India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బాలీవుడ్ సినిమాలు భారత్ను చెడుగా చూపిస్తుంటాయని కన్నడ నటుడు రిషబ్ శెట్టి వ్యాఖ్యానించారు. ‘బాలీవుడ్ సినిమాలకు ప్రపంచ సినీ వేదికలపైకి ఆహ్వానం దక్కుతుంటుంది. మన దేశం, మన రాష్ట్రం, మన భాష మనకు గర్వకారణం. దాన్ని వారెందుకు గొప్పగా చూపించరు?’ అని ప్రశ్నించారు. ఆయన విమర్శల పట్ల బాలీవుడ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ‘కాంతార’లో ఆయన పాత్ర హీరోయిన్తో ప్రవర్తించే తీరును గుర్తుచేస్తూ పోస్టులు పెడుతున్నారు.
ఓవర్ టైం సదుపాయం వినియోగంలో ఉద్యోగులు, సిబ్బంది అవకతవకలను అరికట్టడంపై రైల్వే బోర్డు ఫోకస్ పెట్టింది. అన్ని రైల్వే స్టేషన్లలో సిబ్బంది కోసం బయోమెట్రిక్ హాజరు యంత్రాలు లేదా ఫేషియల్ రికగ్నిషన్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని 17 రైల్వే జోన్ల GMలను ఆదేశించింది. రైల్వే విజిలెన్స్ డైరెక్టరేట్ చేసిన సిఫార్సుల మేరకు బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.
TG: జూనియర్ కాలేజీల్లో ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల గడువును ఆగస్టు 31 వరకు పొడిగించారు. గతంలో ప్రకటించిన గడువు ఇటీవల ముగియడంతో తాజాగా మరోసారి పెంచారు. 2024-25 విద్యాసంవత్సరానికి ఇక గడువు పెంపు ఉండదని ఇంటర్ బోర్డు సంచాలకురాలు శృతి ఓజా స్పష్టం చేశారు.
స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్గా ట్రేడవుతున్నాయి. క్రితం సెషన్లో 80802 వద్ద ముగిసిన BSE సెన్సెక్స్ నేడు 80667 వద్ద మొదలైంది. 112 పాయింట్ల నష్టంతో 80697 వద్ద చలిస్తోంది. 24680 వద్ద ఓపెనైన NSE నిఫ్టీ 13 పాయింట్లు తగ్గి 24685 వద్ద కొనసాగుతోంది. బ్యాంకు నిఫ్టీ 346 పాయింట్లు పతనమై 50456 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో 29:20గా ఉంది. దివిస్ ల్యాబ్, డాక్టర్ రెడ్డీస్ టాప్ గెయినర్స్.
కోల్కతా వైద్యురాలి హత్యాచార కేసులో నిందితుడు సంజయ్ రాయ్, దారుణానికి ఒడిగట్టే ముందు వ్యభిచార గృహాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. కోల్కతా పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. ఈ నెల 8న రాత్రి మద్యం సేవించిన రాయ్, RG కర్కు చెందిన మరో వాలంటీర్తో కలిసి రెడ్ లైట్ ఏరియాకు వెళ్లాడు. తెల్లవారుజామున ఆస్పత్రికి తిరిగి వచ్చాడు. ఆ సమయంలో సెమినార్ హాల్లో గాఢనిద్రలో ఉన్న బాధితురాలిని చూసి అత్యాచారానికి ఒడిగట్టాడు.
RBI గవర్నర్ శక్తికాంత దాస్కు గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ కార్డ్స్-2024 మరోసారి ‘A+’ రేటింగ్ ఇచ్చింది. గత ఏడాది కూడా ఆయనకు ఇదే గ్రేడ్ దక్కింది. ఈ సందర్భంగా దాస్ను PM మోదీ, వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా అభినందించారు. దాదాపు 100 దేశాల సెంట్రల్ బ్యాంకుల గవర్నర్లకు మాంద్యం నియంత్రణ, ఆర్థిక వృద్ధి వంటి వాటి ఆధారంగా గ్లోబల్ ఫైనాన్స్ సంస్థ 1994 నుంచి గ్రేడ్స్ ఇస్తోంది.
TG: కన్వీనర్ కోటాలో బీటెక్ సీట్లు పొంది కాలేజీల్లో చేరిన విద్యార్థులు తమ శాఖను మార్చుకునేందుకు నేటి నుంచి స్లైడింగ్ విండో ఓపెన్ అయింది. బ్రాంచి మారినప్పటికీ బోధనా రుసుము అందుతుందని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ఈరోజు ఉదయం 11.30 గంటల నుంచి ఖాళీ సీట్ల తుది జాబితాను వెబ్సైట్లో ఉంచనున్నట్లు పేర్కొన్నాయి. మధ్యాహ్నం రెండింటి నుంచి రేపటి వరకు ఆప్షన్ల నమోదు, ఈ నెల 24న సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపాయి.
సెలూన్లు, బ్యాచిలర్ రూంలలో ఒకే ట్రిమ్మర్ చాలా మంది వాడుతారు. దీంతో ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లేనని డెర్మటాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. ముందు ట్రిమ్మర్ వాడిన వ్యక్తికి HIV, హెపటైటిస్ (B, C), పింపుల్స్, చర్మ వ్యాధులు ఉంటే రెండో వ్యక్తికీ వచ్చే అవకాశం ఎక్కువని హెచ్చరిస్తున్నారు. ట్రిమ్మర్ వాడాల్సి వస్తే బ్లేడ్ను తప్పకుండా వేడినీటిలో వాష్ చేయాలని, కొన్నిగంటల గ్యాప్ ఇచ్చి వాడాలని సూచిస్తున్నారు.
1996లో సీఎం చంద్రబాబు ఎస్సీల్లో రిజర్వేషన్లు అందని వర్గాలను గుర్తించాలని కమిషన్ ఏర్పాటు చేశారు. ఎస్సీలకు అందుతున్న 15% రిజర్వేషన్లను A, B, C, Dగా వర్గీకరిస్తూ జీవో ఇచ్చారు. A గ్రూపులో రెల్లి సహా 12 కులాలను కలుపుతూ 1%, మాదిగ, దాని 18 ఉపకులాలను Bలో చేర్చి 7%, C గ్రూపులోని మాల, ఉపకులాలకు 6%, D గ్రూపులోని ఆంధ్రులు, మిగతా 4 కులాలకు 1% కోటా అమలు చేశారు. దీనిపై కోర్టులో అభ్యంతరం తెలపడంతో ఆగిపోయింది.
Sorry, no posts matched your criteria.