News August 23, 2024

తన ముఖం చూపించొద్దన్న నిందితుడి లాయర్

image

కోల్‌కతా ఆర్జీ కర్ ఆసుపత్రిలో లేడీ ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం ఘటనలో నిందితుడు సంజయ్ రాయ్‌కు కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. అయితే అతడి తరఫున వాదిస్తున్న లాయర్ కబితా సర్కార్ తన ముఖం చూపించవద్దని మీడియాను కోరారు. ఈ ఇందుకు సంబంధించిన వార్తల్లో తన ఫొటోను ప్రచురించవద్దని, దాని వల్ల కేసు పక్కదారి పట్టే అవకాశం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఉరిశిక్షకు తాను వ్యతిరేకమని ఆమె చెబుతుండటం గమనార్హం.

News August 23, 2024

పిల్లల్ని ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి రక్షించండిలా

image

ఇన్‌స్టాగ్రామ్‌‌‌లో ఉండే అడల్ట్ కంటెంట్ పిల్లల్ని చెడుదారిలోకి ప్రేరేపిస్తోంది. అందుకే మీ ఇంట్లో పిల్లలు ఇన్‌స్టాగ్రామ్ చూస్తుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అకౌంట్‌లోని సెన్సిటివ్ కంటెంట్ కంట్రోల్‌లో ‘లెస్’ ఎంపిక చేయండి. అలాగే డైరెక్ట్ మెసేజ్‌లను నిలిపివేయండి. ‘టేక్ ఏ బ్రేక్’ ఆప్షన్‌నూ వాడుకోవచ్చు. వారికి అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఏజ్ వెరిఫికేషన్ చేయించండి. యాక్టివిటీని చెక్ చేస్తూ ఉండండి.

News August 23, 2024

హార్దిక్-నటాషా విడిపోవడానికి కారణమిదేనా?

image

భారత క్రికెటర్ హార్దిక్ పాండ్య తన భార్య నటాషా నుంచి విడిపోవడానికి గల కారణాలు ఇప్పటికీ వెల్లడించలేదు. అయితే హార్దిక్ ఆడంబరం, తన లైఫ్ స్టైల్ మీదే ఎక్కువగా శ్రద్ధ పెట్టడం విడాకులకు కారణమని వారి సన్నిహిత వర్గాల ద్వారా తెలిసిందని టైమ్స్‌నౌ పేర్కొంది. స్వతంత్రంగా ఉండాలనుకునే నటాషాకు, హార్దిక్ ‘లివింగ్ లైఫ్ కింగ్ సైజ్’ మెంటాలిటీకి మధ్య ఏర్పడిన గ్యాప్ విడాకులకు దారి తీసి ఉండొచ్చంది.

News August 23, 2024

కోల్‌కతా వైద్యురాలి కొలీగ్స్‌కు లై డిటెక్టర్ టెస్టులు!

image

ఆర్జీ కర్ వైద్యురాలిపై హత్యాచారం కేసులో CBI వేగం పెంచింది. ఆమెతో కలిసి పనిచేసిన ఇద్దరు ట్రైనీలు, హౌస్ సర్జన్, ఇంటర్న్‌కు లై డిటెక్టర్ టెస్టులు చేయనుంది. వారిచ్చిన వాంగ్మూలాలు పరస్పరం విరుద్ధంగా ఉండటమే ఇందుకు కారణమని తెలిసింది. నేరంతో వారికి సంబంధం లేదని భావిస్తున్నా సాక్ష్యాధారాల చెరిపివేత, కుట్రలో భాగముందా అనే కోణాల్ని CBI పరిశీలిస్తోంది. ఆ రాత్రి జరిగిన పరిణామాల వరుస క్రమంపై అవగాహనకు వచ్చింది.

News August 23, 2024

SAD: బస్సు ప్రమాదంలో 27 మంది మృతి

image

నేపాల్‌లోని మర్స్యంగ్డి నదిలో బస్సు పడిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 27కి చేరింది. ప్రమాద సమయంలో బస్సులో ఇద్దరు సిబ్బందితో సహా మొత్తం 43 మంది ఉన్నట్లు స్థానిక అధికారులు ధ్రువీకరించారు. కాగా ఉత్తరప్రదేశ్ రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఈ బస్సు 8 రోజులు నేపాల్‌లో ఉండేందుకు అనుమతి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ప్రయాణికులంతా మహారాష్ట్రకు చెందినవారేనని తెలుస్తోంది.

