News November 19, 2024

వాటర్ హీటర్ వాడుతున్నారా?

image

*అల్యూమినియం బకెట్ మాత్రమే వాడండి. ఇనుప బకెట్ షాకిచ్చే అవకాశం ఉంటుంది. ప్లాస్టిక్ బకెట్ అయితే కరిగిపోయే ఛాన్స్ ఉంది.
*స్విచ్ ఆఫ్ చేసి హీటర్ బకెట్‌లో నుంచి తీసిన తర్వాతే నీళ్లు వేడి అయ్యాయో లేదో చూడాలి. లేదంటే షాక్ ఇచ్చే ప్రమాదం ఉంది.
*పిల్లలు తిరిగే దగ్గర వాటర్ హీటర్ వాడకండి.
*హీటింగ్ కాయిల్ (రాడ్) నీటిలో మునిగేలా ఉంచండి.
*ISI మార్క్, షాక్ ప్రూఫ్ హీటర్లనే కొనుగోలు చేయండి.

News November 19, 2024

రేపే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

image

మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు రేపు పోలింగ్ జరగనుంది. మహాయుతి కూటమిలోని బీజేపీ 149, శివసేన 81, NCP 59 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. మహా వికాస్ అఘాడీ కూటమిలోని కాంగ్రెస్ 101, శివసేన (UT) 95, NCP (SP) 86 స్థానాల్లో బరిలోకి దిగుతున్నాయి. మరోవైపు ఝార్ఖండ్‌లో రెండో విడతలో భాగంగా 38 స్థానాలకు, యూపీలో 9 స్థానాలకు (ఉపఎన్నిక) రేపే పోలింగ్ జరగనుంది. ఈనెల 23న ఓట్లను లెక్కించనున్నారు.

News November 19, 2024

కేసీఆర్ చెబితే మూసీ శుద్ధి పనులు ఆపేస్తాం: కోమటిరెడ్డి

image

TG: 80వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ మూసీ శుద్ధి చేయొద్దని చెబితే వెంటనే ప్రాజెక్టును ఆపేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ విసిరారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుకు అరెస్ట్ భయం పట్టుకుందని, అందుకే అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఇక కిషన్ రెడ్డి నగరంలో మూసీ పక్కన ఒక్క రాత్రి నిద్రించడం కాదని, దమ్ముంటే 3 నెలలు నల్గొండలో నిద్ర చేయాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు.

News November 19, 2024

CAGగా తెలుగు వ్యక్తి

image

భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG)గా ఏపీకి చెందిన IAS ఆఫీసర్ కొండ్రు సంజయ్ మూర్తి నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్నారు. సంజయ్ మూర్తిని CAGగా నియమిస్తూ రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. సంజయ్ మూర్తి తండ్రి KSR మూర్తి అమలాపురం ఎంపీగా పని చేశారు. 1964లో జన్మించిన సంజయ్ 1989లో హిమాచల్‌ప్రదేశ్ క్యాడర్‌లో IASగా ఎంపికయ్యారు.

News November 19, 2024

సన్నబియ్యం పంపిణీ ఆలస్యం!

image

TG: రేషన్ కార్డుదారులకు సంక్రాంతి నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రభుత్వం చెప్పినా 3 నెలలు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త ధాన్యాన్ని వెంటనే మిల్లింగ్ చేస్తే బియ్యంలో నూక శాతం పెరుగుతుందని, అన్నం ముద్దగా మారుతుందని అధికారులు తెలిపారు. కనీసం 3 నెలల పాటు ధాన్యాన్ని తప్పకుండా నిల్వ చేయాల్సి ఉంటుందన్నారు. దీంతో ఉగాది నుంచి ఈ స్కీం అమలయ్యే అవకాశం ఉంది.

News November 19, 2024

సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ అప్‌డేట్స్

image

☛ ఈనెల 23 నుంచి మ్యాచులు ప్రారంభం, DEC 15న ఫైనల్
☛ ముంబై కెప్టెన్‌గా శ్రేయస్. జట్టులో రహానె, పృథ్వీ షా, శార్దూల్‌కు చోటు
☛ బెంగాల్ జట్టుకు ఎంపికైన మహ్మద్ షమీ
☛ UP కెప్టెన్‌గా భువనేశ్వర్ కుమార్, జట్టులో సభ్యులుగా రింకూ సింగ్, నితీశ్ రాణా, యశ్ దయాల్, మోసిన్ ఖాన్.
☛ HYD టీమ్ కెప్టెన్‌గా తిలక్ వర్మ, కర్ణాటక కెప్టెన్‌గా మయాంక్ అగర్వాల్
☛ జియో సినిమా యాప్‌లో లైవ్ మ్యాచులు .

News November 19, 2024

అరకులో 8.9 డిగ్రీల ఉష్ణోగ్రత

image

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో 8.9 డిగ్రీలు, డుంబ్రిగుడలో 9.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటు తెలంగాణలోని తిర్యాణి (ఆసిఫాబాద్), జహీరాబాద్ (సంగారెడ్డి)లో 12.1 టెంపరేచర్ రికార్డయింది. హైదరాబాద్ BHELలో 13.3 డిగ్రీలుగా ఉంది. నవంబర్ 28 వరకు చలి ఇలాగే కొనసాగుతుందని వాతావరణ నిపుణులు తెలిపారు.

News November 19, 2024

నేటి నుంచి డిగ్రీ కాలేజీలు బంద్!

image

TG: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు నేటి నుంచి నిరవధిక బంద్‌కు సిద్ధమయ్యాయి. రూ.2వేలకోట్ల బకాయిలు విడుదల చేసే వరకూ కాలేజీల బంద్‌ను కొనసాగిస్తామని, సెమిస్టర్ పరీక్షలనూ బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్యాల సంఘం ప్రకటించింది. ఈ బంద్‌లో కాలేజీలు పాల్గొనాలని ఓ ప్రకటనలో పిలుపునిచ్చింది.

News November 19, 2024

ఈనెల 26న గ్రూప్-4 నియామక పత్రాల అందజేత?

image

TG: గ్రూప్-4 ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు ఈనెల 26న నియామక పత్రాలు ఇచ్చే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. ఈనెల 14న గ్రూప్-4 ఫలితాలను ప్రభుత్వం విడుదల చేయగా, 8084 మంది ఎంపికైన సంగతి తెలిసిందే.

News November 19, 2024

ACA ఉమెన్స్ క్రికెట్ ఆపరేషన్స్ మెంటార్‌గా మిథాలీ

image

ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌లో మహిళల క్రికెట్ ఆపరేషన్స్ మెంటార్‌గా భారత మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ నియమితులయ్యారు. రాష్ట్రంలో ప్రతిభావంతులైన క్రికెటర్లను గుర్తించి, వారిని ఉత్తమ క్రికెటర్లుగా తీర్చిదిద్దేందుకు ఆమె ACAతో కలిసి మూడేళ్లు పని చేయనున్నారు. అనంతపురంలో హై-పెర్ఫార్మెన్స్ అకాడమీని ఏర్పాటు చేసి, 80 మంది బాలికలను ఎంపిక చేసి 365 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు ACA తెలిపింది.