India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

దేశీయ స్టాక్ మార్కెట్లలో బ్లడ్ బాత్ కొనసాగుతోంది. వీక్ సెంటిమెంట్, రూపాయి విలువ జీవితకాల కనిష్ఠానికి పతనమవ్వడం, విదేశీ ఇన్వెస్టర్ల ఔట్ఫ్లోతో బెంచ్ మార్క్ సూచీలు శుక్రవారం కూడా భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 1176 పాయింట్ల నష్టంతో 78,041 వద్ద, నిఫ్టీ 364 పాయింట్లు కోల్పోయి 23,587 వద్ద స్థిరపడ్డాయి. రియల్టీ, ఐటీ, ఆటో, పీఎస్యూ బ్యాంకు, మెటల్ రంగాలు అత్యధికంగా నష్టపోయాయి.

TG: ఫార్ములా-ఈ కార్ రేసు కేసుపై అసెంబ్లీలో చర్చించాలన్న KTR డిమాండ్పై CM రేవంత్ స్పందించారు. ‘ఎక్కడైనా చర్చకు సిద్ధం. మేం ప్రమాణ స్వీకారం చేసినప్పుడే FEO కంపెనీ ప్రతినిధులు నన్ను కలిశారు. KTRతో చీకటి ఒప్పందం ఉందని మాకు చెప్పారు. మేము కూడా సహకరించాలని కోరారు. అప్పుడే మాకు ఈ స్కామ్ గురించి తెలిసింది. ఇది మొత్తం రూ.600 కోట్ల స్కామ్ అయ్యేది. ప్రభుత్వం మారడంతో రూ.55 కోట్లతో ఆగిపోయింది’ అని చెప్పారు.

మాజీ క్రికెటర్లకు BCCI అందిస్తున్న పెన్షన్పై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కాంబ్లీకి ₹30K/M వస్తుండగా అశ్విన్కు ₹60K/M అందుతాయి. ఇద్దరూ టీమ్ఇండియాకే ఆడినా కేటగిరీ వేరవ్వడమే ఇందుకు కారణం. కాంబ్లీ 17 టెస్టులే ఆడటంతో BCCI అతడిని ఫస్ట్క్లాస్ విభాగంలో చేర్చింది. 106 టెస్టులాడిన యాష్ టెస్టు విభాగంలో ఉన్నారు. అందుకే రెట్టింపు పెన్షన్ అందుకుంటారు. BCCI 2022లో రివైజ్ చేయకుంటే ఇందులో సగమే వచ్చేది.

పెరూలోని అమెజాన్ అడవిలో సైంటిస్టులు కొత్తగా 27 రకాల జీవజాతుల్ని గుర్తించారు. 2022లో ఈ అడవుల్లో వారు చేసిన పరిశోధనల ఫలితాల్ని తాజాగా వెల్లడించారు. గుర్తించిన వాటిలో చిట్టెలుకలు, ఉడతలు, చేపలు, ఉభయచర జీవులు, సీతాకోకచిలుకల జాతులు ఉన్నాయన్నారు. మరో 48 జాతుల్ని కూడా గుర్తించినా వాటిపై మరింత అధ్యయనం చేయాల్సి ఉందని తెలిపారు. గిరిజనులు నివసించే ఆల్టో మాయో ప్రాంతంలో ఇవన్నీ కనిపించినట్లు వివరించారు.

TG: ధరణి పోర్టల్తో రైతుల సమాచారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేశారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ‘గాదె శ్రీధర్ రాజు ద్వారా డేటాను విదేశాలకు పంపించారు. వాళ్లు ఒక్క క్లిక్ కొడితే మన సమాచారమంతా నాశనం అవుతుంది. ఇక్కడి సర్వర్లు క్రాష్ అవుతాయి. అందుకే మేం అధికారంలోకి రాగానే ఎంతో మంది నిపుణులు, మేధావులు, రైతునేతలతో చర్చించి ధరణిని రద్దు చేశాం’ అని సీఎం వెల్లడించారు.

జై షా ఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడంతో బీసీసీఐ కార్యదర్శి పదవి ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. వచ్చే నెల 12న ఈ పదవితోపాటు ట్రెజరర్ను బీసీసీఐ నియమించనుంది. ఈ పదవి కోసం దేవజిత్ సైకియా, అనిల్ పటేల్, రోహన్ జైట్లీతోపాటు మరికొందరు పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అస్సాంకు చెందిన సైకియా బోర్డు తాత్కాలిక కార్యదర్శిగా విధులు నిర్వహిస్తుండగా, కోశాధికారి స్థానం ఖాళీగా ఉంది.

TG: ఈ-కార్ రేసు సీజన్-10 నిర్వహణలో స్పాన్సర్ వెనక్కి తగ్గారని, ఆ ఇబ్బందుల నివారణకే ప్రభుత్వం HMDA ద్వారా చెల్లింపులు చేసిందని కేటీఆర్ తరఫు లాయర్ సుందరం వాదించారు. సీజన్-9 వల్ల దాదాపు రూ.700 కోట్ల లాభం వచ్చిందని చెప్పారు. అవినీతి నిరోధక చట్టం కింద పెట్టిన సెక్షన్లు ఈ కేసుకు వర్తించవని, ప్రాథమిక విచారణ లేకుండా కేసు పెట్టారని హైకోర్టులో పేర్కొన్నారు.

బజాజ్ తమ చేతక్ విద్యుత్ స్కూటర్లో కొత్త వేరియంట్లను ఈరోజు లాంచ్ చేసింది. వీటిలో 3502 వేరియెంట్ ఎక్స్షోరూమ్ ధర రూ.1.20 లక్షలుగా, 3501 వేరియెంట్ ధర రూ.1.27 లక్షలుగా ఉంది. డిజిటల్ క్లస్టర్, ఐదంగుళాల డిస్ప్లే, మ్యాప్స్, కాల్స్, మ్యూజిక్ కంట్రోల్, డాక్యుమెంట్ స్టోరేజీ, చోరీ అలెర్ట్, 35 లీటర్ బూట్ స్పేస్, 3.5 kwh బ్యాటరీ ప్యాక్, 73 kmph టాప్ స్పీడ్, 125 కి.మీ మైలేజీ దీని ప్రత్యేకతలు.

తెలంగాణలో ప్రజల ఆత్మగౌరవం నిలబెట్టేదే భూమి అని CM రేవంత్ అన్నారు. భూభారతిపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా మాట్లాడారు. ‘భూమిలేని పేదలకు ఇందిరా సర్కార్ భూమిచ్చింది. ఆక్రమణలు తొలగించి రైతుల హక్కులు కాపాడేందుకు గత ప్రభుత్వాలు చట్టాలు తెచ్చాయి. కానీ BRS ప్రభుత్వం తెచ్చిన ధరణి మాత్రం అన్నదాతలను తమ భూములకు దూరం చేసింది. యువరాజు(KTR)కు అత్యంత సన్నిహితులైన వారికి దీని పోర్టల్ను అప్పగించారు’ అని ఆరోపించారు.

TG: ఈ-కార్ రేసు కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. KTRపై పెట్టిన పీసీ యాక్ట్ వర్తించదని, ఆయన లబ్ధి పొందినట్లు FIRలో లేదని కేటీఆర్ తరఫు న్యాయవాది సుందరం వాదించారు. రాజకీయ కక్షలో భాగంగానే కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. మరోవైపు ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.