News November 14, 2024

శ్రీవారికి రూ.2కోట్ల విలువైన వైజయంతీ మాల విరాళం

image

AP: తిరుమల శ్రీవారికి రూ.2 కోట్ల విలువైన స్వర్ణ వైజయంతీ మాలను టీటీడీ మాజీ ఛైర్మన్ డీకే ఆదికేశవులు మనవరాలు తేజస్వీ విరాళంగా అందించారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు చేతుల మీదుగా ఏడుకొండలవాడికి కానుకగా ఇచ్చారు. వజ్ర వైడూర్యాలు పొదిగిన ఈ మాలను ఉత్సవమూర్తులకు అలకరించనున్నారు. తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారికి కూడా మరో వైజయంతీమాలను ఆమె అందజేయనున్నారు.

News November 14, 2024

టీమ్ఇండియా బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా సచిన్?

image

BGT సిరీసుకు టీమ్ఇండియా బ్యాటింగ్ కన్సల్టెంటుగా లెజెండ్ సచిన్ టెండూల్కర్‌ను నియమించాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. ‘BGT2025కు బ్యాటింగ్ కన్సల్టెంటుగా సచిన్ సేవలను వాడుకుంటే భారత్‌కు బెనిఫిట్ అవుతుందని అనుకుంటున్నా’ అని మాజీ క్రికెటర్, కోచ్ WV రామన్ Xలో అన్నారు. NZ సిరీసులో 0-3తో వైట్‌వాష్ కావడంతో ఈ డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతం సిరీసుల కోసం కన్సల్టెంట్లను నియమించుకోవడం కామన్‌గా మారింది.

News November 14, 2024

ప్రపంచవ్యాప్తంగా బాలల దినోత్సవాల తేదీలివే

image

అంతర్జాతీయంగా నవంబరు 20 బాలల దినోత్సవం కాగా.. వివిధ దేశాలు ఏటా వేర్వేరు తేదీల్లో ఈ వేడుక జరుపుతుంటాయి. USలో జూన్‌లో రెండో ఆదివారాన్ని చిల్డ్రన్స్ డేగా నిర్వహిస్తారు. UKలో మే రెండో ఆదివారం, రష్యా-చైనాలో జూన్ 1, మెక్సికోలో ఏప్రిల్ 30, జపాన్‌-దక్షిణ కొరియాలో మే 5, తుర్కియేలో ఏప్రిల్ 23, బ్రెజిల్‌లో అక్టోబరు 12, జర్మనీలో సెప్టెంబరు 20, థాయ్‌లాండ్‌లో జనవరిలో రెండో శనివారం చిల్డ్రన్స్ డే జరుగుతుంది.

News November 14, 2024

రఘురామకు విజయసాయిరెడ్డి విషెస్

image

AP: అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఎంపికైన TDP MLA రఘురామకృష్ణరాజుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి Xలో శుభాకాంక్షలు తెలిపారు. ఈ స్థానం గౌరవాన్ని కాపాడతారనే నమ్మకం ఉందన్నారు. గతం తాలూకూ జ్ఞాపకాలను వదిలేసి పైకి ఎదుగుతారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. 2019లో వైసీపీ ఎంపీగా గెలిచి ఆ పార్టీపైనే తీవ్ర విమర్శలు చేసిన RRRకు VSR విషెస్ తెలపడం చర్చనీయాంశంగా మారింది.

News November 14, 2024

RBI వడ్డీరేట్లను తగ్గించాల్సిందే: పీయూష్ గోయల్

image

వడ్డీరేట్ల తగ్గింపునకు ఆహార ధరల పెరుగుదలను పరిగణనలోకి తీసుకోవడం లోపభూయిష్ఠమైన థియరీ అని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ‘ఇది నా పర్సనల్ ఒపీనియన్. ప్రభుత్వానిది కాదు. RBI కచ్చితంగా వడ్డీరేట్లను తగ్గించాల్సిందే. మోదీ హయాంలో ఇన్‌ఫ్లేషన్ స్వతంత్ర భారత చరిత్రలోనే అత్యంత తక్కువగా ఉంది’ అన్నారు. FIIల సెల్లింగ్‌పై మాట్లాడుతూ దీర్ఘకాల దృక్పథంతో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని సూచించారు.

