India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సూర్య, దిశా పటానీ కాంబినేషన్లో శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కంగువా’ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల కలెక్షన్లు దాటేసింది. 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.127.64 కోట్ల వసూళ్లు సాధించినట్లు మూవీ యూనిట్ ట్వీట్ చేసింది. గురువారం థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది.

AP: భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి త్వరలోనే కొత్త విధానం అమల్లోకి తీసుకొస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. డిసెంబర్ 15 నాటికి ఈ విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉందని, దీనికి సంబంధించి త్వరలోనే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడతామన్నారు. 20 రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన తర్వాతే కొత్త విధానం రూపొందించామని నెల్లూరులో అధికారులతో సమీక్షలో మంత్రి చెప్పారు. ప్రజలు తమ పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని కోరారు.

రోజూ ఉదయమే నిద్రలేచి వ్యాయామం, వాకింగ్ చేయాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే దీనికోసం ఉదయం 4/5 గంటలకే లేచి ఎక్కువసేపు వ్యాయామం చేయడం మంచిదా? అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. డా. సుధీర్ కుమార్ రిప్లై ఇచ్చారు. ‘అందరికీ 7-9 గంటలు నిద్ర అవసరం. నిత్యం తక్కువ నిద్రపోయి ఎక్కువసేపు వ్యాయామం చేయడం మంచిదికాదు. వ్యాయామం చేసేముందు వాంఛనీయ నిద్ర ఉండేలా చూసుకోండి’ అని ఆయన సూచించారు. మీరు రోజూ ఎంతసేపు నిద్రపోతారు?

హెజ్బొల్లా మీడియా రిలేషన్స్ చీఫ్ మహ్మద్ అఫీఫ్ను ఇజ్రాయెల్ హతమార్చింది. బీరుట్లో జరిపిన ఐడీఎఫ్ వైమానిక దాడిలో అఫీఫ్ మృతి చెందారు. మరోవైపు ఇజ్రాయెల్ సైన్యం గాజాలోనూ దాడులు చేస్తోంది. ఇవాళ జరిపిన దాడుల్లో 12 మంది పౌరులు మరణించారు. కాగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇంటిపై దాడి జరిగింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. వికారాబాద్(D) లగచర్ల గిరిజనులతో కలిసి జాతీయ ST కమిషన్కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. లగచర్లలో ఫార్మా భూసేకరణపై చర్చించే క్రమంలో కలెక్టర్పై పలువురు దాడికి పాల్పడ్డారు. దీంతో గ్రామస్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

తెలంగాణ వ్యాప్తంగా 1401 ఎగ్జామ్ సెంటర్లలో ఇవాళ జరిగిన గ్రూప్-3 పరీక్ష రాసేందుకు అభ్యర్థులు అంతగా ఆసక్తి చూపలేదు. 5.36 లక్షల మంది పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోగా, 76.4శాతం మంది హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. ఉదయం పేపర్-1కు 2,73,847 మంది, పేపర్-2కు 2,72,173 మంది మాత్రమే హాజరైనట్లు TGPSC ప్రకటించింది. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 64శాతం మంది పరీక్షకు హాజరయ్యారు.

TG: వరంగల్ మాస్టర్ప్లాన్-2041కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్లాన్ను ఆమోదిస్తూ జీవో 202 జారీ చేసింది. ముసాయిదా మాస్టర్ ప్లాన్పై 2018లో కుడా స్వీకరించిన అభ్యంతరాలు, భూ వినియోగ జోన్లు, ఇతర నియంత్రణలపై రేపు గెజిట్ విడుదల చేయనుంది. 2041 నాటికి వరంగల్ జనాభాను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ మాస్టర్ ప్లాన్ రూపొందించినట్లు సమాచారం.

కన్నడ నటుడు డాలీ ధనంజయ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. ధన్యత అనే డాక్టర్తో ఇవాళ ఆయన నిశ్చితార్థం జరిగింది. కర్ణాటక హసన్ జిల్లాలోని ఆయన ఇంట్లో ఎలాంటి ఆడంబరాలు లేకుండా కుటుంబసభ్యుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 16న మైసూర్లో వీరిద్దరి వివాహం జరగనుంది. కాగా, ‘పుష్ప’ సినిమాలో జాలిరెడ్డిగా ధనంజయ నటించిన విషయం తెలిసిందే.

TG: ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే వారి మాటలు నమ్మి మోసపోవద్దని మంత్రి దామోదర రాజ నర్సింహ నిరుద్యోగులకు సూచించారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని చెప్పారు. ఇందులో ఎలాంటి రాజీ లేదని తెలిపారు. ఆరోగ్య శాఖలో 11 నెలల్లోనే 7వేలకు పైగా పోస్టులను భర్తీ చేశామని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని నోటిఫికేషన్లు వస్తాయన్నారు. దళారుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

AP అసెంబ్లీలో రేపు పలు తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. శాసనసభలో 8 డివిజనల్, 4 రైల్వే జోనల్ కమిటీలు, యూజర్ కన్సల్టింగ్ కమిటీలకు స్థానిక ఎమ్మెల్యేలను రెండేళ్ల కాలానికి సభ్యులుగా ఎన్నుకునేలా తీర్మానం ప్రవేశపెడతారు.
రేపు అసెంబ్లీలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వీటిని ప్రవేశపెట్టనున్నారు. అలాగే బడ్జెట్ సహా పలు అంశాలపై రేపు చర్చలు జరగనున్నాయి.
Sorry, no posts matched your criteria.