India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

చికెన్, మటన్, ఫిష్ కూరలతోపాటు పాల ఉత్పత్తులు తినకూడదనే మాట మనం వింటూ ఉంటాం. దీనివల్ల వికారం, డైజేషన్ సమస్యలు వస్తాయని చెబుతుంటారు. అయితే అదంతా ఉత్తిదేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ‘ఇలా తినడం హానికరమనే దానికి శాస్త్రీయత లేదు. మాంసం, డైరీ ఉత్పత్తుల నుంచి ప్రొటీన్లు, కొవ్వులను విచ్ఛిన్నం చేయడానికి శరీరం ప్రత్యేక ఎంజైమ్లను ఉపయోగిస్తుంది. కాబట్టి జీర్ణక్రియలో సమస్యలు ఉండవు’ అని పేర్కొంటున్నారు.

UNలో ఇరాన్ అంబాసిడర్ ఆమిర్ సయీద్తో బిలియనీర్ ఎలాన్ మస్క్ సమావేశమైనట్టు తెలిసింది. సోమవారం న్యూయార్క్లో వీరిద్దరూ గంటకు పైగా రహస్యంగా చర్చించారని US మీడియా పేర్కొంది. టెహ్రాన్, వాషింగ్టన్ మధ్య ఉద్రికత్తలు తొలగించేందుకు వీరిద్దరూ చొరవ చూపారని సమాచారం. ఇరాన్ న్యూక్లియర్ ప్రణాళికను ఇష్టపడని అమెరికా కొన్నేళ్లుగా దానిపై ఆంక్షలు విధించింది. వెస్ట్ఏషియాలో ఆందోళనను తగ్గించాలని ట్రంప్ భావిస్తున్నారు.

తన ఆఫీస్కి వచ్చిన రణ్వీర్ సింగ్ను 3 గంటలపాటు వెయిట్ చేయించారన్న వార్తల్ని ‘శక్తిమాన్’ ముకేశ్ ఖన్నా ఖండించారు. ‘ఆయన ఉండాలనుకున్నారు కాబట్టి ఉన్నారు. తనో అద్భుతమైన నటుడు. కానీ శక్తిమాన్ పాత్రలో ఎవరు నటించాలో డిసైడ్ చేయాల్సింది నేను. నిర్మాతలు నటుల్ని ఎంపిక చేయాలి గానీ నటులు నిర్మాతల్ని ఎంపిక చేయరాదు. నా ఆఫీస్కి వచ్చి శక్తిమాన్ పాత్ర చేస్తానంటే..? ఒప్పేసుకోవాలా? కుదరదు’ అని తేల్చిచెప్పారు.

✒ విశాఖ జిల్లాలో ప్రేమించలేదనే కారణంతో యువతిపై నీరజ్ శర్మ అనే యువకుడు దాడి చేశాడు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. తలకు 31 కుట్లు పడ్డాయి. ఘటన జరిగి 24 గంటలైనా నిందితుడు ఆచూకీ దొరకలేదు.
✒ తిరుపతి జిల్లా సత్యవేడు గురుకుల పాఠశాలలో ఒకేసారి 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్నవారికి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఓ స్టూడెంట్ పరిస్థితి విషమంగా ఉంది.

ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆత్మాహుతి డ్రోన్లను భారీ సంఖ్యలో తయారు చేయాలని ఆయన ఆదేశించినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ఉత్తర కొరియా ఈ ఏడాది ఆగస్టులో తొలిసారి ఆత్మాహుతి డ్రోన్లను పరీక్షించింది. ఇవి భూమితో పాటు సముద్ర జలాల్లో వివిధ రేంజ్లలో ఉన్న శత్రువులను సైతం ఛేదించగలవు. వీటిని ఇప్పటికే ఉక్రెయిన్, మిడిల్ ఈస్ట్ యుద్ధాల్లో ఉపయోగించారు.

AP: రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన కొడుకు అవయవాలు దానం చేసి పేరెంట్స్ నలుగురి ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన విజయనగరంలో జరిగింది. మన్యం(D) కొత్తవలసకు చెందిన సాయికుమార్(22) బైక్పై ఇంటికొస్తూ కింద పడ్డారు. తీవ్ర గాయాలపాలైన అతడిని VZM ఆస్పత్రికి తీసుకెళ్లగా బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. తల్లిదండ్రుల సమ్మతితో కాలేయం, కిడ్నీలు, ఊపిరితిత్తులను విశాఖకు తరలించి నలుగురికి అమర్చారు.

TG: వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి కేసులో అరెస్టయి సంగారెడ్డి జైలులో ఉన్న వారితో కేటీఆర్ ములాఖత్ అయ్యారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నిన్న 16 మంది నిందితులను పోలీసులు కంది సెంట్రల్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. జైలు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు, 500 మీటర్ల పరిధి వరకూ ఎవరినీ అనుమతించడం లేదని సమాచారం.

AP: సీఎం చంద్రబాబుకు YCP నేత ముద్రగడ పద్మనాభరెడ్డి లేఖ రాశారు. సూపర్-6 హామీలు ఇచ్చి ఇప్పుడు చేతులెత్తేయడం తగదన్నారు. వీటిని అమలు చేయాలంటే రూ.కోట్లు కావాలనే సంగతి అప్పుడు మీకు తెలియదా? అని నిలదీశారు. ప్రజల దృష్టి మరల్చడానికి తిరుపతి ప్రసాదం, రెడ్బుక్, SM పోస్టింగులపై చర్యలంటూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోకపోవడం అన్యాయని పేర్కొన్నారు.

వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు సంభవిస్తుండటం కలకలం రేపుతోంది. వయసు పైబడిన వారే కాకుండా పిల్లలు, యువత హార్ట్ ఎటాక్తో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా తెలంగాణలోని జగిత్యాల(D) మోత్కూరావుపేటలో సంజీవ్ అనే యువకుడు పెళ్లి వేడుకలో డాన్స్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించేలోగా మృతి చెందాడు.

భక్తిశ్రద్ధలతో జరుపుకొనే కార్తీక పౌర్ణమినే ఉత్తరాదిలో దేవ్ దీపావళి అంటారు. వర గర్వంతో చావే రాదని విర్రవీగుతూ సజ్జనులను బాధిస్తున్న త్రిపురాసురులను ఆ పరమశివుడు సంహరించింది ఈరోజే. అందుకే ఆ విశ్వేశ్వరుడి దేహంలో ఒక భాగంగా భావించే కాశీ నగరంలో ఈ పండుగను అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఈసారి గంగాతీరంలో 17లక్షల దీపాలను వెలిగిస్తున్నారు. ఈ వేడుకను వీక్షించేందుకు దేవతలు భూమికి దిగొస్తారని భక్తుల నమ్మిక.
Sorry, no posts matched your criteria.