India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

విరాట్ ఐదేళ్లలో రెండే టెస్టు సెంచరీలు చేశారంటూ తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ పాంటింగ్ వివరణ ఇచ్చారు. ‘విరాట్ను కించపరచడం నా ఉద్దేశం కాదు. AUSతో BGT సమయానికి ఫామ్ అందుకోకపోతే ఇబ్బంది పడతారని చెప్పాను. ఈ విషయంలో కోహ్లీ కూడా నాతో ఏకీభవిస్తారు. తను ఆస్ట్రేలియాలో పుంజుకుంటారని కూడా నేను అన్నాను. కానీ నా మాటలు వక్రీకరించి ప్రచారమయ్యాయి ’ అని వ్యాఖ్యానించారు.

రూ.5 కోట్లు ఇవ్వకపోతే సల్మాన్ ఖాన్ను చంపేస్తామని సల్మాన్కు, అతడి కొత్త సినిమాలో పాటల రచయిత సొహైల్ పాషాకు ఇటీవల బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ కేసులో ఆసక్తికర ట్విస్ట్ వెలుగుచూసింది. బెదిరించింది సదరు రచయితేనని పోలీసులు తేల్చారు. అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. తన పాట ఫేమస్ అయ్యేందుకు సల్మాన్కు, తనకు బిష్ణోయ్ గ్యాంగ్ పేరిట తానే ఆ మెసేజ్ పంపినట్లు నిందితుడు పోలీసుల వద్ద అంగీకరించాడు.

థర్మల్ ప్లాంట్ల గడువు ముగిసినా, లేదా బొగ్గు సదుపాయం లేని రాష్ట్రాలు అణు విద్యుత్ ప్లాంట్లు ప్రారంభించాలని కేంద్ర విద్యుత్ మంత్రి మనోహర్ లాల్ సూచించారు. కరెంట్కు నానాటికీ డిమాండ్ పెరుగుతోందని తాజాగా జరిగిన విద్యుత్ మంత్రుల సదస్సులో గుర్తుచేశారు. దేశంలో 24 అణువిద్యుత్ ప్లాంట్స్ నుంచి 8 గిగావాట్ల విద్యుదుత్పత్తి అవుతుండగా 2032 కల్లా దాన్ని 20 గి.వాట్లకు పెంచాలని కేంద్రం భావిస్తోంది.

AP: సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై కేసులు నమోదు చేస్తే తప్పేం లేదని హైకోర్టు తీర్పునిచ్చింది. పోలీసుల చర్యలను నిలువరిస్తూ ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. కేసులపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే నేరుగా కోర్టును ఆశ్రయించాలని సూచించింది. కాగా సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు పెడుతున్నారని విజయబాబు హైకోర్టులో పిల్ వేయగా ధర్మాసనం ఇవాళ విచారించింది.

అక్రమ కట్టడాలపై <<14598300>>బుల్డోజర్<<>> యాక్షన్కు దిగేముందే పాటించాల్సిన గైడ్లైన్స్ను SC వివరించింది. ఆ ప్రాపర్టీ ఓనర్కు 15days ముందుగా షోకాజ్ నోటీసులు ఇవ్వాలంది. ఒకటి రిజిస్టర్ పోస్టులో పంపాలని, మరోటి ప్రాపర్టీపై నేరుగా అతికించాలని సూచించింది. ఉల్లంఘించిన రూల్స్, కూల్చివేతకు కారణాలు వివరించాలని, కూల్చివేతను వీడియో తీయించాలని ఆదేశించింది. ఇందులో ఏది పాటించకున్నా కోర్టు ఉల్లంఘనగా పరిగణిస్తామంది.

TG: కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మా కంపెనీకి భూసేకరణ పేరిట పేదల భూములను లాక్కుంటోందని కేటీఆర్ ఆరోపించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీల భూములను కాజేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే అయిన రేవంత్ కొడంగల్ సమస్యను పరిష్కరించకుండా మహారాష్ట్రలో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఏ రాజ్యాంగం ప్రకారం పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేశారని ప్రశ్నించారు

TG: కలెక్టర్, అధికారులపై దాడులు చేయడం మంచిదేనా KTR అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. దాడులకు దిగిన వారికి మద్దతిస్తామని BRS నేతలు చెప్పడం దారుణమన్నారు. లగచర్ల ఘటనకు సంబంధించి కేటీఆర్తో మాజీ MLA ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం ఉందన్నారు. దాడి వెనక ఎవరున్నా వదలబోమని హెచ్చరించారు. ఎఫ్-1రేసులో RBI అనుమతి లేకుండా డబ్బులు చెల్లించారని, ఈ కేసులో KTR తప్పించుకోలేరని తెలిపారు.

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్నారు. తన భార్య అనుష్క శర్మ, కుమారుడు అకాయ్తో విరాట్ పెర్త్ వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు. కాగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం కోహ్లీ రెండు వారాల ముందుగానే అక్కడికి వెళ్లారు. టెస్టు సిరీస్కు సన్నద్ధమయ్యేందుకే ఆయన త్వరగా వెళ్లినట్లు తెలుస్తోంది. మిగతా భారత ప్లేయర్లు ఇప్పటికే ప్రాక్టీస్ ప్రారంభించారు.

టాలీవుడ్ తెరకెక్కిస్తోన్న మరో ప్రెస్టీజియస్ మూవీ ‘పుష్ప-2’. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ గురించి పెద్ద చర్చే నడుస్తోంది. అందులో యంగ్ బ్యూటీ శ్రీలీల చిందులతో సందడి చేయనున్నారు. అందుకోసం రూ.2 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్. ‘పుష్ప1’లో సమంత రూ.5 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. అటు ఈ మూవీతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ మరోసారి బాక్సాఫీస్ను షేక్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు.

AP: శాసనమండలి నుంచి వైసీపీ MLCలు వాకౌట్ చేశారు. విజయనగరంలో డయేరియా వ్యాప్తి విషయంలో మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలను నిరసిస్తూ వాకౌట్ చేసినట్లు సభ్యులు ప్రకటించారు. అనంతరం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ‘సత్యకుమార్ వ్యాఖ్యలు బాధాకరం. సభలో ఆయన వ్యక్తిగతంగా మాట్లాడటం సరికాదు. ఆయనకు పైశాచిక ఆనందం ఉన్నా సరే, సభలో హుందాగా మెలగాల్సింది’ అంటూ బొత్స ఫైరయ్యారు.
Sorry, no posts matched your criteria.