News December 24, 2024

టెలికం కంపెనీలకు ట్రాయ్ కీలక ఆదేశాలు

image

వాయిస్ కాల్స్, SMSల కోసం ప్రత్యేకంగా రీఛార్జ్ ప్లాన్లు తీసుకురావాలని జియో, ఎయిర్‌టెల్, VI, BSNL సంస్థలను ట్రాయ్ ఆదేశించింది. ప్రస్తుతం డేటా, కాల్స్, SMSలకు కలిపి ఈ సంస్థల ప్లాన్లు ఉన్నాయి. దీంతో డేటా అవసరం లేకున్నా ఫీచర్ ఫోన్లు వాడే వారు తప్పకుండా రీఛార్జ్ చేయించుకోవాల్సి వస్తోంది. 2 సిమ్‌లు వాడే వారూ ఒక నంబర్ వాడుకలో ఉండేలా రీఛార్జ్ చేసుకుంటూ నష్టపోతున్నారు. త్వరలో వీరి కష్టాలు తీరే అవకాశముంది.

News December 23, 2024

VRO వ్యవస్థ పునరుద్ధరణకు చర్యలు

image

తెలంగాణలో VRO వ్యవస్థ పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక అధికారిని నియమించనుంది. పాత ఉద్యోగులను మళ్లీ VRO పోస్టుల్లోకి తీసుకోనుంది. ఇందుకోసం ఈ నెల 28 వరకు గడువు విధిస్తూ CCLA కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా గత ప్రభుత్వంలో VROలను ఇతర శాఖలకు బదలాయించగా, వారిని వెనక్కి రప్పించే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది.

News December 23, 2024

ఇంట‌ర్‌పోల్ కోసం భార‌త్‌పోల్‌.. సిద్ధం చేసిన CBI

image

ఇంట‌ర్‌పోల్ నుంచి అవసరమైన సమాచారాన్ని పొందేలా అన్ని రాష్ట్రాలు, దర్యాప్తు సంస్థల కోసం సరికొత్త టెక్నాలజీ వ్యవస్థ ‘భారత్‌పోల్’ను CBI సిద్ధం చేసింది. ఇప్ప‌టిదాకా ఇంట‌ర్‌పోల్ స‌మాచారం కోసం ఏజెన్సీలు అన్నీ CBIకు అభ్యర్థనలు పంపేవి. దీని వ‌ల్ల కేసుల విచార‌ణ‌కు అధిక స‌మ‌యం ప‌డుతుండ‌డంతో ఈ సమీకృత వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. ట్రయల్స్ దశలో ఉన్న ఈ టెక్నాలజీని Jan 7న అమిత్ షా ప్రారంభించే అవకాశం ఉంది.

News December 23, 2024

కాంగ్రెస్ Vs బీఆర్ఎస్.. మధ్యలో అల్లు అర్జున్

image

TGలో అల్లు అర్జున్ కేంద్రంగా రాజకీయం నడుస్తోంది. బన్నీ అరెస్టైనప్పుడు KTR ట్వీట్‌తో దుమారం రేగింది. కుట్రపూరితంగా అతడిని ఇరికిస్తున్నారని INC, రేవంత్‌పై BRS విమర్శలు గుప్పించింది. ఎదురుదాడికి దిగిన INC.. AAకు బీఆర్ఎస్సే డైరెక్షన్స్ ఇస్తోందని ఆరోపించింది. మొత్తం వ్యవహారంలో AA, BRS అభిమానులు ఒకవైపు, కాంగ్రెస్ మరోవైపు ఉన్నాయి. మరి ఈ ‘సినీ రాజకీయం’ ఎక్కడివరకు వెళ్తుందో, ఎక్కడ ఆగుతుందో చూడాలి.

