India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

దర్శకధీరుడు రాజమౌళిపై తెరకెక్కిన ‘RRR: Behind & Beyond’ డాక్యుమెంటరీ ఫిల్మ్ ఈనెల 20న థియేటర్లలో రిలీజైన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రాగా, ఓటీటీలో రిలీజ్కు సిద్ధమైంది. ఈ నెల 27న నెట్ఫ్లిక్స్లో విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ డాక్యుమెంటరీలో చరణ్, ఎన్టీఆర్ సీన్స్తో పాటు ఇతర నటీనటుల చిత్రీకరణలో జక్కన్న పడిన కష్టాన్ని చూపారు.

టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆయనను థానేలోని ఆకృతి ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం కాంబ్లీ పరిస్థితి క్రిటికల్గా ఉన్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. ఇటీవలే కాంబ్లీని ఆసుపత్రిలో చేర్పించి ట్రీట్మెంట్ ఇచ్చారు. తాజాగా మరోసారి ఆయన ఆసుపత్రిపాలయ్యారు. కాంబ్లీ ఆరోగ్య పరిస్థితిపై ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న మూడ్రోజులు దక్షిణ కోస్తాలో వర్షాలు పడనున్నాయి. నెల్లూరు, ప్రకాశం, తిరుపతి సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. పోర్టుల్లో మూడో నంబర్ హెచ్చరికలు కొనసాగుతున్నాయి. మత్స్యకారులు గురువారం వరకు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.

దేశంలో ఆశ్రయం పొందుతున్న మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలని భారత్ను బంగ్లా మధ్యంతర ప్రభుత్వం అధికారికంగా కోరింది. భారత్తో ఉన్న ఖైదీల మార్పిడి ఒప్పందం మేరకు న్యాయపరమైన ప్రక్రియ కోసం ఆమెను అప్పగించాల్సిందిగా కోరినట్టు బంగ్లా దేశ విదేశాంగ సలహాదారు తౌహిద్ హుస్సేన్ తెలిపారు. హసీనా హయాంలో చెలరేగిన అల్లర్లలో జరిగిన హత్య కేసుల్లో ఆమెపై ఇప్పటికే అభియోగాలు మోపారు.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్తో దిగిన ఫొటోలను దర్శకుడు బుచ్చిబాబు తమన్ పంచుకున్నారు. ‘DHOP మూమెంట్’ అంటూ తమన్, నా అభిమాన హీరోలంటూ బుచ్చిబాబు రాసుకొచ్చారు. వీరంతా దుబాయ్లో ఓ ఈవెంట్ సందర్భంగా కలుసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం యంగ్ టైగర్ ‘వార్-2’ చిత్రంలో నటిస్తున్నారు. కాగా RC నటించిన గేమ్ ఛేంజర్ జనవరి 10న థియేటర్లలో విడుదల కానుంది.

2025 FEB 1, శనివారం అయినప్పటికీ స్టాక్ మార్కెట్లు పనిచేస్తాయి. ఆ రోజు బడ్జెట్ను ప్రవేశపెడుతుండటమే ఇందుకు కారణం. అందులో ప్రకటనలను అనుసరించి సత్వర నిర్ణయాలు తీసుకొనేందుకు ఇన్వెస్టర్లకు అవకాశమివ్వడమే దీని ఉద్దేశం. 2020, 2015లోనూ ఇలాగే జరిగింది. సాధారణంగా బడ్జెట్ రోజు బ్యాంకింగ్, ఇన్ఫ్రా, తయారీ, హెల్త్కేర్ షేర్లలో యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. స్టాక్స్ రేట్లు నిమిషాల్లో ఆటుపోట్లకు లోనవుతుంటాయి.

స్కూళ్లలో ‘నో డిటెన్షన్’ విధానాన్ని కేంద్రం రద్దు చేసింది. 5, 8 తరగతుల విద్యార్థులు పరీక్షల్లో తప్పనిసరి పాస్ కావాలని పేర్కొంది. ఫెయిలైన విద్యార్థులకు 2 నెలల వ్యవధిలో మరోసారి పరీక్ష నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. విద్యా హక్కు చట్టం ద్వారా ఈ విధానం అమల్లోకి రానున్నట్లు పేర్కొంది. కేంద్రం ఆధ్వర్యంలో నడిచే స్కూళ్లతో పాటు KVలు, నవోదయ, సైనిక్ స్కూళ్లకు ఇది వర్తించే అవకాశం ఉంది.

మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న అవార్డు నామినీల జాబితాలో డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ మనూభాకర్ పేరు తొలగించినట్టు సమాచారం. కమిటీ ఆమె పేరును రికమెండ్ చేయలేదని తెలిసింది. వివాదం నెలకొనడంతో అవార్డుకు ఆమె దరఖాస్తు చేసుకోలేదని స్పోర్ట్స్ మినిస్ట్రీ చెప్తోంది. అది అవాస్తవమని, తాము చేశామని ఆమె తండ్రి రామకృష్ణ స్పష్టం చేశారు. అవార్డుల కోసం అడుక్కోవాల్సి వస్తే మెడల్స్ సాధించడంలో అర్థమేముందని ప్రశ్నించారు.

AP: అమరావతిలో జోన్ 7, జోన్ 10 లేఅవుట్ల కోసం రూ.2,723 కోట్ల నిర్మాణ పనులకు సీఆర్డీఏ అంగీకారం తెలిపిందని మంత్రి నారాయణ అన్నారు. వచ్చే నెల 15 కల్లా రాజధాని నిర్మాణాల టెండర్ల ప్రక్రియ పూర్తిచేస్తామని చెప్పారు. మొత్తం 7 లక్షల ఇళ్లకు గత ప్రభుత్వం 2.61 లక్షల ఇళ్లు కూడా పూర్తి చేయలేదని దుయ్యబట్టారు. జూన్ 12లోగా లక్షా 18వేల టిడ్కో ఇళ్లను పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నామన్నారు.

UPSC నుంచి బహిష్కరణకు గురైన పూజా ఖేడ్కర్ ముందస్తు బెయిల్ పిటిషన్ను ఢిల్లీ HC తోసిపుచ్చింది. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో సివిల్స్లో ప్రయోజనాలు పొందారన్న ఆరోపణలపై ఆమెను కేంద్రం సర్వీసు నుంచి తొలగించింది. ప్రతిష్ఠాత్మక సంస్థను మోసం చేశారన్న అభియోగాలు ఎదుర్కొంటున్న ఆమెకు గతంలో కల్పించిన మధ్యంతర రక్షణను కూడా కోర్టు తొలగించింది. త్వరలో ప్రభుత్వం ఆమెను విచారించే అవకాశం ఉంది.
Sorry, no posts matched your criteria.