India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాల నిడివిలో ప్రధాని మోదీ తన రికార్డును తానే బద్దలుకొట్టారు. 2016లో 96 నిమిషాల పాటు ప్రసంగించగా నేడు 98 నిమిషాలతో దాన్ని దాటేశారు. ప్రధానిగా ఆయన స్పీచ్ల సగటు 82 నిమిషాలుగా ఉంది. మరే ప్రధానికి ఈ సగటు లేదు. అత్యల్పంగా 2017లో 56 నిమిషాల పాటు మాట్లాడారు. గత ఏడాది 90 మినిట్స్ ప్రసంగించారు.
TG: సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా భద్రాద్రి జిల్లాకు నీళ్లు ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, హరిప్రియ నాయక్ నిరసనకు దిగారు. దీంతో వారిని పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. సీఎం రేవంత్ కాసేపట్లో వైరాలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొననున్నారు.
భారత స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా గూగుల్ తమ హోం పేజీని ప్రత్యేక డూడుల్తో అలంకరించింది. ఫ్రీలాన్స్ ఆర్ట్ డైరెక్టర్ వృందా జవేరీ దీన్ని రూపొందించారు. దేశవ్యాప్తంగా ప్రజలు ఈ రోజు త్రివర్ణాలతో వేడుకలు చేసుకుంటారని, ఈ సందర్భంగా వారసత్వ నిర్మాణశైలిని ప్రతిబింబించేలా పలు వర్ణాలతో డూడుల్ని తీర్చిదిద్దామని గూగుల్ తెలిపింది. ప్రత్యేక సందర్భాల్లో గూగుల్ హోం పేజీలో డూడుల్ను ఏర్పాటు చేస్తుంటుంది.
AP: తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల కళ్లలో ఆనందం కనిపిస్తోందని మంత్రి లోకేశ్ చెప్పారు. గుంటూరులో జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘సూపర్-6 హామీలకు కట్టుబడి ఉన్నాం. పింఛన్ల మొత్తాన్ని పెంచి అందిస్తున్నాం. రైతులకు ఏడాదికి రూ.20వేల సాయం చేస్తాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి 3 సిలిండర్లు, యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. అమరావతి పనులను వేగంగా పూర్తి చేస్తాం’ అని తెలిపారు.
కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా అందరికీ ఒకే చట్టం ఉండాలన్నదే ఉమ్మడి పౌరస్మృతి (UCC) లక్ష్యం. దేశంలో మతాలను బట్టి వ్యక్తిగత చట్టాలు ఉన్నాయి. పెళ్లి, విడాకులు, వారసత్వం, దత్తత, నిర్వహణ వీటి కిందకి వస్తాయి. ఉదా: కొన్ని మతాల్లో బహు భార్యత్వం అమల్లో ఉంది. విడాకులకు కోర్టుతో సంబంధం లేదు. మత విద్య, మెజారిటీ మైనారిటీ వ్యత్యాసం ఉన్నాయి. వీటిపై విమర్శల వల్లే <<13857660>>లౌకిక పౌరస్మృతి<<>> అవసరమని మోదీ అన్నారు.
ఈ ఏడాది జులైలో ప్రభుత్వం తీసుకొచ్చిన 3 క్రిమినల్ చట్టాలతో అందరికీ న్యాయం జరుగుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. శిక్ష కంటే న్యాయానికే తమ ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యాన్నిచ్చిందని తెలిపారు. బ్రిటిష్ కాలానికి చెందిన ఐపీసీ, సీఆర్పీసీ, ఐఈఏల స్థానంలో భారతీయ న్యాయ సంహిత(BNS), భారతీయ నాగరిక సురక్ష సంహిత(BNSS), భారతీయ సాక్ష్య అధినియం(BSA) చట్టాల్ని కేంద్రం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
నాగచైతన్య, శోభిత ధూళిపాళ ఎంగేజ్మెంట్ నేపథ్యంలో చైతూ మాజీ భార్య సమంత ఇన్స్టా పోస్టు చర్చనీయాంశమైంది. ‘ది మ్యూజియం ఆఫ్ పీస్ అండ్ క్వయిట్’ అని రాసి ఉన్న టీషర్టును ధరించిన ఆమె తలకు చేయి పెట్టుకుని సెల్ఫీ తీసుకున్నారు. అయితే సామ్ పరోక్షంగా మిడిల్ ఫింగర్ చూపిస్తున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. డైరెక్టర్ రాజ్తో ఆమె డేటింగ్లో ఉన్నారన్న రూమర్లకూ కౌంటర్ ఇచ్చారని మరికొందరు అంటున్నారు.
భారత్, అమెరికా సహా ప్రపంచ వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న భారతీయులకు యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ శుభాకాంక్షలు తెలిపారు. రెండు దేశాల వ్యూహాత్మక అనుబంధం మున్ముందు మరింత బాగుండాలని ఆకాంక్షించారు. ‘మన సమగ్ర, వ్యూహాత్మక భాగస్వామ్యం మన రెండు దేశాల ప్రజలు, ఆర్థిక వ్యవస్థలపై ఆధారపడి ఉంది. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, ప్రజా గౌరవంపై ఇది నిర్మితమైంది’ అని ఆయన పేర్కొన్నారు.
TG: అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 30వేల మందికి నియామక పత్రాలు అందించామని CM రేవంత్ తెలిపారు. ‘TGPSCని ప్రక్షాళన చేసి గ్రూప్-1 ప్రిలిమినరీ, 11,062 టీచర్ పోస్టుల భర్తీకి DSC నిర్వహించాం. వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచాం. మీ సమస్యలు ఏమైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. మేం పరిష్కరిస్తాం. చెప్పుడు మాటలు విని మీ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. పెద్దన్నగా మీకు అండగా ఉంటా’ అని యువతకు హామీ ఇచ్చారు.
TG: రైతులకు సీఎం రేవంత్ రెడ్డి మరో గుడ్న్యూస్ చెప్పారు. త్వరలోనే రైతు భరోసా పథకం అమలు చేస్తామని గోల్కొండ కోటలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ప్రకటించారు. ఇక అమెరికా పర్యటనలో ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సమావేశం సానుకూలంగా సాగిందని తెలిపారు. తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు అంగీకరించారని చెప్పారు. గత ప్రభుత్వం మాదిరి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ప్రజల నెత్తిన భారం వేయమని సీఎం వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.