News December 25, 2024

సర్పంచులు, ఎంపీటీసీలకు గుడ్ న్యూస్

image

TG: గ్రామాల్లో సర్పంచులు, MPTCలు, ZPTCలు చేసిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను త్వరలోనే విడుదల చేస్తామని Dy.CM భట్టి విక్రమార్క చెప్పారు. BRS పెట్టిన బకాయిలు ₹1,300కోట్లు ఉన్నాయన్నారు. తొలుత ₹10లక్షల లోపు బిల్లులను సెటిల్ చేసే ఆలోచన చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ బకాయిల విలువ దాదాపు ₹400కోట్లు ఉందని తెలిపారు. బిల్లులను పెండింగ్‌లో పెట్టిన BRS నేతలు మళ్లీ ధర్నాలు చేస్తామనడం సమంజసం కాదన్నారు.

News December 25, 2024

గ్రామ, వార్డు సచివాలయాలకు కీలక ఆదేశాలు

image

AP: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు రోజూ తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు వేయాలని ప్రభుత్వం ఆదేశించింది. బయోమెట్రిక్ ఆధారిత వేతన బిల్లులనే నమోదు చేయాలని అధికారులకు సూచించింది. అలాగే ఇటీవల విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్-2047 ఫ్రేమ్ వర్క్ బాధ్యతల్లోనూ పాలుపంచుకోవాలని పేర్కొంది. దీనిపై CM ప్రతి శుక్రవారం నిర్వహించే సమీక్షలో RTGSతోపాటు గ్రామ, వార్డు సచివాలయ శాఖ అధికారులు కూడా పాల్గొనాలని తెలిపింది.

News December 25, 2024

తీవ్ర అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

image

AP: నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఇవాళ బలహీనపడుతుందని IMD వెల్లడించింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా విస్తరించి ఉందని తెలిపింది. వీటి ప్రభావంతో ఇవాళ ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వానలు కురుస్తాయంది. కాగా బంగాళాఖాతంలో 2 రోజుల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.

News December 25, 2024

గాంధీ వందేళ్ల జ్ఞాపకం.. 2 రోజులు CWC సమావేశాలు

image

ఏఐసీసీ అధ్యక్షుడిగా మహాత్మా గాంధీ బాధ్యతలు స్వీకరించి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా రేపు, ఎల్లుండి కాంగ్రెస్ ప్రత్యేక భేటీ నిర్వహించనుంది. కర్ణాటకలోని బెలగావిలో జరిగే ఈ సమావేశానికి ‘నవ సత్యాగ్రహ బైఠక్’గా పేరు పెట్టింది. 26వ తేదీన CWC సభ్యులు, పీసీసీలు, సీఎల్పీలు సహా 200 మంది కీలక నేతలు హాజరై పలు అంశాలపై చర్చిస్తారు. 27న నిర్వహించే సంవిధాన్ ర్యాలీలో లక్ష మంది కార్యకర్తలు పాల్గొంటారు.

News December 25, 2024

ఏపీ కొత్త సీఎస్‌గా సాయి ప్రసాద్?

image

AP: రాష్ట్ర CS నీరభ్ కుమార్ పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. దీంతో కొత్త CS ఎవరనే ఉత్కంఠ నెలకొంది. సీనియార్టీ జాబితాలో IAS శ్రీలక్ష్మి టాప్‌లో ఉన్నారు. అయితే ఆమెను నియమించడానికి CM సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఆమె తర్వాత అనంతరాము ఉన్నప్పటికీ సాయిప్రసాద్ వైపు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. త్వరలోనే ఉత్తర్వులు వెలువడుతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈయన గతంలో CBN పేషీలో కార్యదర్శిగా పనిచేశారు.

News December 25, 2024

నేడు మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన

image

TG: CM రేవంత్ రెడ్డి ఇవాళ మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో ఆయన తొలుత ఏడుపాయల వనదుర్గమాత ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటారు. ఆపై అక్కడే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. అనంతరం మెదక్ CSI చర్చి శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారని చెప్పాయి. అటు, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ కూడా నేడు మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు.

News December 25, 2024

నేడు ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ

image

AP: ఢిల్లీ పర్యటనలో ఉన్న CM చంద్రబాబు ఇవాళ బిజీగా గడపనున్నారు. తొలుత మాజీ PM వాజ్‌పేయి శతజయంతి వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం BJP జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరిగే NDA నేతల సమావేశానికి హాజరవుతారు. జమిలి, వక్ఫ్ బిల్లులపై చర్చిస్తారు. అలాగే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ సీఎం భేటీ అవుతారని సమాచారం. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను వారి దృష్టికి తీసుకెళ్తారని తెలుస్తోంది.

News December 25, 2024

ఏపీకి రూ.446 కోట్లు విడుదల

image

AP: రాష్ట్రానికి 15వ ఆర్థిక సంఘం గ్రాంటు రూ.446 కోట్లను కేంద్రం విడుదల చేసింది. 2024-25కుగానూ రెండో వాయిదా కింద రూ.421 కోట్లు, ఒకటో వాయిదా కింద పెండింగ్‌లో ఉన్న రూ.25 కోట్లను అందించింది. 13,097 గ్రామ పంచాయతీలు, 650 బ్లాక్ పంచాయతీలకు ఈ నిధులకు కేటాయించనున్నారు.

News December 25, 2024

ఛాంపియన్స్ ట్రోఫీ: హిస్టరీ, విజేతలు

image

వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. 1998లో ప్రారంభమైన ఈ ట్రోఫీలో 2009 నుంచి ICC ర్యాంకింగ్స్‌లోని టాప్-8 జట్లు పాల్గొంటున్నాయి. టెస్టులు ఆడని దేశాల్లో క్రికెట్ అభివృద్ధికి నిధుల సమీకరణే లక్ష్యంగా ఇది మొదలైంది. ఆరంభ ఎడిషన్‌లో SA విజేతగా నిలిచింది. 2000లో NZ, 2002లో శ్రీలంక-భారత్, 2004లో WI, 2006, 09లో AUS, 2013లో IND, 2017లో పాక్ టైటిల్‌ను సాధించాయి.

News December 25, 2024

అక్రిడేషన్ గడువు మరో 3 నెలలు పొడిగింపు

image

TG: రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువును మ‌రో 3 నెల‌ల పాటు పొడిగిస్తూ సమాచార పౌర సంబంధాల శాఖ ఉత్తర్వులిచ్చింది. డిసెంబ‌ర్ 31వ తేదీతో గడువు ముగియనుండగా, జ‌న‌వ‌రి 1 నుంచి మార్చి 31వ తేదీ వ‌ర‌కు అక్రిడేషన్లు పనిచేస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్లు, ఆర్టీసీ సంస్థ‌కు అధికారులు తెలియ‌జేశారు.