News November 20, 2024

భాస్కర –II ఉపగ్రహం విశేషాలు

image

1981లో సరిగ్గా ఇదే రోజు రష్యాలోని వోల్గోగ్రాడ్ ప్రయోగ వేదిక నుంచి భాస్కర –II ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది. 444KGS బరువు ఉండే ఈ శాటిలైట్ పని చేసే కాలం ఒక సంవత్సరం కాగా, ఇది పదేళ్లు కక్ష్యలో తిరిగింది. భూ పరిశీలన కోసం ప్రయోగించిన భాస్కర శ్రేణిలో ఇది రెండవ ఉపగ్రహం. గణిత శాస్త్రవేత్త మొదటి భాస్కరుడు గుర్తుగా దీనికి ఆ పేరు పెట్టారు. దీనికి ముందు 1979లో భాస్కర-I ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది.

News November 20, 2024

నేడు వేములవాడకు సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్ ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడకు వెళ్లనున్నారు. ఉ.10:10 నుంచి ఉ.11.45 గంటల మధ్యలో వేములవాడ రాజన్నను దర్శించుకుంటారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులు, మిడ్ మానేరు నిర్వాసితుల కోసం నిర్మించనున్న ఇందిరమ్మ ఇళ్లతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మ.1.45 తర్వాత HYDకు తిరుగు ప్రయాణమవుతారు.

News November 20, 2024

విడాకులపై ఏఆర్.రెహమాన్ ట్వీట్.. ఏమన్నారంటే?

image

భార్యతో విడాకులు తీసుకోవడంపై ఏఆర్.రెహమాన్ ట్వీట్ చేశారు. ‘మేము మా బంధంలో ముప్పై ఏళ్లు పూర్తి చేసుకోవాలనుకున్నాం. కానీ ఊహించని విధంగా ఇది ముగిసింది. విరిగిన హృదయాల బరువుకు దేవుని సింహాసనం కూడా వణుకుతుంది. విడిపోవడంలోనూ మేము అర్థాన్ని వెతుకుతాము. అయినప్పటికీ పగిలిన ముక్కలు మళ్లీ ఒక్కటి కాలేకపోవచ్చు. ఈ సమయంలో మా గోప్యతను గౌరవించినందుకు అందరికీ ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.

News November 20, 2024

ఓపెనర్‌గా KL? మూడో స్థానంలో పడిక్కల్?

image

BGT తొలి టెస్టులో జైస్వాల్‌కు జోడీగా KL రాహుల్ ఓపెనర్‌గా ఆడే అవకాశం ఉందని espncricinfo పేర్కొంది. మూడో స్థానంలో దేవ్‌దత్ పడిక్కల్, నాలుగో స్థానంలో కోహ్లీ, ఐదో స్థానంలో పంత్ ఆడతారని తెలిపింది. ఆరో స్థానం కోసం సర్ఫరాజ్, జురెల్ మధ్య పోటీ ఉందని, ఆల్‌రౌండర్ కోటాలో నితీశ్, అశ్విన్‌కు చోటు దక్కొచ్చని పేర్కొంది. పేసర్లలో బుమ్రాతో పాటు హర్షిత్ రాణా, సిరాజ్/ఆకాశ్‌దీప్‌ ఆడొచ్చని అంచనా వేసింది.

News November 20, 2024

ప్రజలకు TGPSC క్షమాపణలు చెప్పాలి: KTR

image

TG: గ్రూప్-3 ప్రశ్న పత్రంలో తక్కువ కులం, ఉన్నత కులం అనే పదాలు వాడారని డా.RS. ప్రవీణ్ కుమార్ చేసిన ట్వీట్‌పై KTR స్పందించారు. ‘TGPSC ఈ రకమైన కులతత్వ ఎజెండాను ప్రోత్సహించడం సిగ్గుచేటు. దీనిపై కమిషన్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలి’ అని అన్నారు. ‘తక్కువ కులం, ఎక్కువ కులం అన్న పదాలు ప్రభుత్వ పరీక్షా పత్రాల్లోనే ఉంటే ఇక సామాజిక న్యాయం ఎలా వస్తుంది రేవంత్ గారూ?’ అని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.

