News November 19, 2024
US ఎలక్షన్స్: ద్రవ్యోల్బణమే ట్రెండింగ్ టాపిక్

US అధ్యక్ష ఎన్నికల్లో ద్రవ్యోల్బణం ట్రెండింగ్ టాపిక్గా నిలిచినట్లు గూగుల్ వేవ్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ వెల్లడించింది. 2020తో పోలిస్తే 114% అధికంగా దీని గురించే సెర్చ్ చేశారని తెలిపింది. ఆ తర్వాత పెన్షన్ ఫండ్స్(76%), బడ్జెట్ లోటు(39%) అంశాలు ఉన్నాయంది. రేసిజం, స్టూడెంట్ లోన్స్, గన్ కంట్రోల్పై చర్చ బాగా తగ్గిందని పేర్కొంది. 2020లో ఎలక్ట్రోరల్ ఫ్రాడ్, 2016లో ఒపీనియన్ పోల్ ట్రెండింగ్లో నిలిచాయి.
Similar News
News July 11, 2025
శ్రీశైలం నీళ్లు ఎలా వాడుకుంటారో తెలుసా?

శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్ నుంచి రాయలసీమ, తెలంగాణకు నీరందుతోంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 44వేల క్యూసెక్కులను రాయలసీమకు తరలించొచ్చు. తెలుగు గంగ, గాలేరు-నగరి కాలువల ద్వారా కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలకు నీరందుతోంది. హంద్రీ-నీవా ఎత్తిపోతల పథకంతో అనంతపురం, చిత్తూరుకు నీరు వెళ్తోంది. అటు తెలంగాణ కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల ద్వారా లబ్ధి పొందుతోంది.
News July 11, 2025
ఇలా చేస్తే మీ ఆధార్ వివరాలు సేఫ్: UIDAI

ఆధార్ సమాచారం దుర్వినియోగం కాకుండా కాపాడుకునేందుకు బయోమెట్రిక్ లాక్ చేసుకోవాలని UIDAI పేర్కొంది. దీనికోసం <
News July 11, 2025
జగన్ పర్యటన.. మొత్తం నాలుగు కేసులు నమోదు

AP: YS జగన్ చిత్తూరు(D) బంగారుపాళ్యం పర్యటనపై తాజాగా మరో కేసు నమోదైంది. అనుమతి లేకున్నా రోడ్షో చేపట్టారని పోలీసులు కేసు నమోదు చేశారు. పరిమితికి మించి జన సమీకరణ చేపట్టారని, రోడ్డుపై మామిడికాయలు పారబోసి షరతులు ఉల్లంఘించారని, ఫొటోగ్రాఫర్పై జరిగిన దాడి ఘటనపై 3 వేర్వేరు కేసులు పెట్టారు. CC ఫుటేజ్, వీడియోలను పరిశీలిస్తున్న పోలీసులు మరికొందరిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.