India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: ప్రజలతో అన్న క్యాంటీన్ల నిర్వహణ జరిగితే చాలా బాగుంటుందని ఉండి MLA రఘురామ కృష్ణరాజు అభిప్రాయపడ్డారు. ప్రజల సహకారంతో ప్రభుత్వంపై భారం లేకుండా క్యాంటీన్ల నిర్వహణ కొనసాగాలన్నదే తన ఆకాంక్ష అని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు చెప్పిన దాని కంటే ఎక్కువగానే అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశారన్నారు. గత YCP ప్రభుత్వం AP ఆర్థిక వ్యవస్థను చింపిన విస్తరిలా చేసిందని దుయ్యబట్టారు.
మలయాళ చిత్రసీమలో మహిళలను వేధించడంపై జస్టిస్ హేమా కమిటీ GOVTకి అందించిన నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అంతకుముందు తనను లైంగికంగా వేధించిన హీరోతో హగ్ సీన్ చేసేందుకు ఓ నటి ఇబ్బంది పడ్డారని, 17 టేక్స్ తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించింది. ఇండస్ట్రీని ఓ మాఫియా కంట్రోల్ చేస్తోందని, సినిమా ఛాన్సు కావాలంటే తమ లైంగిక వాంఛలు తీర్చాలంటూ నటీమణులపై ఒత్తిళ్లున్నాయని పేర్కొంది.
AP: సెప్టెంబర్లో యూకే వెళ్లేందుకు అనుమతి కోరిన మాజీ సీఎం జగన్ పిటిషన్పై విచారణను సీబీఐ కోర్టు రేపటికి వాయిదా వేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు సీబీఐ సమయం కోరింది. అటు సెప్టెంబర్, అక్టోబర్లో యూరప్ వెళ్లేందుకు అనుమతించాలని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సైతం పిటిషన్ వేశారు. విచారణను సీబీఐ కోర్టు ఈనెల 30కి వాయిదా వేసింది.
పాకిస్థాన్ స్టేడియాలు అంతర్జాతీయ ప్రమాణాలకు ఆమడ దూరంలో ఉన్నాయని PCB ఛైర్మన్ మోహిసిన్ నఖ్వీ అంగీకరించారు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025 లోపు వీటిని పునరుద్ధరించడం సులభమేమీ కాదన్నారు. ‘ఒక్క స్టేడియమైనా అంతర్జాతీయ స్థాయికి తగినట్టు లేదు. సీట్లు లేవు. బాత్రూమ్లు లేవు. అర కిలోమీటర్ దూరం నుంచి మ్యాచ్ చూస్తున్న ఫీలింగ్. గఢాపీ స్టేడియాన్ని కీలక మ్యాచులకు సిద్ధం చేస్తాం’ అని ఆయన అన్నారు.
AP: ప్రముఖ ఐటీ సంస్థ HCL రాష్ట్రంలో తమ కార్యకలాపాలను విస్తరించనుందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. దీని ద్వారా 15,000 ఉద్యోగాలు లభించనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు HCL కంపెనీ ప్రతినిధులతో భేటీ అయినట్లు Xలో ఆయన వెల్లడించారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహాయసహకారాలు ఆ సంస్థకు అందిస్తామని చెప్పారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో HCL ఏపీలో తమ సంస్థను నెలకొల్పి 4,500 మందికి ఉద్యోగాలు కల్పించిందని తెలిపారు.
TG: ఇటీవల BRS నుంచి కాంగ్రెస్లో చేరిన మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డికి క్యాబినెట్ హోదా దక్కింది. ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా పోచారాన్ని ప్రభుత్వం నియమించింది. గత బీఆర్ఎస్ హయాంలో పోచారం వ్యవసాయశాఖ మంత్రిగా పని చేశారు.
GHMC ఇన్ఛార్జ్ కమిషనర్గా ఉన్న ఆమ్రపాలికి పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూసీ రివర్ డెవలప్మెంట్ ఎండీగా దాన కిశోర్ను నియమించింది. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్, HMDA జాయింట్ కమిషనర్గా కోట శ్రీవాత్సవ, హైదరాబాద్ HMWS&SB ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మయాంక్ మిట్టల్, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్గా చాహత్ బాజ్పెయిని బదిలీ చేసింది.
TG: యాదాద్రి, గద్వాల్, నారాయణపేట్ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. మేడ్చల్, వనపర్తి, హన్మకొండ, KMM, MBNR, నాగర్కర్నూల్, NLG, NZB, RR, సిద్దిపేట, HYD జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షం కురుస్తోంది. రేపు ADB, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, VKB, సంగారెడ్డి, MDK, కామారెడ్డి, MBNR, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం పేర్కొంది.
తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎండాకాలం మాదిరి ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. AC, కూలర్లు వేసినా ప్రయోజనం ఉండట్లేదని వాపోతున్నారు. APలో వర్షాలు తక్కువగా ఉండగా ఉక్కపోత విపరీతంగా ఉంటోంది. TGలో ఓవైపు వర్షాలు దంచికొడుతున్నా ఉక్కపోత, చెమటతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మరోవైపు ఎండ కూడా అదిరిపోతోంది. వాతావరణంలో తేమ శాతం అధికంగా ఉండటం, అరేబియా సముద్రంలో అల్పపీడనంతో ఈ మార్పులు వచ్చాయని నిపుణులు చెబుతున్నారు.
బిగ్బాస్-8 త్వరలోనే ప్రారంభం కానుంది. కంటెస్టెంట్ల విషయంలో పలు వార్తలు తెరపైకి వస్తున్నాయి. వివాదాస్పద జ్యోతిషుడు వేణుస్వామి కూడా హౌస్లోకి వెళ్తారని ప్రచారం జరుగుతోంది. అయితే తొలుత ఆయన పేరును పరిశీలించినా హోస్ట్ నాగార్జున కొడుకు నాగచైతన్య-శోభిత ఎంగేజ్మెంట్పై హాట్ <<13814839>>కామెంట్స్<<>> చేయడంతో పక్కన పెట్టినట్లు సమాచారం. ఇక ప్రస్తుతం వేణుస్వామి, జర్నలిస్ట్ మూర్తి మధ్య <<13896275>>వివాదం<<>> నడుస్తోంది.
Sorry, no posts matched your criteria.