News August 23, 2024

జియో యూజర్లకు బిగ్ అలర్ట్

image

తమ పేరిట సైబర్ నేరగాళ్లు పంపుతున్న మెసేజ్‌లను నమ్మొద్దని యూజర్లకు జియో సూచించింది. కాల్, మెసేజ్, ఈ-మెయిల్ ద్వారా పాన్, ఆధార్, బ్యాంక్ అకౌంట్, క్రెడిట్ కార్డ్, ఓటీపీలు అడుగుతున్నారని పేర్కొంది. ఎలాంటి లింక్‌లు వచ్చినా క్లిక్ చేయొద్దంది. థర్డ్ పార్టీ యాప్‌లు ఇన్‌స్టాల్ చేసుకోవాలని చెప్పినా పట్టించుకోవద్దని సూచించింది. సిమ్ కార్డ్ వెనుక ఉండే 20 డిజిట్స్ నంబర్‌ ఎవ్వరితో పంచుకోవద్దని తెలిపింది.

News August 23, 2024

ఐసీసీకి వెళ్తే జైషా స్థానంలో వచ్చేదెవరు?

image

ఒకవేళ ICC ఛైర్మన్‌గా జైషా ఎన్నికైతే BCCI కార్యదర్శిగా ఎవరుంటారన్నది ఆసక్తికరంగా మారింది. వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, ట్రెజరర్ ఆశీశ్ షెలార్, IPL ఛైర్మన్ అరుణ్ ధుమాల్, జాయింట్ సెక్రటరీ దేవజిత్ పేర్లు వినిపిస్తున్నాయి. యువకులైన రోహన్ S/O అరుణ్ జైట్లీ, అవిషేక్ S/O జగ్మోహన్ దాల్మియా పేర్లూ చర్చకు రావొచ్చు. కార్యదర్శిగా మరో ఏడాది పదవీకాలం ఉన్న జైషా కూలింగ్ ఆఫ్ నేపథ్యంలో ICCకి వెళ్తారా అన్నదే డౌట్.

News August 23, 2024

మండలిలో ప్రతిపక్ష నేతగా బొత్స

image

AP: శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ ఎన్నికయ్యారు. ఈమేరకు శాసనమండలి ఛైర్మన్ ఉత్తర్వులు జారీ చేశారు. బొత్స ఇటీవల విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డితో రాజీనామా చేయించిన వైసీపీ ప్రతిపక్ష నేతగా బొత్సకు అవకాశం ఇచ్చింది.

News August 23, 2024

విండోస్‌లో ఇకపై నో కంట్రోల్ ప్యానల్!

image

దిగ్గజ ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్ తన విండోస్ OSలోని కంట్రోల్ ప్యానల్‌ని సెట్టింగ్స్‌ ఆప్షన్‌తో రీప్లేస్ చేయనుంది. ఈ ఆప్షన్‌ అనవసరం అనే అభ్యర్థనల మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించింది. 1985లో వచ్చిన విండోస్ 1.0 వెర్షన్ నుంచి కంట్రోల్ ప్యానల్ యూజర్లకు సుపరిచితం. విండోస్‌ 11లోనూ దీనిని కొనసాగించారు. 2012లో వచ్చిన విండోస్ 8 వెర్షన్ నుంచి OS ఇంటర్‌ఫేస్‌లలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి.

News August 23, 2024

ఆసుపత్రి బెడ్‌పై రవితేజ.. ఫొటో వైరల్

image

టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ సినిమా సెట్లో <<13925048>>గాయపడి<<>> చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కుడి చేతి కండరం చిట్లడంతో ఆయనకు యశోదా ఆసుపత్రిలో వైద్యులు సర్జరీ చేశారు. రవితేజ ఆసుపత్రి బెడ్‌పై చికిత్స పొందుతున్న ఫొటో ఒకటి వైరల్ అవుతోంది. చేతి నుంచి రక్తం కారుతున్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ ఫొటో ఇప్పటిది కాదని, సినిమాలోనిది కావొచ్చని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై రవితేజ టీమ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.