India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాలు పట్టించుకోని సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి పరిష్కరిస్తున్నారని నెటిజన్లు అభినందిస్తున్నారు. చెరువులను కబ్జా చేసి నిర్మించిన భవంతులను హైడ్రా ద్వారా కూల్చేస్తున్నారని చెబుతున్నారు. యువతను పట్టిపీడిస్తున్న డ్రగ్స్, గంజాయి ఆటకట్టిస్తున్నారని, వాటిపై యుద్ధం చేస్తున్నారని కొనియాడుతున్నారు. ఇక నాణ్యత లేని ఆహారం తయారు చేస్తున్న హోటళ్లపై రైడ్లు చేస్తున్నారంటున్నారు.
మెట్రోస్టేషన్ల వద్ద పెయిడ్ పార్కింగ్ అమలు చేయడంపై మెట్రో అధికారులు మరోసారి వెనక్కి తగ్గారు. ప్రయాణికుల సమస్యలను పరిష్కరించేందుకు పెయిడ్ పార్కింగ్ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్ల వద్ద ఫ్రీ పార్కింగ్ సదుపాయం పునరుద్ధరించాలని రేపు నాగోల్లో ప్రయాణికులు మహాధర్నా చేయనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మలేషియా రాజధాని కౌలాలంపూర్లో <<13928730>>గల్లంతయిన<<>> తెలుగు మహిళను రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగింది. మ్యాన్హోల్ వద్ద జేసీబీలతో శిథిలాలను తొలగిస్తున్నారు. అయితే, జల ప్రవాహం అధికంగా ఉండటంతో ఆమె కొట్టుకుపోయి ఉంటారని స్థానిక పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి రెస్క్యూ ఆపరేషన్ వేగంగా సాగుతున్నప్పటికీ ఆమె ఆచూకీ ఇంతవరకూ తెలియరాలేదు.
తమ్మిడి కుంటను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ను నిర్మించారని, దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ నెల 21న హైడ్రా కమిషనర్ రంగనాథ్ను కోరారు. కుంటకు తూర్పు భాగంలో FTL పరిధిలోనే నిర్మించడంతో చెరువులో నీరు ఉండే ప్రాంతం తగ్గిపోయిందని తెలిపారు. FTL మ్యాప్ను షేర్ చేస్తూ చెరువులోనే నిర్మించినట్లు స్పష్టంగా కనిపిస్తోందని, వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.
‘ఆగ్రా’ చిత్రంలోని కొన్ని సీన్లను వైరల్ చేయడంపై నటి రుహాని శర్మ ఆవేదన వ్యక్తంచేశారు. ‘కళాత్మక సినిమాలు తీయడం సవాళ్లతో కూడుకున్న పని. ఎన్నో నిద్రలేని రాత్రులు గడపాలి. మా బాధను అర్థం చేసుకోకుండా తప్పుగా మాట్లాడుతున్నారు. ఈ మూవీని ప్రతిష్ఠాత్మక కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో స్క్రీనింగ్ చేశారు’ అని తెలిపారు. కాగా కొన్ని సీన్లను వైరల్ చేసి అవి రుహాని ప్రైవేట్ వీడియోలంటూ కొందరు పోస్టులు చేస్తున్నారు.
నచ్చిన సబ్జెక్ట్ను ఎంచుకొని సినిమా తీసే స్వేచ్ఛ తనకుందని దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి అన్నారు. ది కశ్మీర్ ఫైల్స్ అనంతరం ద్వేషాన్ని వ్యాప్తి చేసే సినిమాల దర్శకుడిగా ఆయన విమర్శలు ఎదుర్కొంటున్నారు. గతంలో ఆయన తీసిన ‘ది తాష్కెంట్ ఫైల్స్’1966లో ఉజ్బెకిస్థాన్లో PM లాల్ బహదూర్ శాస్త్రి మరణం చుట్టూ తిరుగుతుంది. తాజాగా అవిభక్త బెంగాల్ హింసాత్మక చరిత్ర పై ‘ది ఢిల్లీ ఫైల్స్’ తీస్తున్నారు.
TG: నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. ప్రభుత్వ ఆస్తులు ఎవరు ఆక్రమించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి అని.. దానిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని వ్యాఖ్యానించారు.
కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై హత్యాచార ఘటనలో నిందితుడైన <<13913228>>సంజయ్<<>> రాయ్ CBI కోర్టులో సంచలన ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. పాలీగ్రాఫ్ టెస్టుకు ఎందుకు సమ్మతించావని మెజిస్ట్రేట్ ప్రశ్నించగా.. అతడు భావోద్వేగానికి గురైనట్లు తెలిసింది. ‘నేను అమాయకుడిని. ఏ తప్పూ చేయలేదు. నన్ను ఇరికించారు. ఈ పరీక్షతో అసలు విషయం బయటపడుతుంది’ అని జడ్జి ముందు కన్నీళ్లు పెట్టుకున్నట్లు సమాచారం. దీంతో ఈ కేసులో ట్విస్ట్ నెలకొంది.
శిఖర్ ధవన్కు ఐసీసీ వన్డే టోర్నమెంట్లలో అదిరిపోయే రికార్డులు ఉన్నాయి. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ, 2015 వన్డే వరల్డ్ కప్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తరఫున అత్యధిక పరుగులు ఇతడివే. మొత్తం 20 ఇన్నింగ్స్ల్లో 1238 రన్స్ చేశారు. సగటు 65, స్ట్రైక్ రేట్ 98గా ఉంది. అందులో 6 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఏపీలో మరో దారుణ ఘటన జరిగింది. తిరుపతిలోని ఓ స్కూలులో బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఓ ప్రభుత్వ బాలికల హాస్టల్లో ఉంటూ బాలిక(14) 9వ తరగతి చదువుతోంది. హాస్టల్కు సరుకులు సరఫరా చేసే నిందితుడు రుషి ఆమెతో పరిచయం ఏర్పరచుకుని అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. బాలిక ఫిర్యాదుతో పోలీసులు విచారిస్తున్నారు. బుధవారమే జరిగినా గోప్యంగా ఉంచడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Sorry, no posts matched your criteria.