India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏపీ, TGలోని ప్రభుత్వ, అనుబంధ స్కూళ్లలో చదువుతున్న 8వ క్లాస్ విద్యార్థులు NMMS స్కాలర్షిప్కు అర్హులు. ప్రైవేట్, కేంద్రీయ, నవోదయ, గురుకులాలు, వసతితో కూడిన స్కూళ్లలో చదివేవారు అనర్హులు. పేరెంట్స్ వార్షికాదాయం ₹3.5లక్షలకు మించకూడదు. 7వ క్లాస్లో 55% మార్కులు సాధించి ఉండాలి. ఎంపికైతే 9వ తరగతి నుంచి ఇంటర్ సెకండియర్ వరకు నెలకు ₹వెయ్యి ఇస్తారు. APలో SEP 6 వరకు, <
TG: పంచాయతీ ఎన్నికల ఓటరు జాబితా తయారీకి షెడ్యూల్ ఖరారైంది. వచ్చే నెల 6న వార్డుల వారీగా ముసాయిదా ఓటరు జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రచురించనుంది. ఓటరు జాబితాపై SEP 7 నుంచి 13 వరకు అభ్యంతరాలు స్వీకరించనుంది. 9, 10న రాజకీయ పార్టీల సూచనలు స్వీకరించనుంది. అదే నెల 21న వార్డుల వారీగా తుది ఓటరు జాబితాను ప్రచురించనుంది. కాగా ఓటరు జాబితా తయారీపై ఈ నెల 29న కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి తమకు సమాచారం లేదని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ హైకోర్టుకు నివేదించింది. ఈ విషయంలో తమ అనుమతి ఎవరూ కోరలేదని పేర్కొంది. రాష్ట్రంలోని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సెక్రటరీ పరిధిలో ఉంటుందని స్పష్టం చేసింది. కాగా BRS ప్రభుత్వ హయాంలో పలువురు నేతలు, వ్యాపారవేత్తలు, జడ్జిల ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.
ప్రపంచం శాకాహారం వైపు మొగ్గుచూపుతోందని ఆహార నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇండియా జనాభాలో అత్యధికంగా 30శాతం మంది శాకాహారులు ఉన్నారు. తర్వాత ఇజ్రాయెల్లో 13 శాతం మంది ఉన్నారు. ఈ దేశంలో వెజిటేరియన్గా మారేందుకు ప్రజలు మొగ్గుచూపుతున్నారట. ఇక ఇటలీలో 10 శాతం మంది ఉండగా వీరంతా రోజూ ఆకుకూరలు, మిగతా కూరగాయలు తినేందుకు ఇష్టపడుతున్నారు. తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా (9%), జర్మనీ (9%), బ్రెజిల్ (8%) ఉన్నాయి.
AP: కడపలో వేలాడుతున్న విద్యుత్ తీగలు తగిలి తన్వీర్(11) అనే చిన్నారి మృతి చెందిన <<13908683>>ఘటన<<>> తీవ్ర ఆవేదనకు గురిచేసిందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. అతడి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. విద్యుదాఘాతంతో గాయపడిన మరో విద్యార్థికి మెరుగైన వైద్యం అందించాల్సిందిగా అధికారులకు సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని లోకేశ్ ఆదేశించారు.
అమ్ముడుపోని ఇళ్లను తగ్గించుకొనేందుకు ఢిల్లీ అభివృద్ధి సంస్థ 3 హౌసింగ్ స్కీమ్స్ తెచ్చింది. పేదలు, తక్కువ ఆదాయ వర్గాలకు ₹11.5 లక్షల చొప్పున 34177 ఫ్లాట్లను అందిస్తోంది. రెండో స్కీమ్లో మధ్య, అధిక ఆదాయ వర్గాల కోసం ₹29 లక్షల చొప్పున 5531 ఫ్లాట్లను కేటాయించింది. మూడో స్కీమ్లో ₹1.28 కోట్ల చొప్పున 173 ఫ్లాట్లను విక్రయిస్తోంది. కొన్ని ప్రీమియం ఇళ్లను ₹5 కోట్లకు ఇస్తోంది.
TG: BRS MLA హరీశ్ రావు రేపు యాదగిరి గుట్ట లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకోనున్నారు. రూ.2లక్షల రుణమాఫీ చేస్తానని యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామిపై ఒట్టుపెట్టి సీఎం రేవంత్ మాట తప్పారని, దానికి పాపపరిహారం చేయాలని హరీశ్ అన్నారు. సీఎం చేసిన పాపం ప్రజలకు తాకకుండా చూడాలని తాను నర్సింహస్వామిని ప్రార్థిస్తానన్నారు. పాపాత్ముడైన సీఎం రేవంత్ను క్షమించాలని దేవుడిని వేడుకుంటానని ప్రెస్నోట్ రిలీజ్ చేశారు.
తనకు సినిమా అంటే ఇష్టమని హీరో నాని అన్నారు. ప్రత్యేకించి జానర్ ఏమీ లేకుండా నెరేషన్ను ఎంజాయ్ చేస్తానని తెలిపారు. ‘సరిపోదా శనివారం’ మూవీ ప్రమోషన్లలో ఆయన మాట్లాడారు. ‘బలగం’ వేణు లాంటి దర్శకులతో వర్క్ చేయాలని ఉందని, త్వరలోనే తమ కాంబోలో చిత్రం ఉంటుందని తెలిపారు. అయితే ఎప్పుడనేది మాత్రం చెప్పలేనన్నారు. ప్రభాస్పై విమర్శలు చేసిన బాలీవుడ్ నటుడికి ఇప్పుడే బిగ్గెస్ట్ పబ్లిసిటీ జరిగి ఉంటుందన్నారు.
ఐదు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తమకు యాషెస్ కన్నా తక్కువేమీ కాదని ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ అన్నారు. సొంతగడ్డపై ప్రతి మ్యాచులోనూ టీమ్ఇండియాను ఓడించి సిరీస్ను వైట్వాష్ చేయడమే తమ లక్ష్యమన్నారు. 2014-15 నుంచి వరుసగా 4సార్లు BGTని గెలిచిన భారత్ను అడ్డుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. WTCలో ఈ రెండు జట్లే అగ్రస్థానంలో ఉండటంతో ఆటగాళ్లు, అభిమానులకు సిరీస్ ఆసక్తికరంగా ఉండబోతోందని అంచనా వేశారు.
AP: శాసనమండలి ఫ్లోర్ లీడర్ పదవికి లేళ్ల అప్పిరెడ్డి రాజీనామా చేశారు. దీంతో వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణను మండలిలో ప్రతిపక్ష నేతగా నియమించే అవకాశం ఉంది. కాసేపట్లో దీనిపై పార్టీ అధికారిక ప్రకటన చేయనుంది. కాగా కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.
Sorry, no posts matched your criteria.