India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హిమాచల్ ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో అభిషేక్ మను సింఘ్వీ ఓడిపోయినా కాంగ్రెస్ అయనకు మళ్లీ అవకాశం ఇచ్చింది. సింఘ్వీ ప్రముఖ న్యాయవాది. పార్టీకి సంబంధించిన న్యాయపరమైన అంశాలను ఆయనే చూసుకుంటారు. కపిల్ సిబల్ కాంగ్రెస్ను వీడడంతో పార్టీలో న్యాయ నిపుణుల లోటు ఏర్పడింది. దీంతో పార్టీకి సింఘ్వీ అవసరం చాలా ఉండడంతో మళ్లీ తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిత్వం దక్కినట్టు తెలుస్తోంది.
AP: ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చాకే రాష్ట్రంలో పాలన గాడిలో పడుతోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. జగన్ తప్పిదాలతోనే ఆరోగ్యశ్రీ నిధులు బకాయిలు పడ్డాయని విమర్శించారు. తాము 2 నెలల్లోనే ఆస్పత్రులకు బకాయిలు చెల్లిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు కోల్కతాలో డాక్టర్ హత్య ఘటనను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. వైద్యుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
AP: పౌరులకు అవసరమైన సేవలన్నీ ఒక యాప్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చే చర్యలు చేపట్టాలని ఐటీ శాఖను సీఎం చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాన్ని స్టార్టప్ హబ్గా తీర్చిదిద్దేందుకు సమగ్ర నివేదిక రూపొందించాలన్నారు. సైబర్ సెక్యూరిటీకి ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్రంలోని సీసీ కెమెరాలు పూర్తి స్థాయిలో పనిచేసేలా చూడాలన్నారు.
రేపు ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ రిలీజ్ కానున్న నేపథ్యంలో అభిమానులను ఉద్దేశించి హీరో రామ్ పోతినేని ట్వీట్ చేశారు. ‘చేతనైనంతా.. కుదిరినంతా.. వీలైనంతా.. కాదు. మీ కోసం ఎప్పుడూ ఉన్నదంతా పెట్టేస్తా. సినిమా తీస్తున్నప్పుడు మాకు కలిగిన మెంటల్ మ్యాడ్నెస్ను మీరూ పొందుతారని భావిస్తున్నాం. మరికొన్ని గంటల్లో డబుల్ ఇస్మార్ట్ మీది కానుంది’ అని పేర్కొన్నారు.
ట్రైనీ డాక్టర్పై హత్యాచారం కేసులో దోషిని ఉరితీయాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. అవసరమైతే దీని కోసం ర్యాలీ తీస్తామని స్పష్టం చేశారు. ఈ కేసులో కోల్కతా పోలీసుల వద్ద ఆధారాలు ఉన్నాయని, వాటిని సీబీఐకి సమర్పించినట్టు తెలిపారు. ‘ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు. అతడిని ఉరితీయడమే మాకు కావాలి. వచ్చే ఆదివారం వరకు సీబీఐ న్యాయం చేస్తుందని ఆశిస్తున్నా’ అని ఆమె అన్నారు.
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్కు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్లో షాక్ తగిలింది. వినేశ్ అప్పీల్ను కోర్టు డిస్మిస్ చేసినట్లు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(IOA) నిర్ధారించింది. దీంతో ఆమె సిల్వర్ మెడల్ గెలుచుకునే అవకాశాన్ని కోల్పోయారు. రెజ్లింగ్ ఫైనల్కు ముందు 100 గ్రాముల బరువు ఎక్కువ ఉండటంతో IOC ఆమెను డిస్క్వాలిఫై చేసింది.
సీజనల్ ఫ్రూట్స్, కూరగాయలు తినాలని వైద్యులు సూచిస్తుంటారు. ఆ కోవకు చెందిన బోడ కాకరకాయ గురించి తెలుసుకుందాం. కేవలం వర్షాకాలంలోనే దొరికే ఈ కూరగాయలో అనేక పోషకాలతో పాటు ఔషధ విలువలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తినడం వల్ల సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువని వైద్యులు చెబుతున్నారు. ఇందులో B1 ,B2 , B3 సహా పలు విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి తింటే బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా అదుపులో ఉంటాయి.
ప్రపంచంలోనే అత్యధిక బరువున్న వ్యక్తిగా పేరొందిన సౌదీ అరేబియాకు చెందిన ఖలీద్ ఏకంగా 500 కేజీలకు పైగా బరువు తగ్గాడు. 2013లో ఖలీద్ 610KGల బరువుతో మంచానికే పరిమితమై ఉండేవాడు. అతడు బరువు తగ్గేందుకు అప్పటి సౌదీ రాజు అబ్దుల్లా 30 మంది వైద్యులతో మెడికల్ టీమ్ ఏర్పాటు చేశారు. ప్రత్యేక డైట్తో పలు సర్జరీలు చేయగా ఇప్పుడు 63.5 కేజీలకు తగ్గాడు. సన్నగా మారిన అతడికి సిబ్బంది ‘స్మైలింగ్ మ్యాన్’ అని పేరు పెట్టారు.
కొన్ని ట్యాబ్లెట్ల వెనకవైపు రెడ్ కలర్ లైన్ ఉంటుంది. ప్రధానంగా యాంటీబయాటిక్స్లో కనిపిస్తుంది. దీని అర్థం ఏంటంటే ఈ ట్యాబ్లెట్లు వాడటానికి డాక్టర్ సలహా తప్పనిసరి. ఇష్టానుసారం ఈ మెడిసిన్ తీసుకుంటే ప్రాణాలకు ప్రమాదం ఉంటుంది. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గతంలోనే స్పష్టం చేసింది. అందుకే మీరు ట్యాబ్లెట్ల ఎక్స్పైరీ డేట్తో పాటు ఈ రెడ్ లైన్ కూడా గమనించడం ముఖ్యం. > SHARE
మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీశ్ శంకర్ తెరకెక్కించిన ‘మిస్టర్ బచ్చన్’ ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. సినిమాను చూస్తోన్న అభిమానులు తమ సంతోషాన్ని వీడియోల రూపంలో X వేదికగా పంచుకుంటున్నారు. ఈక్రమంలో ఈ సినిమా సన్నివేశాలను రివీల్ చేసే వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దని హరీశ్ శంకర్ అభిమానులకు విజ్ఞప్తి చేశారు. అలా చేస్తే సిల్వర్ స్క్రీన్పై చూసేటప్పుడు ఉండే ఎగ్జైట్మెంట్ పోతుందని తెలిపారు.
Sorry, no posts matched your criteria.