News March 16, 2025

ఇష్టం లేని కోర్సులో విద్యార్థిని.. భరోసా ఇచ్చిన కేంద్రమంత్రి

image

తల్లిదండ్రుల ఒత్తిడితో ఇష్టమైన సైన్స్ కోర్సులో కాకుండా ఆర్ట్స్‌లో చేరినట్లు బిహార్‌కు చెందిన ఖుష్భూ ఓ ఇంటర్వ్యూలో కన్నీరుమున్నీరయ్యారు. ఇది కాస్త కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దృష్టికి చేరడంతో ఆమెకు కాల్ చేసి ధైర్యం చెప్పారు. సైన్స్ కోర్సులో చేరమని, డాక్టర్ కావాలనే కలను నెరవేర్చుకోవాలని తెలిపారు. కాగా టెన్త్ పరీక్షల్లో 500కు 399 మార్కులు రాగా పేదిరికం వల్ల ఆమె పేరెంట్స్ ఆర్ట్స్‌లో చేర్పించారు.

Similar News

News April 24, 2025

ఇంగ్లిష్‌లో మోదీ హెచ్చరికలు.. ఎందుకంటే..

image

PM మోదీ సాధారణంగా హిందీలోనే ప్రసంగిస్తుంటారు. కానీ ఈరోజు బిహార్‌లో మాత్రం ఇంగ్లిష్‌లో హెచ్చరికలు జారీ చేశారు. పాకిస్థాన్‌ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదంపై భారత్ చేయనున్న పోరాటం గురించి ప్రపంచానికి తెలిపేందుకే ఆయన ఇంగ్లిష్‌లో మాట్లాడినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ‘బిహార్ గడ్డపై నిల్చుని ప్రపంచానికి చెబుతున్నా. ప్రతి ఉగ్రవాదిని పట్టుకుంటాం. భూమి అంచులకు వెళ్లినా వదిలే ప్రసక్తి లేదు’ అని PM అన్నారు.

News April 24, 2025

పాక్ నటుడి సినిమాపై నిషేధం

image

పాకిస్థాన్ నటుడు ఫవాద్ ఖాన్ నటించిన ‘అబిర్ గులాల్’ సినిమాపై భారత సమాచార శాఖ నిషేధం విధించింది. 9 ఏళ్ల తర్వాత ఈ పాక్ నటుడు బాలీవుడ్‌లో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన క్రమంలో పహల్‌గామ్ ఉగ్రదాడి కలకలం రేపింది. ఈ నరమేధం వెనుక పాక్ హస్తం ఉందని తేల్చిచెప్పిన భారత్ పాక్ సినిమాలు, నటులపై బ్యాన్ విధించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మే 9న రిలీజ్ కావాల్సి ఉన్న సినిమా ఆగిపోయింది.

News April 24, 2025

రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు రేపు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై రాజధాని, రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించనున్నారు. మే 2న అమరావతి పర్యటనకు రావాలని ఆయనను ఆహ్వానిస్తారని సమాచారం.

error: Content is protected !!