India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ నెల 16న చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భేటీ కానున్నారు. పెరూలో జరుగుతున్న APEC సదస్సులో ఇద్దరు నేతలు విడిగా భేటీ అవుతారని తెలుస్తోంది. బైడెన్ హయాంలో వీరి మధ్య ఈ సమావేశం మూడోది, ఆఖరిది కావడం గమనార్హం. చైనాను వ్యతిరేకించే ట్రంప్ వచ్చే జనవరిలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో ఈ భేటీ ఆసక్తికరంగా మారింది.

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్లు లేని భక్తులకు 8గంటల సమయం పడుతోంది. 2 కంపార్టుమెంట్లలో వేంకటేశ్వరుడి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 66,441 మంది దర్శించుకోగా, 20,639మంది తలనీలాలు సమర్పించారు. బుధవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.12కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది.

AP: వైసీపీ హయాంలో కర్నూలులో ఏర్పాటుచేసిన లోకాయుక్త, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(SHRC) కార్యాలయాలను అమరావతికి తరలించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ విషయాన్ని SGP ప్రణతి హైకోర్టుకు నివేదించారు. ఇందుకు చట్ట సవరణ చేయాల్సి ఉందని తెలిపారు. దీంతో న్యాయమూర్తి విచారణను 3 నెలలకు వాయిదా వేశారు. కర్నూలులో లోకాయుక్త, SHRC ఆఫీసులను ఏర్పాటుచేయడాన్ని సవాల్ చేస్తూ మద్దిపాటి శైలజ అనే మహిళ గతంలో పిల్ దాఖలు చేశారు.

అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మంత్రివర్గాన్ని, కీలక పదవుల్ని వేగంగా భర్తీ చేస్తున్నారు. భారత సంతతి మహిళ తులసీ గబ్బార్డ్ను జాతీయ నిఘా విభాగానికి డైరెక్టర్గా, ఫ్లోరిడా సెనేటర్ మార్కో రూబియోను విదేశాంగ మంత్రిగా నామినేట్ చేశారు. చైనాపై రూబియో తరచూ ఘాటు విమర్శలు చేస్తుంటారు. మరోవైపు రక్షణ విభాగం నుంచి తొలగించాల్సిన అధికారుల పేర్లతో ఓ జాబితాను ట్రంప్ రెడీ చేస్తున్నట్లు సమాచారం.

టాయిలెట్లోకి మొబైల్ తీసుకెళ్లి అరగంటైనా కూర్చోనిదే కొందరికి సంతృప్తి కలగదు. కాలకృత్యాలు తీసుకునే సమయంలో ఇలాంటి అలవాటు ఏమాత్రం మంచిదికాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే, 3-5 నిమిషాల్లోపే ఈ పని కానివ్వాలంటున్నారు. టాయిలెట్ కమోడ్పై ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల తుంటిపై ఒత్తిడి కలుగుతుంది. రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుంది. ఇది పైల్స్కు దారితీస్తుంది.

రక్తంలో చక్కెరల/గ్లూకోజ్ను శరీరం ప్రాసెస్ చేయలేనప్పుడు డయాబెటిస్ వస్తుంది. దీంతో గుండెపోటు, పక్షవాతం, చూపు కోల్పోవడం, కిడ్నీ సమస్యలు రావచ్చు. తరచూ దాహం, ఎక్కువగా మూత్రవిసర్జన, అలసట, బరువు తగ్గడం, పుండ్లు, చూపులో క్షీణత దీని లక్షణాలు. షుగర్ లెవెల్స్ ఎక్కువుండే ప్రాసెస్డ్ ఫుడ్, డ్రింక్స్ తీసుకోవద్దు. హెల్తీ వెయిట్ మెయింటైన్ చేయాలి. సొర, కాకర, ఆకుకూరలు, జొన్న, రాగులతో చక్కెర స్థాయులు తగ్గుతాయి.

TG: కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై విచారణ చేస్తున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ గడువును ప్రభుత్వం DEC 31 వరకు పొడిగించింది. ఆలోగా నివేదిక సమర్పించాలని నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులిచ్చారు. ఈ ఏడాది మార్చి 14న ప్రభుత్వం కమిషన్ను ఏర్పాటుచేసింది. ఇప్పటికే పలు దఫాలుగా అధికారులను విచారించింది. ఈ నెలలో ఐఏఎస్లను, ప్రజాప్రతినిధులను విచారించే అవకాశం ఉంది.

డెమొక్రటిక్ మాజీ నేత తులసి గబ్బర్డ్ను నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా నియమించనున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఉక్రెయిన్కు అమెరికా సాయం చేయడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. డెమొక్రటిక్ విధానాలతో విభేదించిన గబ్బర్డ్ 2022లో ఆ పార్టీకి రాజీనామా చేసి రిపబ్లికన్ పార్టీలో చేరారు. ఇంటెలిజెన్స్ విభాగంలో ఆమె గొప్ప స్ఫూర్తిని తీసుకురాగలరని ట్రంప్ కొనియాడారు.

TG: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ విజయోత్సవాల్లో భాగంగా తొలిరోజు విద్యార్థులతో విద్యా దినోత్సవానికి ఏర్పాట్లు చేసింది. నేడు HYDలోని LB స్టేడియంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో 14,000 మంది విద్యార్థులు పాల్గొంటారు. కాగా SCERT కార్యాలయంలో నిర్వహించే ‘మాక్ అసెంబ్లీ’కి CM రేవంత్ హాజరవుతారు.

AP: తమ నివాసానికి దూరంగా ఉన్న GOVT పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ట్రావెల్ అలవెన్స్ రూ.13.53 కోట్లు విడుదల చేస్తూ సమగ్ర శిక్షా అభియాన్ ఉత్తర్వులిచ్చింది. దీంతో రాష్ట్రంలోని 22,558 మందికి లబ్ధి చేకూరనుంది. ఒక్కో విద్యార్థికి రూ.6వేల చొప్పున అందించనుంది. విద్యాహక్కు చట్టం ప్రకారం KM దూరంలో ప్రాథమిక, 3KM లోపల ప్రాథమికోన్నత, 5KM దూరంలో ఉన్నత పాఠశాలలు ఉండాలి. లేదంటే ట్రావెల్ అలవెన్స్ చెల్లించాలి.
Sorry, no posts matched your criteria.