India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సెల్వ రాఘవన్ డైరెక్షన్లో రవికృష్ణ, సోనియా నటించిన ‘7G బృందావన కాలనీ’ 2004లో తెలుగు, తమిళంలో రిలీజై కల్ట్ క్లాసిక్గా నిలిచింది. 20 ఏళ్ల తర్వాత డైరెక్టర్ సీక్వెల్ ప్రకటించారు. యువన్ శంకర్రాజా సంగీతం అందిస్తుండగా, ఏఎం రత్నం నిర్మాతగా వ్యవహరించనున్నారు. అయితే హీరోహీరోయిన్లుగా పాత నటులే ఉంటారా? కొత్తవారిని తీసుకుంటారా? అనేది తెలియాల్సి ఉంది. ఈ చిత్రం మీలో ఎంతమందికి ఇష్టం? కామెంట్ చేయండి.

2024 డిసెంబర్లో రూ.1.77 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది. నవంబర్(రూ.1.82 లక్షల కోట్లు)తో పోలిస్తే వసూళ్లు కాస్త తగ్గాయి. తాజా వసూళ్లలో CGST రూ.32,836 కోట్లు, SGST రూ.40,499 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.91,200 కోట్లు, సెస్ రూ.12,300 కోట్లు ఉంది. దేశీయ లావాదేవీలతో రూ.1.32 లక్షల కోట్లు(వృద్ధి 8.4 శాతం), దిగుమతులపై పన్నులతో రూ.44,268 కోట్లు(వృద్ధి 4 శాతం) వచ్చింది.

TG: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రేవంత్కు మతిమరుపు వచ్చినట్లుందని హరీశ్ రావు విమర్శలు చేశారు. షరతులు పెట్టి చాలా మంది రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టారని విమర్శించారు. రైతు భరోసా విషయంలో పది ఎకరాలకే ఇస్తాం, ఒక్క పంటకే ఇస్తామని ప్రభుత్వం లీకులు చేస్తోందని ఆరోపించారు. కోతలు పెట్టేందుకు ప్రభుత్వం కుస్తీ పడుతోందని అన్నారు. రైతులకు అన్యాయం చేస్తే రైతు లోకం తిరగబడుతుందని హరీశ్ హెచ్చరించారు.

బాలకృష్ణ, బాబీ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న డాకు మహారాజ్ చిత్రం నుంచి రేపు మూడో సింగిల్ రానున్నట్లు చిత్ర యూనిట్ అప్డేట్ ఇచ్చింది. దబిడి దిబిడి అంటూ సాగే ఈ సాంగ్ రేపు విడుదల చేయనున్నట్లు పేర్కొంది. ఊర్వశి రౌతేలాతో కలసి బాలయ్య స్టెప్పులేసినట్లు పోస్టర్ చూస్తే తెలుస్తోంది. తమన్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రం ఈ నెల 12న థియేటర్లలో విడుదల కానుంది.

AP: జాబ్ క్యాలెండర్ విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెల 12న 866 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు, పాత నోటిఫికేషన్ల రాత పరీక్ష వివరాలను APPSC ప్రకటించే అవకాశం ఉంది. ఒక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోనే 800కు పైగా పోస్టులున్నట్లు తెలుస్తోంది. అత్యధికంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ఆఫీసర్ ఉద్యోగాలు 650కి పైగా ఉన్నట్లు అధికార వర్గాల సమాచారం.

కొత్త ఏడాదిలో స్టార్ హీరోల ఫ్యాన్స్కు ఎదురు చూపులే మిగలనున్నాయి. సూపర్ స్టార్ మహేశ్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్ చిత్రాలు ఈ ఏడాది రిలీజ్ అయ్యే అవకాశం లేనట్లుగా తెలుస్తోంది. ఇంకా సూపర్ స్టార్ మహేశ్-రాజమౌళి షూట్ ప్రారంభం కావాల్సి ఉంది. ‘పుష్ప-2’ సూపర్ హిట్ తర్వాత అల్లు అర్జున్ తదుపరి సినిమాపై ఎలాంటి ప్రకటన లేదు. మరోవైపు ఎన్టీఆర్ వార్-2తో వచ్చినా ఆ మూవీ బాలీవుడ్కే ఎక్కువగా పరిమితమయ్యే అవకాశముంది.

2025 మొదటి సెషన్లో బెంచ్మార్క్ సూచీలు భారీగా లాభపడ్డాయి. AUTO, MEDIA, CONSUMPTION షేర్లు దన్నుగా నిలవడంతో సెన్సెక్స్ 78,507 (+368), నిఫ్టీ 23,742 (+98) వద్ద ముగిశాయి. మెటల్, రియాల్టి మినహా అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. MARUTI, M&M, LT, BAJAJFIN, TATAMOTORS టాప్ గెయినర్స్. HINDALCO, DRREDDY, ADANIPORTS, ONGC, TATASTEEL టాప్ లూజర్స్. ఫియర్ ఇండెక్స్ INDIA VIX 14.51 వద్ద ఉండటం అనిశ్చితిని సూచిస్తోంది.

కాలం మారింది. మగాడు బలహీనుడయ్యాడు. భార్య అండగా నిలిస్తే కొండలైనా పిండిచేయగలిగే భర్త ఆమె వేధిస్తే తట్టుకోలేకపోతున్నాడు. చట్టాలన్నీ అవతలివారికే చుట్టాలుగా మారడంతో గిలగిలా తన్నుకుంటున్నాడు. ఎంత పోరాడినా న్యాయం దొరకదేమోనన్న బెంగతో ప్రాణం తీసేసుకుంటున్నాడు. మొన్న బెంగళూరులో అతుల్ సుభాష్. నిన్న ఢిల్లీలో పునీత్ ఖురానా. విడాకుల విచారణలో నలిగిపోతున్న భార్యాబాధితులు బతికేదెలా? భరోసా దొరికేదెలా? మీ comment.

బోర్డర్-గవాస్కర్ సిరీస్లో బ్యాటింగ్, కెప్టెన్సీలో ఘోరంగా విఫలమవుతున్న రోహిత్ శర్మపై తీవ్రమైన ఒత్తిడి ఉంది. అతడు రిటైర్ అవ్వాలని సర్వత్రా డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఈక్రమంలోనే చీఫ్ సెలక్టర్ అగార్కర్తో రోహిత్ మాట్లాడినట్లు వార్తలొస్తున్నాయి. కానీ అలాంటిదేమీ లేదని BCCI వర్గాలంటున్నాయి. BGT మధ్యలో రోహిత్ రిటైర్మెంట్పై ఎలాంటి నిర్ణయం ఉండదని, సిరీస్ ముగిసిన తర్వాతే దీనిపై చర్చించనున్నట్లు సమాచారం.

దేశంలో ఎక్కువగా సైబర్ నేరాలు వాట్సాప్ వేదికగా జరిగినట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నివేదిక పేర్కొంది. గత ఏడాది తొలి మూడు నెలల్లో వాట్సాప్పై 43,797 ఫిర్యాదులు రాగా ఆ తర్వాత టెలిగ్రామ్(22,680), ఇన్స్టాగ్రామ్(19,800)పై వచ్చాయని వెల్లడించింది. గూగుల్ సర్వీస్ ప్లాట్ఫామ్లను ఈ మోసాలకు ఉపయోగించారని తెలిపింది. నిరుద్యోగులు, గృహిణులు, విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్నారంది.
Sorry, no posts matched your criteria.