News January 3, 2025

విజయ్ హజారే ట్రోఫీలో పంజాబ్ రికార్డ్

image

విజయ్ హజారే ట్రోఫీ ఒకే సీజన్‌లో వరుసగా రెండుసార్లు 400+ స్కోర్ చేసిన తొలి జట్టుగా పంజాబ్ చరిత్ర సృష్టించింది. ఇటీవల సౌరాష్ట్రపై 424/5 స్కోర్ చేయగా, ఇవాళ హైదరాబాద్‌పై 426/4 బాదింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్(137) సెంచరీ చేశారు. ఇది అతనికి హ్యాట్రిక్ శతకం కావడం విశేషం. మరో ఎండ్‌లో అభిషేక్ శర్మ(93) రాణించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 196 రన్స్ జోడించారు.

News January 3, 2025

మరికాసేపట్లో తీర్పు.. కొనసాగుతున్న ఉత్కంఠ

image

TG: హీరో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై మరికాసేపట్లో నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించనుంది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్టైన బన్నీ ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై బయట ఉన్నారు. తనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని ఆయన కోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే వాదనలు విన్న ధర్మాసనం తీర్పును ఈ సాయంత్రానికి వాయిదా వేసింది. దీంతో AAకు బెయిల్ వస్తుందా? లేదా? అని ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

News January 3, 2025

రేపు, ఎల్లుండి జాగ్రత్త

image

తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. రాత్రివేళ సాధారణం కంటే 2-4 డిగ్రీల టెంపరేచర్ తక్కువగా నమోదవుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలోనే రేపు, ఎల్లుండి కూడా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదై, శీతల గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

News January 3, 2025

హైబీపీ ఉన్నవారు ఈ ఆహారం తినొద్దు!

image

హైబీపీ ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలనే విషయంలో వైద్యులు పలు సూచనలు చేశారు. హైబీపీ రోగులు ‘ఎక్కువ ఉప్పు ఉన్న ఫుడ్ తినొద్దు. పచ్చళ్లు తినొద్దు. రోజుకు 2 గ్రాముల సాల్ట్ మాత్రమే తినాలి. ప్యాకేజ్డ్ ఫుడ్ తినొద్దు. ఇంట్లో ఫ్రెష్‌గా చేసుకున్న ఫుడ్ బెటర్. డిజర్ట్స్& ఐస్ క్రీమ్ తినొద్దు. బేక్డ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ కాకుండా నట్స్ తినండి. మద్యం అలవాటు ఉంటే మానేయండి. కాఫీ తాగొద్దు’ అని తెలిపారు.

News January 3, 2025

ఢిల్లీ చ‌లీ మోదీ కే సాథ్.. BJP కొత్త ప్ర‌చారం

image

ప్రధాని మోదీ కేంద్రంగానే ఢిల్లీ ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధమైంది. ఫిబ్ర‌వ‌రిలో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో పార్టీ గెలుపు కోసం ఢిల్లీ చ‌లీ మోదీకే సాథ్ (ఢిల్లీ న‌డుస్తుంది మోదీ వెంట‌) నినాదంతో ప్రచారపర్వాన్ని ప్రారంభించింది. ఢిల్లీలో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను మోదీ ప్రారంభించిన రోజునే BJP ఈ ప్ర‌చారానికి తెర‌లేప‌డం గ‌మ‌నార్హం. ఈ సారి ఆప్‌ను గద్దెదించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది.

