India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో ఇప్పటికే నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం తదితర జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈక్రమంలోనే రేపు కూడా ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలున్నాయని APSDM తెలిపింది.

AP: జగన్ హయాంలో ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా ఆగిపోలేదని వైసీపీ నేత కురసాల కన్నబాబు తెలిపారు. కొవిడ్ సమయంలోనూ వాటిని ప్రజలకు అందించామని చెప్పారు. ‘రాష్ట్రాన్ని జగన్ సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లారు. కానీ రాష్ట్రాన్ని వైసీపీ విధ్వంసం చేసిందని, చంద్రబాబు ఏదో అద్భుతం చేసినట్లు మాట్లాడుతున్నారు. ఇప్పటికీ ఒక్క పథకం కూడా ప్రారంభించలేదు. శాసనసభలో టీడీపీ పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తోంది’ అని ఆయన మండిపడ్డారు.

ఛాంపియన్స్ ట్రోఫీ టూర్కు సంబంధించి పీసీబీకి ఐసీసీ కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(POK)లో టూర్ నిర్వహించొద్దని సూచించినట్లు సమాచారం. ఇందుకు పీసీబీ కూడా అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా దేశవ్యాప్త ప్రదర్శన కోసం ఛాంపియన్స్ ట్రోఫీని ఐసీసీ ఇప్పటికే పాకిస్థాన్కు పంపింది. పాక్లోని ప్రధాన నగరాల్లో దీనిని ప్రదర్శనకు ఉంచుతారు.

ఎదిగేందుకు, లక్ష్యాలను సాధించేందుకు వయసు అన్న పదం అడ్డు కాకూడదు. ఇంకే చేయగలంలే అంటూ డీలా పడకూడదు. KFCని శాండర్స్ తన 62వ ఏట మొదలుపెట్టారు. పోర్షేను ఫెర్డినాండ్ 56వ ఏట, స్టార్ బక్స్ను గోర్డన్ తన 51వ ఏట, వాల్మార్ట్ను శామ్ వాల్టన్ 44వ ఏట, కోకాకోలాను ఆసా కాండ్లర్ 41వ ఏట ప్రారంభించారు. సాధించాలన్న తపన, సాధించగలమన్న నమ్మకమే వీరిని విజయతీరాలకు చేర్చాయి.

ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) టెలికమ్యూనికేషన్ విభాగంలో 526 ఎస్సై, హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి DEC 14 వరకు మహిళలు, పురుషులు అప్లై చేసుకోవచ్చు. ఎస్సై పోస్టులకు 20-25 ఏళ్లు, హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు 18-25 ఏళ్లు ఉండాలి. ఎస్సైల పే స్కేల్ రూ.35,400-1,12,400, హెడ్ కానిస్టేబుల్ పే స్కేల్ రూ.25,500-81,100గా ఉంది. సైట్: recruitment.itbpolice.nic.in

తమ సినిమాలు వస్తున్నప్పుడే పోటీ సినిమాలు సెంటిమెంట్ కార్డ్ ప్లే చేస్తుంటాయని నిర్మాత నాగవంశీ వ్యాఖ్యానించారు. ‘మా సినిమాలకు పోటీగా విడుదల చేసే సినిమావాళ్లే తమ కష్టాలు, కన్నీళ్లు గురించి చెబుతుంటారు. మేం రిలీజ్ పెట్టుకున్నప్పుడే ఇలాంటివి ఎందుకు జరుగుతాయో మరి! ఇకపై మేము కూడా సింపతీ మాటలు చెప్పాలేమో’ అని పేర్కొన్నారు. ఈ ఏడాది సంక్రాంతికి ‘గుంటూరు కారం’కు పోటీగా హనుమాన్ విడుదలైన సంగతి తెలిసిందే.

తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల వెళ్లే భక్తుల కోసం SCR 8 స్పెషల్ రైళ్లను ప్రకటించింది. ఈ నెల 22, 29 తేదీల్లో మౌలాలి-కొల్లం, 18, 25 తేదీల్లో మచిలీపట్నం-కొల్లం, ఈ నెల 24, డిసెంబర్ 1న కొల్లం-మౌలాలి, ఈ నెల 20, 27 తేదీల్లో కొల్లం-మచిలీపట్నం మధ్య ఈ 8 సర్వీసులు తిరుగుతాయని వెల్లడించింది. పైన ఫొటోలో రైలు టైమింగ్స్, హాల్టింగ్స్ వివరాలు చూడొచ్చు.

నిన్న విడుదలైన కంగువ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆడియో చాలా లౌడ్గా, ఇబ్బందిగా ఉందన్న విమర్శలు వచ్చాయి. ఆస్కార్ విన్నింగ్ సౌండ్ ఇంజినీర్ రెసూల్ సైతం దీనిపై పెదవి విరిచారు. పెద్ద సినిమాలు సౌండ్ డిజైనింగ్ లౌడ్నెస్ యుద్ధంలో చిక్కుకుంటున్నాయని విమర్శించారు. ఈ నేపథ్యంలో ‘కంగువ’ థియేటర్లలో సౌండ్ తగ్గించాలని ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజా సూచించినట్లు తెలుస్తోంది.

ఈ నెల 3న ఖలిస్థానీ వేర్పాటువాదులతో కలిసి ర్యాలీలో పాల్గొన్న ఓ పోలీసు అధికారికి కెనడా సర్కారు క్లీన్ చిట్ ఇచ్చింది. బ్రాంప్టన్లోని హిందూ దేవాలయంలోకి చొరబడిన నిరసనకారులు భక్తులపై దాడి చేశారు. వారితో వెళ్లిన పోలీసు అధికారి హరీందర్ సోహీని పోలీసు శాఖ సస్పెండ్ చేసింది. అయితే, ఆయన చట్టబద్ధంగా వ్యవహరించినట్లు దర్యాప్తులో గుర్తించామని పేర్కొంటూ తాజాగా నిర్దోషిగా ప్రకటించింది.

మన దేశానికున్న అతిపెద్ద బలం టెంపుల్ టూరిజం. కాశీ, అయోధ్య, ప్రయాగ వల్ల UPకి ఆదాయం బాగా పెరిగింది. హోటల్ సహా అనేక అనుబంధ రంగాలు రాణిస్తున్నాయి. తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం, ఒంటిమిట్ట, శ్రీశైలం, విజయవాడ, ద్రాక్షారామం, అన్నవరం, అరసవెల్లి, సింహాచలం, ఆంధ్రమహా విష్ణు వంటి ఆలయాలు AP సొంతం. వీటిపై మరింత ఫోకస్ పెట్టి టెంపుల్ టూరిజాన్ని పెంచితే రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని నిపుణులు అభిప్రాయం. మీరేమంటారు?
Sorry, no posts matched your criteria.