India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: CM రేవంత్కు KCR భయం పట్టుకుందని BRS MLA హరీశ్రావు ఎద్దేవా చేశారు. KCRకు, రేవంత్కు చాలా తేడా ఉందని అన్నారు. మహబూబ్నగర్లో కురుమూర్తిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆగస్టు 15లోపు సంపూర్ణ రుణమాఫీ చేసి ఉంటే తాను రాజీనామా చేసేవాడినని అన్నారు. 42లక్షల మందికి అని చెప్పి కేవలం 22లక్షల మంది రైతులకే మాఫీ చేసి, పైగా తనను రాజీనామా చేయమంటున్నారని చెప్పుకొచ్చారు.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కించనున్న RC16 సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈనెల 22న మైసూర్లో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుందని సినీవర్గాలు పేర్కొన్నాయి. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. కాగా, ఇటీవల జాన్వీకపూర్ నటించిన ‘దేవర’ రిలీజై భారీ విజయాన్ని అందుకుంది. మరోవైపు రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ కూడా వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానున్న విషయం తెలిసిందే.

తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ ICC T20I ర్యాంకింగ్స్లో రయ్యుమని దూసుకెళ్లారు. ఒకేసారి ఏకంగా 69 స్థానాలు ఎగబాకి టాప్3కి చేరుకున్నారు. టాప్1లో ట్రావిస్ హెడ్(ఆస్ట్రేలియా) ఉండగా 2వ స్థానంలో సాల్ట్(ఇంగ్లండ్) ఉండగా ఆ తర్వాతి స్థానాన్ని తిలక్ కైవసం చేసుకున్నారు. అరంగేట్రం తర్వాత కేవలం 20 మ్యాచుల్లో తిలక్ ఈ ఫీట్ అందుకోవడం విశేషం. ఇటీవల SAపై వరుస సెంచరీలు చేసిన వర్మ మొత్తం 51.33 సగటుతో 616 రన్స్ చేశారు.

2025లో కేరళతో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఫుట్బాల్ టీమ్ 2 మ్యాచ్లు ఆడుతుందని ఆ రాష్ట్ర క్రీడలశాఖ మంత్రి అబ్దురహిమాన్ తెలిపారు. ఇందులో ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ కూడా ఆడతారని చెప్పారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన చర్చలు జరుపుతున్నామని పేర్కొన్నారు. కాగా కేరళలో ఫుట్బాల్కు క్రేజ్ ఎక్కువ. భారత్లో ఫుట్బాల్ ఎక్కువగా ఆడే కొన్ని రాష్ట్రాల్లో ఇదీ ఒకటి. మెస్సీ చివరిగా 2011లో ఇండియాలో ఆడారు.

యూట్యూబ్ రివ్యూయర్లు, ఫిల్మ్ క్రిటిక్లపై తమిళ చిత్ర నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై థియేటర్లలోకి వారిని అనుమతించకూడదని యాజమాన్యాలను కోరింది. రివ్యూల పేరుతో నటీనటులపై వ్యక్తిగత విమర్శలకు పాల్పడుతుండటంతో TFPC ఈ నిర్ణయం తీసుకుంది. వీరి రివ్యూలు వేట్టయన్, ఇండియన్ 2, కంగువా చిత్రాలపై తీవ్ర ప్రభావం చూపాయని తెలిపింది.

AP: సీఎం చంద్రబాబు పాలనపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అన్నారు. సమర్థులైన నాయకుడు ఉంటే ఎలా ఉంటుందనేది చంద్రబాబును చూసి తెలుసుకోవచ్చన్నారు. విజయవాడ వరదల సమయంలో అధికార యంత్రాంగాన్ని దగ్గరుండి నడిపిన తీరు అభినందనీయమని పవన్ కొనియాడారు. తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా ఉండటానికి చంద్రబాబు ముఖ్య కారణమన్నారు.

AP: కరడుగట్టిన నేరస్థులకు రాష్ట్రంలో చోటు లేదని సీఎం చంద్రబాబు అన్నారు. ఎవరైనా నేరాలకు పాల్పడితే తాట తీస్తామని ఆయన హెచ్చరించారు. ‘గత ప్రభుత్వ హయాంలో నేరాలు, ఘోరాలు ఎక్కువయ్యాయి. పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైంది. ఎక్కువగా గంజాయి, డ్రగ్స్ కారణంగానే నేరాలు జరుగుతున్నాయి. అందుకే వాటిపై మా ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇకపై ఆడబిడ్డల జోలికొస్తే ఏం చేయాలో అదే చేస్తాం’ అని ఆయన వార్నింగ్ ఇచ్చారు.

సైబర్ దాడికి గురైన బాధితుడికి పరిహారం ఇవ్వాలంటూ SBIని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. హరే రామ్ సింగ్ సైబర్ మోసానికి గురై, వెంటనే దగ్గర్లోని SBIకి వెళ్లి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన సిబ్బంది 2 నెలల తర్వాత అతడి అభ్యర్థనను తిరస్కరించారు. అతడు ఫ్రాడ్ లింక్ ఓపెన్ చేయడం, OTP చెప్పడాన్ని సాకుగా చూపారు. అయితే SBIది నిర్లక్ష్యమైన స్పందనగా పేర్కొన్న HC ₹2.6లక్షలు బాధితుడికి చెల్లించాలని ఆదేశించింది.

TG: ముగ్గురు సంతానం ఉన్న వారు సర్పంచ్ ఎన్నికల్లో పోటీకి అనర్హులనే నిబంధనను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించేందుకు నిర్ణయించిందని సమాచారం. దీంతో త్వరలో జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో ముగ్గురు పిల్లలున్న వారు కూడా సర్పంచ్లుగా పోటీ చేసేందుకు ఛాన్స్ ఉంటుంది. అటు APలో ఇద్దరికి మించి సంతానం ఉన్న వారికి పోటీకి అవకాశం కల్పించింది.

భారత జట్టు సీనియర్లు రోహిత్ శర్మ, కోహ్లీ, జడేజాల టెస్ట్ క్రికెట్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారినట్లు తెలుస్తోంది. వాళ్లను పక్కనబెట్టాలని డిమాండ్లు వస్తుండటంతో BGT సిరీస్లో వారి ఆటతీరును BCCI స్వయంగా పర్యవేక్షించనుంది. సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ ఆస్ట్రేలియాలోనే ఉండి కోచ్ గంభీర్తో కలిసి ఈ ముగ్గురి భవిష్యత్తుపై చర్చింవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇదే వాళ్లకు ఆఖరి సిరీస్ అయ్యే ఛాన్సూ ఉంది.
Sorry, no posts matched your criteria.