News January 3, 2025

మహేశ్ వాయిస్‌తో ‘ముఫాసా’ తెలుగు వెర్షన్ సక్సెస్!

image

‘లయన్ కింగ్’కు ప్రీక్వెల్‌గా వచ్చిన ‘ముఫాసా: ది లయన్ కింగ్’ థియేటర్లలో అదరగొడుతోంది. హాలీవుడ్‌లో రూ.వేల కోట్ల కలెక్షన్లు రాబడుతోంది. అయితే, అమెరికా బాక్సాఫీస్ వద్ద తెలుగు వెర్షన్‌కు సైతం మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటివరకు ఈ సినిమా తెలుగు వెర్షన్‌కు $31,771, హిందీకి $11,240, తమిళానికి $1,659 కలెక్షన్లు వచ్చాయి. మహేశ్ వాయిస్ ఇవ్వడం వల్ల దీనికి మరింత ఆదరణ లభించిందని సినీవర్గాలు తెలిపాయి.

News January 3, 2025

Stock Market: నష్టాల్లోకి.. పార్టీ అయిపోయింది

image

స్టాక్ మార్కెట్లు న‌ష్టాల‌బాట‌ప‌ట్టాయి. గ‌రిష్ఠాల వ‌ద్ద ప్రాఫిట్ బుకింగ్ జ‌ర‌గ‌డంతో Sensex 720 పాయింట్లు న‌ష్ట‌పోయి 79,223 వ‌ద్ద, నిఫ్టీ 183 పాయింట్లు కోల్పోయి 24,004 వ‌ద్ద స్థిర‌ప‌డ్డాయి. ఉద‌యం నుంచి మిడ్ సెష‌న్ వ‌ర‌కు 2 సూచీల్లో బేర్స్ ర్యాలీ జ‌రిగింది. Niftyలో 24,000 ప‌రిధిలో, Sensexలో 79,250 వ‌ద్ద స‌పోర్ట్ ల‌భించ‌డంతో సూచీలు కొంత‌మేర కోలుకున్నాయి. IT స్టాక్స్ అత్య‌ధికంగా 1.41% న‌ష్ట‌పోయాయి.

News January 3, 2025

సమాజహితం కోసమే సచ్చిదానందస్వామి పనిచేస్తున్నారు: సీఎం

image

AP: విజయవాడ పటమటలోని దత్తపీఠాన్ని సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. గణపతి సచ్చిదానందస్వామి ఆయనకు స్వాగతం పలికి తీర్థప్రసాదాలను అందజేశారు. స్వామీజీని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని సీఎం తెలిపారు. సమాజహితం కోసమే స్వామి పనిచేస్తున్నారని చెప్పారు. తన కష్టాలు తొలగాలని ఆయన పూజలు చేశారన్నారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధనే తన లక్ష్యమని పునరుద్ఘాటించారు.

News January 3, 2025

మహిళలకు ఫ్రీ బస్.. బెంగళూరులో ఏపీ మంత్రులు

image

AP: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సర్కార్ వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఇందుకు సంబంధించిన మంత్రివర్గ సబ్ కమిటీ కర్ణాటకలోని బెంగళూరులో పర్యటిస్తోంది. మంత్రులు రాంప్రసాద్ రెడ్డి, వంగలపూడి అనిత, సంధ్యారాణి అక్కడి బస్సులు ఎక్కి ప్రయాణికులతో మాట్లాడారు. అనంతరం ఆ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డితో వారు భేటీ అయ్యారు. అక్కడ అమలవుతున్న ఫ్రీ బస్ జర్నీపై వారు వివరాలు అడిగి తెలుసుకున్నారు.

News January 3, 2025

తెలుగు డైరెక్టర్ కన్నుమూత

image

డైరెక్టర్, రచయిత అపర్ణ మల్లాది(54) కన్నుమూశారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె USలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈమె ‘ది అనుశ్రీ ఎక్స్‌పరిమెంట్’ అనే సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. తర్వాత తీసిన ‘పోష్ పోరిస్’ అనే వెబ్ సిరీస్ సూపర్ హిట్టయ్యింది. రెండేళ్ల కిందట ప్రిన్స్, అనీషా, భావన ప్రధాన పాత్రల్లో ‘పెళ్లి కూతురు పార్టీ’ అనే చిత్రాన్ని రూపొందించారు. ఈమె పలు చిత్రాలకు కథలను కూడా అందించారు.