News September 20, 2024

ప్చ్.. మళ్లీ తక్కువ రన్స్‌కే ఔటైన రోహిత్

image

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ పూర్తిగా విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో 6 పరుగులు చేసిన హిట్‌మ్యాన్ రెండో ఇన్నింగ్స్‌లో 5 రన్స్‌కే పెవిలియన్ చేరారు. తస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో జాకీర్ హసన్‌కు క్యాచ్ ఇచ్చి అందరినీ నిరాశ పరిచారు. కాగా చిన్న జట్టుపై తక్కువ స్కోరుకే ఔట్ కావడంతో రోహిత్‌కు ఏమైందంటూ ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

News September 20, 2024

నెవర్ బిఫోర్ స్థాయికి దేశీయ స్టాక్ మార్కెట్లు

image

ద‌లాల్ స్ట్రీట్‌లో బుల్ రంకెలేసింది. గ్లోబ‌ల్ మార్కెట్స్‌లో పాజిటివ్ సెంటిమెంట్‌తో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్ర‌వారం జీవిత‌కాల గ‌రిష్ఠాల‌కు చేరుకున్నాయి. సెన్సెక్స్ 1,359 పాయింట్ల లాభంతో 84,544 వ‌ద్ద‌, నిఫ్టీ 375 పాయింట్ల లాభంతో 25,790 వ‌ద్ద స్థిర‌ప‌డ్డాయి. దీంతో BSE నమోదిత సంస్థల ఇన్వెస్టర్ల సంపద ఒక్క రోజులోనే రూ.6 లక్షల కోట్లకు చేరింది. PSU రంగ షేర్లు మినహా అన్ని రంగాల షేర్లు లాభాలు గడించాయి.

News September 20, 2024

జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు

image

TG: అత్యాచార ఆరోపణలతో చంచల్‌గూడ జైల్లో ఉన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను పోలీసులు పొందుపరిచారు. ‘2019లో దురుద్దేశంతోనే బాధితురాలిని అసిస్టెంట్‌గా చేర్చుకున్నారు. 2020లో ముంబైలోని ఓ హోటల్‌లో ఆమెపై అత్యాచారం చేశారు. అప్పుడు ఆమె వయస్సు 16 ఏళ్లు. గత నాలుగేళ్లలో పలుమార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. నేరాన్ని జానీ అంగీకరించారు’ అని పోలీసులు రిపోర్టులో పేర్కొన్నారు.

News September 20, 2024

వర్క్ లైఫ్ బ్యాలెన్స్.. యూరప్‌లో బెస్ట్

image

సౌత్ఏషియాతో పోలిస్తే యూరప్ దేశాల్లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెరుగ్గా ఉంది. ఇక్కడ వారానికి సగటున 35Hrs మాత్రమే పనిచేస్తున్నారని ILO తెలిపింది. నెదర్లాండ్స్‌లో 31.6, నార్వేలో 33.7, జర్మనీలో 34.2, జపాన్‌లో 36.6, సింగపూర్ 42.6 గంటలు పనిచేస్తున్నారు. ఇక వనాటులో ఉద్యోగులు సగటున 24.7 గంటలే పనిచేస్తుండటం గమనార్హం. కిరిబాటి 27.3, మైక్రోనేషియా 30.4 గంటలతో తక్కువ పనివేళల జాబితాలో ముందున్నాయి.

News September 20, 2024

రాజ‌కీయ కార్యాచ‌ర‌ణ‌పై ద‌ళ‌ప‌తి విజ‌య్ ప్ర‌క‌ట‌న‌

image

త‌మిళ‌గ వెట్రి క‌ళగం మొద‌టి రాష్ట్ర స్థాయి స‌ద‌స్సును అక్టోబ‌ర్ 27న విల్లుపురం జిల్లాలోని విక్రవాండి వి సలై గ్రామంలో నిర్వహించనున్న‌ట్టు ద‌ళ‌ప‌తి విజ‌య్ ప్ర‌క‌టించారు. త‌మిళ‌ ప్రజల అభిమానం, మద్దతుతో తమ విజయవంతమైన రాజకీయ యాత్ర సాగుతోందన్నారు. పార్టీ రాజకీయ భావజాల నేత‌ల‌ను, పార్టీ సిద్ధాంతాలను, విధానాలను, భవిష్యత్తు కార్యాచరణను స‌ద‌స్సులో ప్ర‌క‌టించ‌నున్న‌ట్టు విజ‌య్ తెలిపారు.

