News September 20, 2024

పవన్.. ఎందుకు వదంతులు వ్యాప్తి చేస్తున్నారు?: ప్రకాశ్ రాజ్

image

తిరుమల లడ్డూ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ చేసిన ట్వీట్‌పై నటుడు ప్రకాశ్ రాజ్ విమర్శలు గుప్పించారు. ‘మీరు DCMగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఇష్యూ ఇది. దర్యాప్తు చేయండి. నేరస్థులు దొరికితే కఠిన చర్యలు తీసుకోండి. అంతేగానీ ఎందుకు ఊహాగానాల్ని వ్యాప్తి చేస్తున్నారు? కేంద్రంలో మీ స్నేహితుల వల్ల దేశంలో మనకున్న మతకల్లోలాలు చాలు’ అని ట్వీట్ చేశారు. దీంతో ఆయనపై పవన్ అభిమానులు మండిపడుతున్నారు.

News September 20, 2024

కాళేశ్వరం కింద పండే ప్రతి పంటపై KCR పేరుంటుంది: హరీశ్‌రావు

image

TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నాయకులు బోగస్ మాటలు మానుకోవాలని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. మల్లన్నసాగర్ నిండుకుండలా ఉందంటే కాళేశ్వరం పుణ్యమేనని అన్నారు. ఎల్లంపల్లి మొదలుకుని కొండపోచమ్మ వరకు గోదావరి జలాలు వస్తున్నాయంటే ఈ ప్రాజెక్టు నిర్మించడం వల్ల కాదా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం కింద పండే ప్రతి పంటపై, రైతుల గుండెల్లో కేసీఆర్ ఉంటారని హరీశ్ వ్యాఖ్యానించారు.

News September 20, 2024

ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా రాకెట్ల వర్షం

image

ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా వందలాది రాకెట్లతో విరుచుకుపడింది. దాదాపు 140 రాకెట్ లాంఛర్లతో ఉత్తర ఇజ్రాయెల్‌లోని పలు సైనిక స్థావరాలపై దాడి చేసింది. ఈ విషయాన్ని ఆ దేశం కూడా ధ్రువీకరించింది. కాగా ఇప్పటివరకు హమాస్ అంతమే లక్ష్యంగా పోరాడుతున్న ఇజ్రాయెల్ ఇప్పుడు హెజ్బొల్లాను కూడా టార్గెట్ చేసింది. దక్షిణ లెబనాన్‌పై వైమానిక దాడులు చేస్తోంది. పరస్పర దాడులతో మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

News September 20, 2024

బాంబే హైకోర్టులో కేంద్రానికి చుక్కెదురు.. ఐటీ రూల్స్ సవరణలు కొట్టివేత

image

IT రూల్స్‌కి కేంద్రం చేసిన స‌వ‌ర‌ణ‌ల‌ను బాంబే హైకోర్టు కొట్టివేసింది. సోష‌ల్ మీడియా వేదిక‌ల‌పై ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాల‌కు సంబంధించి వ‌చ్చే న‌కిలీ, త‌ప్పుడు వార్త‌ల‌కు అడ్డుక‌ట్ట‌వేయ‌డానికి ఫ్యాక్ట్ చెక్ యూనిట్‌ను ఏర్పాటు చేసుకొనేలా కేంద్రం IT చ‌ట్టానికి స‌వ‌ర‌ణ‌లు చేసింది. అయితే ఇది ఆర్టిక‌ల్ 14 (స‌మాన‌త్వం), 19(స్వేచ్ఛ‌) హ‌క్కుల‌ను ఉల్లంఘించ‌డ‌మేన‌ని జస్టిస్ అతుల్ చందూర్కర్ బెంచ్ అభిప్రాయ‌ప‌డింది.

News September 20, 2024

రేపు గవర్నర్‌ను కలవనున్న వైఎస్ షర్మిల

image

ఏపీ గవర్నర్‌ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రేపు కలవనున్నారు. తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణకు ఆదేశించేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ఇవ్వనున్నారు.

News September 20, 2024

వైవీ, ధర్మారెడ్డిపై హిందూ సంఘాల ఫిర్యాదు

image

AP: TTD మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మాజీ EO ధర్మారెడ్డిపై గుంటూరులోని అరండల్ పేట పోలీస్ స్టేషన్‌లో హిందూ సంఘాలు ఫిర్యాదు చేశాయి. ‘వైవీ, ధర్మారెడ్డి కలిసి తిరుమల లడ్డూను జంతువుల నూనెతో తయారు చేయించి అపవిత్రం చేశారు. తాము తీవ్ర మనస్తాపానికి గురయ్యాం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. మాజీ CM జగన్‌కు తెలియకుండా ఇది జరగదు. అందుకే ఆయన కూడా ప్రజలకు క్షమాపణ చెప్పాలి’ అని ఆ సంఘాలు డిమాండ్ చేశాయి.

News September 20, 2024

తిరుమలలో లడ్డూ ప్రసాదం ఎప్పుడు మొదలైందంటే..

image

భక్తులు అమృతంగా భావించే తిరుమల లడ్డూ పంపిణీ ఎప్పటి నుంచి ప్రారంభమైంది? దీనిపై భిన్న కథనాలున్నాయి. అయితే 1803 నుంచి బూందీ ప్రసాద వితరణ ప్రారంభమైందనేది చరిత్రకారుల అంచనా. ఆ తర్వాత అనేక మార్పులతో 1940 నాటికి ఇప్పుడున్న లడ్డూగా స్థిరపడిందని చెబుతున్నారు. అంతకంటే ముందు తిరుప్పొంగం, సుఖీయం, 1455లో అప్పం, వడ(1460), అత్తిరసం(1468), మనోహరపడి(1547) ప్రసాదాలను భక్తులకు అందించేవారని తెలుస్తోంది.

News September 20, 2024

ALERT.. ఈ జిల్లాల్లో వర్షాలు

image

తెలంగాణలో మళ్లీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు ఉదయం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30-40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

News September 20, 2024

రేపు పండితులతో సీఎం చంద్రబాబు సమావేశం

image

AP: తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడటంపై శాస్త్రాల పరంగా తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. రేపు ఆగమ, వైదిక పరిషత్‌లతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. ఆలయ శుద్ధి అవసరమా? తదితర అంశాలపై పండితులు ఇచ్చే సూచనలు, సలహాలతో తదుపరి చర్యలు తీసుకోనున్నారు.

News September 20, 2024

పంచామృతంలో ఏఆర్ డెయిరీ నెయ్యి వాడట్లేదు: TN ప్రభుత్వం

image

AP: తిరుమలకు నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డెయిరీపై తమిళనాడు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పళని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలోని పంచామృతంలో ఏఆర్ డెయిరీ నెయ్యి వాడుతున్నారన్న ప్రచారం అవాస్తవమని తెలిపింది. ఆవిన్ నెయ్యి వాడుతున్నట్లు వెల్లడించింది. కాగా ఇప్పటికే ఏఆర్ డెయిరీపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.