News August 14, 2024

పౌర సేవలకు ఒక యాప్: చంద్రబాబు

image

AP: పౌరులకు అవసరమైన సేవలన్నీ ఒక యాప్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చే చర్యలు చేపట్టాలని ఐటీ శాఖను సీఎం చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాన్ని స్టార్టప్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు సమగ్ర నివేదిక రూపొందించాలన్నారు. సైబర్ సెక్యూరిటీకి ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్రంలోని సీసీ కెమెరాలు పూర్తి స్థాయిలో పనిచేసేలా చూడాలన్నారు.

News August 14, 2024

మీ కోసం ఉన్నదంతా పెట్టేస్తా: రామ్ పోతినేని

image

రేపు ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ రిలీజ్ కానున్న నేపథ్యంలో అభిమానులను ఉద్దేశించి హీరో రామ్ పోతినేని ట్వీట్ చేశారు. ‘చేతనైనంతా.. కుదిరినంతా.. వీలైనంతా.. కాదు. మీ కోసం ఎప్పుడూ ఉన్నదంతా పెట్టేస్తా. సినిమా తీస్తున్నప్పుడు మాకు కలిగిన మెంటల్‌ మ్యాడ్‌నెస్‌ను మీరూ పొందుతారని భావిస్తున్నాం. మరికొన్ని గంటల్లో డబుల్ ఇస్మార్ట్ మీది కానుంది’ అని పేర్కొన్నారు.

News August 14, 2024

దోషిని ఉరి తీయాలి: CM మ‌మ‌తా బెనర్జీ

image

ట్రైనీ డాక్ట‌ర్‌పై హ‌త్యాచారం కేసులో దోషిని ఉరితీయాల‌ని బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ డిమాండ్ చేశారు. అవసరమైతే దీని కోసం ర్యాలీ తీస్తామని స్పష్టం చేశారు. ఈ కేసులో కోల్‌క‌తా పోలీసుల వ‌ద్ద ఆధారాలు ఉన్నాయ‌ని, వాటిని సీబీఐకి స‌మ‌ర్పించిన‌ట్టు తెలిపారు. ‘ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు. అతడిని ఉరితీయడమే మాకు కావాలి. వచ్చే ఆదివారం వరకు సీబీఐ న్యాయం చేస్తుందని ఆశిస్తున్నా’ అని ఆమె అన్నారు.

News August 14, 2024

BIG BREAKING: వినేశ్‌కు భారీ షాక్.. అప్పీల్ డిస్మిస్

image

భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్‌కు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్‌లో షాక్ తగిలింది. వినేశ్ అప్పీల్‌ను కోర్టు డిస్మిస్ చేసినట్లు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(IOA) నిర్ధారించింది. దీంతో ఆమె సిల్వర్ మెడల్ గెలుచుకునే అవకాశాన్ని కోల్పోయారు. రెజ్లింగ్ ఫైనల్‌కు ముందు 100 గ్రాముల బరువు ఎక్కువ ఉండటంతో IOC ఆమెను డిస్‌క్వాలిఫై చేసింది.

News August 14, 2024

బోడకాకరలో బోలెడన్ని పోషకాలు

image

సీజనల్ ఫ్రూట్స్, కూరగాయలు తినాలని వైద్యులు సూచిస్తుంటారు. ఆ కోవకు చెందిన బోడ కాకరకాయ గురించి తెలుసుకుందాం. కేవలం వర్షాకాలంలోనే దొరికే ఈ కూరగాయలో అనేక పోషకాలతో పాటు ఔషధ విలువలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తినడం వల్ల సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువని వైద్యులు చెబుతున్నారు. ఇందులో B1 ,B2 , B3 సహా పలు విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి తింటే బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా అదుపులో ఉంటాయి.

News August 14, 2024

సౌదీ రాజు సాయంతో 500KGలకు పైగా బరువు తగ్గాడు!

image

ప్రపంచంలోనే అత్యధిక బరువున్న వ్యక్తిగా పేరొందిన సౌదీ అరేబియాకు చెందిన ఖలీద్ ఏకంగా 500 కేజీలకు పైగా బరువు తగ్గాడు. 2013లో ఖలీద్ 610KGల బరువుతో మంచానికే పరిమితమై ఉండేవాడు. అతడు బరువు తగ్గేందుకు అప్పటి సౌదీ రాజు అబ్దుల్లా 30 మంది వైద్యులతో మెడికల్ టీమ్ ఏర్పాటు చేశారు. ప్రత్యేక డైట్‌తో పలు సర్జరీలు చేయగా ఇప్పుడు 63.5 కేజీలకు తగ్గాడు. సన్నగా మారిన అతడికి సిబ్బంది ‘స్మైలింగ్ మ్యాన్’ అని పేరు పెట్టారు.

News August 14, 2024

ట్యాబ్లెట్లపై ఈ రెడ్ లైన్ ఎందుకు ఉంటుంది?

image

కొన్ని ట్యాబ్లెట్ల వెనకవైపు రెడ్ కలర్ లైన్ ఉంటుంది. ప్రధానంగా యాంటీబయాటిక్స్‌లో కనిపిస్తుంది. దీని అర్థం ఏంటంటే ఈ ట్యాబ్లెట్లు వాడటానికి డాక్టర్‌ సలహా తప్పనిసరి. ఇష్టానుసారం ఈ మెడిసిన్ తీసుకుంటే ప్రాణాలకు ప్రమాదం ఉంటుంది. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గతంలోనే స్పష్టం చేసింది. అందుకే మీరు ట్యాబ్లెట్ల ఎక్స్‌పైరీ డేట్‌తో పాటు ఈ రెడ్ లైన్ కూడా గమనించడం ముఖ్యం. > SHARE

News August 14, 2024

మూవీ వీడియోలను షేర్ చేయకండి: హరీశ్ శంకర్

image

మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీశ్ శంకర్ తెరకెక్కించిన ‘మిస్టర్ బచ్చన్’ ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. సినిమాను చూస్తోన్న అభిమానులు తమ సంతోషాన్ని వీడియోల రూపంలో X వేదికగా పంచుకుంటున్నారు. ఈక్రమంలో ఈ సినిమా సన్నివేశాలను రివీల్ చేసే వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దని హరీశ్ శంకర్ అభిమానులకు విజ్ఞప్తి చేశారు. అలా చేస్తే సిల్వర్ స్క్రీన్‌పై చూసేటప్పుడు ఉండే ఎగ్జైట్‌మెంట్‌ పోతుందని తెలిపారు.

News August 14, 2024

ALERT.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: రేపు రాష్ట్రంలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. వైజాగ్, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో , ప.గో , ఏలూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, YSR, చిత్తూరులో తేలికపాటి జల్లులు పడే అవకాశముందని పేర్కొంది.

News August 14, 2024

డెంగ్యూ నివార‌ణ‌లో కీల‌క మైలురాయి

image

ICMR, పనాసియా బయోటెక్ భారతదేశంలో డెంగ్యూ వ్యాక్సిన్ కోసం మొట్టమొదటి ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించాయి. ఇది డెంగ్యూను ఎదుర్కోవడానికి దేశం చేస్తున్న ప్రయత్నాలలో కీలక మైలురాయని కేంద్ర ఆరోగ్య మంత్రి పేర్కొన్నారు. పనాసియా బయోటెక్ ఈ టెట్రావాలెంట్ డెంగ్యూ వ్యాక్సిన్‌ డెంగీఆల్‌ని అభివృద్ధి చేసింది. 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ట్రయల్స్ జరగనున్నాయి.