India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జెలెన్స్కీ రష్యాతో నిరంతర యుద్ధాన్నికోరుకుంటున్నారని మస్క్ ఆరోపించారు. ఆయనలో యుద్ద కాంక్ష తీరట్లేదని ఇది చాలా దుర్మార్గమని విమర్శలు చేశారు. అమెరికా, యూరప్ సాయం ఉన్నంత వరకూ జెలెన్స్కీ యుద్ధాన్ని ముగించరన్న ట్రంప్ ట్వీట్ మస్క్ రీపోస్ట్ చేశారు. ఉక్రెయిన్కు అమెరికా అందిస్తున్న మిలిటరీ సాయం తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నేపథ్యంలో జెలెనీస్కీ మరోసారి చర్చలకు సిద్ధమని ప్రకటించిన సంగతి తెలిసిందే.

కన్నడ సినీ పరిశ్రమ, నటి <<15639271>>రష్మిక<<>> మందన్నపై కాంగ్రెస్ మంత్రులు, MLAల వ్యాఖ్యలను BJP, JDS ఖండించాయి. కర్ణాటక LoP, BJP నేత R అశోకా, JDS నేత నిఖిల్ కుమార స్వామి ఆమెకు మద్దతు ప్రకటించారు. మీరు చెప్పినట్టల్లా ఆడటానికి నటులేమీ కాంగ్రెస్ కార్యకర్తలు కారని విమర్శించారు. ప్రభుత్వం నిర్వహించిన కన్నడ ఫిల్మ్ ఫెస్టివల్కు ఆమె సహా కొందరు నటులు రాకపోవడంతో ఈ వివాదం మొదలైంది. DY CM డీకే సినీ పరిశ్రమను హెచ్చరించారు.

AP: విశాఖ రుషికొండ బీచ్కు బ్లూఫ్లాగ్ హోదా <<15639382>>గుర్తింపు <<>>రద్దుకు బాధ్యుల్ని చేస్తూ ఇద్దరు అధికారులపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. విశాఖ జిల్లా పర్యాటక శాఖ అధికారి జ్ఞానవేణి, RJD రమణను తప్పించింది. బీచ్పై వచ్చిన అభ్యంతరాలపై ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. బీచ్ పరిశుభ్రతపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. బీచ్ పరిశుభ్రతపై పర్యాటకులకు అవగాహన కల్పిస్తోంది.

అమెరికాపై కెనడా ప్రతీకార సుంకాలను ప్రకటించింది. డొనాల్డ్ ట్రంప్ తగ్గేవరకు తామూ తగ్గమని PM జస్టిన్ ట్రూడో అన్నారు. ‘ఈ అన్యాయానికి కెనడా బదులివ్వకుండా ఉండదు. తొలి దశలో $20.6B US ఉత్పత్తులపై మేమూ 25% టారిఫ్స్ వేస్తాం. 3 వారాల్లోపు రెండో దశలో మరో $80Bకు విస్తరిస్తాం’ అని ట్రూడో తెలిపారు. పరిస్థితి ఇలాగే ఉంటే రెండేళ్లలోనే కెనడా ప్రొడక్షన్ 3% మేర తగ్గుతుందని బ్యాంక్ ఆఫ్ కెనడా ఆందోళన వ్యక్తం చేసింది.

AP: గ్రూప్-2 మెయిన్స్ రాసిన అభ్యర్థులు తమ పోస్టుల ప్రాధాన్యం, జోన్, జిల్లా, ప్రాధాన్యతలు సెలక్ట్ చేసుకునే అవకాశాన్ని APPSC కల్పించింది. అభ్యర్థులు ఇవాళ్టి నుంచి ఈ నెల 10వ తేదీలోగా APPSC వెబ్సైటులో తమ వివరాలు అప్లోడ్ చేసుకోవచ్చని సూచించింది. హారిజంటల్ రిజర్వేషన్ అమల్లో భాగంగా మహిళలకు కేటాయించిన పోస్టులకు సరిపడినంత మహిళా అభ్యర్థులు లేకుంటే ఆ పోస్టులను పురుష అభ్యర్థులకు కేటాయించనుంది.

కాంగ్రెస్ అధికార ప్రతినిధి షామా మహమ్మద్ గతంలో విరాట్పైనా నోరు పారేసుకున్నారు. తనకు విదేశీ క్రికెటర్లు ఇష్టమన్న ఓ అభిమానిపై విరాట్ 2018లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కోహ్లీ బ్రిటిష్ వారు కనిపెట్టిన ఆట ఆడుతున్నారు. విదేశాల బ్రాండ్స్కు రాయబారి. ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. గిబ్స్ ఆయన అభిమాన క్రికెటర్. కానీ విదేశీ ఆటగాళ్లను ఇష్టపడేవారిని దేశం వదిలిపొమ్మంటారు’ అని షామా అప్పట్లో ట్వీట్ చేశారు.

ఏదైనా రోగం ముదిరాక ఆస్పత్రికి వెళ్లడం కంటే ముందే కొన్ని మెడికల్ టెస్టులు చేయించుకోవడం ఉత్తమం. ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన పురుషులు, మహిళలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. 1-2 ఏళ్లకోసారైనా BP, CBC, షుగర్, లిపిడ్ ప్రొఫైల్, ECG, లివర్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, BMI చెక్, థైరాయిడ్, యూరిన్ టెస్ట్, విటమిన్ డి పరీక్షలు చేయించుకోవాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వీటిని ఉచితంగానే చేస్తారు.

బంగారం ధరలు తగ్గుతూ, పెరుగుతూ సామాన్యుడితో దోబూచులాడుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.700 పెరిగి రూ.80,100లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.760 పెరగడంతో రూ.87,380లకు చేరింది. అటు వెండి ధర కూడా రూ.2000 పెరిగి కేజీ రూ.1,07,000 వద్ద కొనసాగుతోంది. వివాహ శుభకార్యాల నేపథ్యంలో బంగారం, వెండికి భారీ డిమాండ్ నెలకొంది.

AP: విద్యా సంవత్సరం 2025-26 నుంచి ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులకు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్(FRS) ప్రకారం హాజరు అమలు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 75 శాతం హాజరు ఉంటేనే ఫీజురీయింబర్స్మెంట్ అందిస్తామని స్పష్టం చేసింది. FRSకు కావాల్సిన టెక్నాలజీని APTS అందిస్తుందని, దీనికి సాంఘిక సంక్షేమ శాఖ నోడల్ ఏజెన్సీగా ఉంటుందని తెలిపింది.

స్టాక్మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ 22,044 (-80), సెన్సెక్స్ 72,890 (-210) వద్ద చలిస్తున్నాయి. మెక్సికో, కెనడాపై 25%, చైనాపై 20% టారిఫ్స్ అమల్లోకి రావడం ఇన్వెస్టర్లలో నెగటివ్ సెంటిమెంటుకు దారితీసింది. ఆటో, FMCG, ఐటీ, ఫార్మా, మెటల్, కన్జూమర్ డ్యురబుల్స్, O&G షేర్లు విలవిల్లాడుతున్నాయి. బ్యాంకు, మీడియా షేర్లు రాణిస్తున్నాయి. BEL, SBI, INDUSIND, ICICI BANK టాప్ గెయినర్స్.
Sorry, no posts matched your criteria.