News November 14, 2024

శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య

image

హైదరాబాద్ నిజాంపేటలోని శ్రీచైతన్య కాలేజీలో విషాదం నెలకొంది. ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న జస్వంత్ గౌడ్ అనే విద్యార్థి తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ ఉదయం తోటి విద్యార్థులు నిద్రలేచి చూసేసరికి జస్వంత్ విగతజీవిగా కనిపించాడు. దీంతో కాలేజీ యాజమాన్యానికి విద్యార్థులు సమాచారం అందించారు. మృతి చెందిన విద్యార్థి కామారెడ్డి జిల్లాకు చెందిన వాడిగా గుర్తించారు.

News November 14, 2024

BREAKING: భారీగా తగ్గిన బంగారం ధరలు

image

బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. బులియన్ మార్కెట్‌లో వరుసగా నాలుగో రోజు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,200 తగ్గి రూ.75,650 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,100 తగ్గి రూ.69,350కి చేరింది. కేజీ సిల్వర్ రేటు రూ.2,000 తగ్గి రూ.99,000లు పలుకుతోంది. గోల్డ్ 4 రోజుల్లో రూ.3,710, వెండి రూ.4,000 తగ్గడం విశేషం.

News November 14, 2024

జగన్.. మీకూ, మాకూ తేడా లేదు: షర్మిల

image

APలో ప్రభావం చూపలేని కాంగ్రెస్ గురించి చర్చ <<14602051>>అనవసరమన్న <<>>జగన్ వ్యాఖ్యలపై PCC చీఫ్ షర్మిల స్పందించారు. ‘బడ్జెట్ బాగోలేదని జగన్‌ కంటే ముందే చెప్పాం. 38% ఓట్లు వచ్చినా అసెంబ్లీకి వెళ్లనప్పుడు వాళ్లకు, మాకు తేడా లేదు. ఆ పార్టీకి ప్రజలు ఓట్లేసింది ఇంట్లో కూర్చోడానికి కాదు. అసెంబ్లీకి వెళ్లే దమ్ము లేకపోతే వెంటనే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లండి. అప్పుడు ఎవరు ఇంపార్టెంటో తెలుస్తుంది’ అని సవాల్ విసిరారు.

News November 14, 2024

ఇళ్ల పట్టాల్లో రూ.2 లక్షల కోట్ల అవినీతి: ఎమ్మెల్యే బండారు

image

AP: టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి అసెంబ్లీలో సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ హయాంలో ఇళ్ల పట్టాల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా రూ.2 లక్షల కోట్ల అవినీతి జరిగిందని విమర్శించారు. వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి విశాఖలోనే రూ.40,000 కోట్లు దోచేశారన్నారు. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారించాలని డిమాండ్ చేశారు. తాను అవినీతిని నిరూపించలేకపోతే ఏ శిక్షకైనా సిద్ధమేనని ప్రకటించారు.

News November 14, 2024

నెహ్రూకు మోదీ నివాళి.. ఆధునిక భారతపితగా కొనియాడిన రాహుల్

image

జవహర్‌లాల్ నెహ్రూకు PM మోదీ, LoP రాహుల్ గాంధీ, ప్రియాంక, ఖర్గే సహా ప్రముఖులు నివాళులు అర్పించారు. ‘మాజీ ప్రధాని పండిత జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పిస్తున్నాను’ అని మోదీ ట్వీట్ చేశారు. ‘ఆధునిక భారత పిత, ఇనిస్టిట్యూట్ల సృష్టికర్త, ప్రథమ ప్రధాని, పండిత నెహ్రూకు గౌరవనీయ వందనాలు. మీ ప్రజాస్వామ్య, ప్రగతిశీల, నిర్భయ, దార్శనిక, సమ్మిళత విలువలను దేశం మర్చిపోదు’ అని రాహుల్ అన్నారు.