News November 20, 2024

ఖాళీ కడుపున వర్కవుట్స్‌తో ఉపయోగాలివే

image

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వర్కవుట్స్ చేయడం వల్ల ఉపయోగాలుంటాయా? ఫిట్‌నెస్ నిపుణుల ప్రకారం.. ఖాళీ కడుపుతో వ్యాయామం చేస్తే గ్లైకోజెన్ స్థాయులు తగ్గిపోతాయి. పోగైన కొవ్వుల్ని శరీరం శక్తికోసం వాడుతుంది. కొవ్వు వేగంగా కరుగుతుంది. గ్లూకోజ్‌ని మరింత వేగంగా పీల్చుకుంటుంది. దీంతో టైప్ 2 మధుమేహం తగ్గుతుంది. హార్మోన్లు సమతుల్యమవుతాయి. గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. ఏకాగ్రత పెరిగి, చలాకీగా ఉంటారు.

News November 20, 2024

ఈనెల 24న చెన్నైలో ‘పుష్ప-2’ ఈవెంట్!

image

‘పుష్ప-2’ సినిమా టీమ్ ఈనెల 24న చెన్నైలో ఈవెంట్ నిర్వహించనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత 27న కొచ్చిలో ప్రమోషనల్ ఈవెంట్ ఉంటుందని పేర్కొన్నాయి. బెంగళూరు, ముంబై, కోల్ కతా, HYDలోనూ ఈవెంట్స్ జరగనున్నాయి. ఇటీవల పాట్నాలో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు విశేష స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి 2 లక్షలకు పైగా జనం వచ్చినట్లు మూవీ టీమ్ ప్రకటించింది. డిసెంబర్ 5న ఈ సినిమా రిలీజ్ కానుంది.

News November 20, 2024

డిగ్రీ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు

image

TG: ఉస్మానియా వర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును ఈనెల 21వ తేదీ వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. రూ.500 అపరాధ రుసుముతో ఈనెల 23వ తేదీ వరకు సంబంధిత కాలేజీల్లో చెల్లించవచ్చని పేర్కొన్నారు. వచ్చే నెలలో పరీక్షలు జరగనుండగా, ఎగ్జామ్ షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఇతర వివరాలకు వర్సిటీ <>వెబ్‌సైట్‌ను<<>> సందర్శించాలని సూచించారు.

News November 20, 2024

గత పాలకులు తాగునీటి సరఫరాపై దృష్టి పెట్టలేదు: పవన్

image

AP: ప్రజారోగ్య పరిరక్షణ, కనీస మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని డిప్యూటీ CM పవన్ అన్నారు. గత ప్రభుత్వం గ్రామానికి రూ.4లక్షల ఖర్చు చేసి ఉంటే ప్రజలకు రక్షిత తాగునీరు అంది ఉండేదన్నారు. వారి నిర్లక్ష్యంతో రంగు మారిన నీరు పైపుల ద్వారా వెళ్లిందని, గుడివాడలో ఈ సమస్య తన దృష్టికి వస్తే వెంటనే పరిష్కరించామన్నారు. గ్రామాల్లో ఫిల్టర్ బెడ్స్ నిర్దేశిత టైంలోగా మార్చాలని ఆదేశించారు.

News November 20, 2024

ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్‌కు భారత్

image

ఏషియన్ ఛాంపియన్ ట్రోఫీ-2024లో భారత మహిళల హాకీ జట్టు ఫైనల్‌కు చేరింది. రాజ్‌గిర్ వేదికగా జరిగిన సెమీ ఫైనల్‌లో జపాన్‌పై 2-0 తేడాతో విజయం సాధించింది. భారత ప్లేయర్లలో నవ్‌నీత్ కౌర్, లాల్‌రెమ్సియామి చెరో గోల్ సాధించారు. బుధవారం జరిగే ఫైనల్ మ్యాచులో చైనాతో భారత జట్టు తలపడనుంది. సా.4.45కు ప్రారంభం కానున్న ఈ మ్యాచును సోనీ స్పోర్ట్స్ టీవీ ఛానల్, సోనీ లివ్ యాప్‌లో లైవ్ చూడవచ్చు.