News March 9, 2025

అడుగంటిన నీరు.. ఎండుతున్న పైరు

image

వేసవి ఇంకా ముదరకముందే TGలో పంటలు ఎండుతున్నాయి. గతేడాది కృష్ణా, గోదావరిలో సమృద్ధిగా నీరు ఉండటం, ప్రాజెక్టులు సైతం కళకళలాడటం, భూగర్భజలాలు పెరగడంతో అన్నదాతలు వరిసాగు గణనీయంగా పెంచారు. కానీ రోజులు గడుస్తున్నా కొద్దీ పరిస్థితి దిగజారింది. ప్రాజెక్టుల్లో నీళ్లు ఖాళీ అయ్యాయి. గ్రౌండ్ వాటర్ తగ్గిపోయి బోర్లు అడుగంటాయి. దీంతో నీరందక పైర్లు ఎండిపోతున్నాయి. దిక్కుతోచని స్థితిలో రైతులు ఆవేదనకు గురవుతున్నారు.

Similar News

News February 7, 2026

శుభవార్త చెప్పిన ప్రభుత్వం

image

APలోని టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఆర్థిక ఇబ్బందులతో తమ వాటా డబ్బులు చెల్లించలేక ఇళ్లు కట్టుకోలేని వారికి రుణాలు సమకూర్చనుంది. ఒక్కొక్కరికి ₹3.65 లక్షల చొప్పున 39వేల మందికి ₹1,423 కోట్లు అందించనుంది. ఈ రుణాన్ని 10.2-11.5% వడ్డీతో 15-20 ఏళ్లలో చెల్లించాల్సి ఉంటుంది. కాగా ఈ ఏడాది జూన్‌కు 2.61 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

News February 7, 2026

మెత్తబడ్డ PCB.. T20 WCలో భారత్-పాక్ పోరు పక్కా?

image

భారత్‌తో మ్యాచ్‌ బాయ్‌కాట్ విషయంలో పాక్ క్రికెట్ బోర్డు కాస్త మెత్తబడ్డట్లు కనిపిస్తోంది. రూట్ మార్చి ICCతో చర్చలు ప్రారంభించింది. భారీ జరిమానాలు, బైలేటరల్ సిరీస్‌లపై నిషేధం వంటి గట్టి వార్నింగ్‌లు రావడంతోనే పాక్ దారికొచ్చినట్లు తెలుస్తోంది. శ్రీలంక బోర్డు కూడా ఆర్థిక నష్టాల దృష్ట్యా ఆడమని కోరింది. దీంతో వచ్చే ఆదివారం కొలంబోలో జరగాల్సిన ఈ హై-వోల్టేజ్ పోరుపై మళ్లీ ఆశలు చిగురించాయి.

News February 7, 2026

టీమ్ ఇండియాకు షాక్.. కుప్పకూలిన టాపార్డర్

image

టీ20 వరల్డ్ కప్: అమెరికాతో మ్యాచ్‌లో టీమ్ ఇండియా టాపార్డర్ కుప్పకూలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ గోల్డెన్ డక్ అయ్యాక ఇషాన్, తిలక్ కాస్త ఫామ్‌లో కనిపించారు. కానీ కాసేపటికే ఇషాన్(20) క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరారు. రెండు బంతుల తేడాతోనే తిలక్(25) కూడా క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. శివమ్ దూబే కూడా గోల్డెన్ డక్ అయ్యారు. 6వ ఓవర్లో 3 వికెట్లు పడ్డాయి. భారత్ స్కోర్ 7 ఓవర్లలో 49/4గా ఉంది.