ్యంగా ఉన్నా మినహాయింపులు ఉండవు’ అని సదరు కంపెనీలో నోటీసు అంటించారు.