News December 23, 2024

రేపటి నుంచి సెలవులు

image

క్రిస్మస్ ఈవ్ సందర్భంగా తెలంగాణలో కొన్ని స్కూళ్లకు రేపు ఆప్షనల్ హాలిడే ఉండనుంది. ఇప్పటికే సంబంధిత పాఠశాలల నుంచి విద్యార్థుల పేరెంట్స్‌కు సమాచారం అందింది. 25, 26న పబ్లిక్ హాలిడేస్ ఉండటంతో ఆయా పాఠశాలలకు వరుసగా 3 రోజులు, మిగతావాటికి 2 రోజులు సెలవులు రానున్నాయి. అటు ఏపీలోనూ రేపు కొన్ని స్కూళ్లకు ఆప్షనల్, 25న పబ్లిక్ హాలిడే, 26న ఆప్షనల్ హాలిడే ఉండనుంది.

News December 23, 2024

విధానం రద్దుతో డ్రాపౌట్స్: UTF

image

నో డిటెన్షన్ విధానాన్ని కేంద్రం రద్దు చేయడంపై తెలంగాణ UTF స్పందించింది. ఈ విధానం రద్దు చేయడం వల్ల స్కూళ్లలో డ్రాపౌట్స్ పెరుగుతాయని, పేదలకు విద్య దూరమవుతుందని అభిప్రాయపడింది. దీని వల్ల ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. కాగా 5, 8 తరగతుల విద్యార్థులు పరీక్షల్లో తప్పనిసరి పాస్ కావాలని నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

News December 23, 2024

భారత సినీ చరిత్రలోనే తొలి మూవీగా ‘పుష్ప-2’

image

అల్లు అర్జున్ ‘పుష్ప-2’ మరో రికార్డు సృష్టించింది. బుక్ మై షోలో అత్యధిక టికెట్లు అమ్ముడైన చిత్రంగా నిలిచినట్లు మూవీ యూనిట్ ట్వీట్ చేసింది. భారతీయ సినిమా చరిత్రలోనే ఇది రికార్డు అని పేర్కొంది. ఇప్పటివరకు 18 మిలియన్లకు పైగా టికెట్లు బుక్ అయినట్లు వెల్లడించింది. కాగా ఈ సినిమా ఇప్పటికే రూ.1,700 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి.

News December 23, 2024

టీమ్ ఇండియాకు బ్యాడ్ న్యూస్

image

భారత స్టార్ బౌలర్ మహ్మద్ షమీ ఆరోగ్య పరిస్థితిపై BCCI కీలక ప్రకటన చేసింది. ఆస్ట్రేలియాతో జరిగే తర్వాతి రెండు టెస్టులకూ ఆయన అందుబాటులో ఉండటం లేదని పేర్కొంది. రంజీ, SMATలో బౌలింగ్ ప్రదర్శన బాగానే ఉన్నా ఎడమ మోకాలులో వాపు గుర్తించినట్లు తెలిపింది. మడమ గాయం నుంచి కోలుకున్న ఆయనను వైద్య బృందం పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు యంగ్ ప్లేయర్ తనుశ్ కోటియన్ భారత జట్టులో చేరనున్నట్లు తెలుస్తోంది.

News December 23, 2024

BIG NEWS.. త్వరలో 32,438 ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

రైల్వేలో 32,438 గ్రూప్-D ఉద్యోగాల భర్తీకి RRB త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనుంది. జనవరి 23 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. అత్యధికంగా ట్రాక్ మెయింటైనర్ ఉద్యోగాలు-13,187, పాయింట్స్‌మెన్-5058, అసిస్టెంట్(వర్క్‌షాప్)-3077, అసిస్టెంట్(C&W) సహా మరికొన్ని ఉద్యోగాలున్నాయి. 18-36 ఏళ్లలోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. టెన్త్ లేదా NCVT నుంచి NAC సర్టిఫికెట్, ITI ఉన్నవారు అర్హులు.

News December 23, 2024

హైకోర్టును ఆశ్రయించిన పేర్ని నాని

image

AP: రేషన్ బియ్యం అక్రమాల కేసులో పోలీసుల నోటీసులను క్వాష్ చేయాలని మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన కొడుకు కిట్టు హైకోర్టును ఆశ్రయించారు. రేపు దీనిపై కోర్టు విచారణ చేయనుంది. మరోవైపు రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసులో పేర్ని నాని భార్య జయసుధ ఏ1గా ఉన్నారు. రేపు ఆమె ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై జిల్లా కోర్టులో విచారణ జరగనుంది.