News September 20, 2024

నెయ్యి నాణ్యత 100 పాయింట్లకు 20 పాయింట్లే ఉంది: టీటీడీ ఈఓ

image

AP: నెయ్యి నాణ్యత ఉంటేనే, లడ్డూ నాణ్యతగా ఉంటుందని టీటీడీ ఈఓ శ్యామలరావు అన్నారు. గతంలో వాడిన నెయ్యి నాణ్యత 100 పాయింట్లకుగానూ 20 పాయింట్లే ఉందని ఆయన తెలిపారు. ‘గతంలో ఏఆర్ డెయిరీ వచ్చిన 4 ట్యాంకర్లలోని నెయ్యిని తిరిగి పంపాం. ఆ నెయ్యిని 10 ల్యాబ్‌లలో పరీక్షించాం. వారంలో రిపోర్టు వచ్చింది. ఆ నెయ్యిలో భారీగా కల్తీ జరిగినట్లు రిపోర్టులో తేలింది’ అని ఆయన పేర్కొన్నారు.

News September 20, 2024

చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు: జగన్

image

AP: తన పాలనలోని వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని జగన్ ఆరోపించారు. ‘ముంబై నటి కేసు, IPSల సస్పెన్షన్, మదనపల్లె ఫైళ్ల దగ్ధం ఘటనలతో డైవర్షన్ పాలిటిక్స్ తెరపైకి తెచ్చారు. విజయవాడ వరదలపై ముందస్తు చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వంపై విమర్శలు వస్తుంటే బ్యారేజీ గేట్ల వద్దకు బోట్లు వదిలారని అంటున్నారు. ఇప్పుడు తిరుమల నెయ్యి అంశాన్ని తెరపైకి తెచ్చారు’ అని ఫైర్ అయ్యారు.

News September 20, 2024

కల్తీ నెయ్యి వ్యవహారమంతా కట్టు కథ: జగన్

image

AP: చంద్రబాబు అనే వ్యక్తి దుర్మార్గుడని YS జగన్ ధ్వజమెత్తారు. ‘దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగాలనే వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవరూ ఉండరు. 100 రోజుల చంద్రబాబు పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. అందుకే తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ పేరుతో డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. కల్తీ నెయ్యి వ్యవహారమంతా ఓ కట్టు కథ. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా చంద్రబాబు మాట్లాడారు’ అని జగన్ మండిపడ్డారు.

News September 20, 2024

తిరుమల ఆలయ ప్రతిష్ఠను కాపాడాలి: టీటీడీ ఈఓ

image

AP: తిరుమల ఆలయ ప్రతిష్ఠను భక్తులు, ప్రజలు కాపాడాలని టీటీడీ ఈఓ శ్యామలరావు కోరారు. శ్రీవారి లడ్డూ వివాదంపై ఈఓ స్పందించారు. ‘రికార్డుల్లో లడ్డూ తయారీకి స్వచ్ఛమైన నెయ్యిని వాడాలని ఉంది. నెయ్యి నాణ్యతను పరీక్షించే పరికరాలను గుజరాత్‌లోని ఎన్‌డీడీబీ విరాళంగా ఇచ్చింది. వాటితోనే నెయ్యి నాణ్యతను పరీక్షిస్తున్నాం. బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చిస్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు.

News September 20, 2024

జంతువుల కొవ్వు నెయ్యిలో కలిసింది: టీటీడీ ఈవో

image

తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి AR డెయిరీ సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసినట్లు NDDB రిపోర్టు తేల్చిందని TTD EO శ్యామలరావు ప్రకటించారు. నెయ్యిపై అనుమానంతో జులై 6న 2 ట్యాంకర్లను ల్యాబ్‌కు పంపితే నాణ్యత లేదని తేలిందన్నారు. తీవ్ర కల్తీ జరిగిందని తేలిన వెంటనే చర్యలు చేపట్టామన్నారు. వెంటనే AR డెయిరీ నెయ్యిని వాడటం ఆపేశామన్నారు. బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై కమిటీ వేశామన్నారు.