News August 14, 2024

బోడకాకరలో బోలెడన్ని పోషకాలు

image

సీజనల్ ఫ్రూట్స్, కూరగాయలు తినాలని వైద్యులు సూచిస్తుంటారు. ఆ కోవకు చెందిన బోడ కాకరకాయ గురించి తెలుసుకుందాం. కేవలం వర్షాకాలంలోనే దొరికే ఈ కూరగాయలో అనేక పోషకాలతో పాటు ఔషధ విలువలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తినడం వల్ల సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువని వైద్యులు చెబుతున్నారు. ఇందులో B1 ,B2 , B3 సహా పలు విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి తింటే బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా అదుపులో ఉంటాయి.

News August 14, 2024

సౌదీ రాజు సాయంతో 500KGలకు పైగా బరువు తగ్గాడు!

image

ప్రపంచంలోనే అత్యధిక బరువున్న వ్యక్తిగా పేరొందిన సౌదీ అరేబియాకు చెందిన ఖలీద్ ఏకంగా 500 కేజీలకు పైగా బరువు తగ్గాడు. 2013లో ఖలీద్ 610KGల బరువుతో మంచానికే పరిమితమై ఉండేవాడు. అతడు బరువు తగ్గేందుకు అప్పటి సౌదీ రాజు అబ్దుల్లా 30 మంది వైద్యులతో మెడికల్ టీమ్ ఏర్పాటు చేశారు. ప్రత్యేక డైట్‌తో పలు సర్జరీలు చేయగా ఇప్పుడు 63.5 కేజీలకు తగ్గాడు. సన్నగా మారిన అతడికి సిబ్బంది ‘స్మైలింగ్ మ్యాన్’ అని పేరు పెట్టారు.

News August 14, 2024

ట్యాబ్లెట్లపై ఈ రెడ్ లైన్ ఎందుకు ఉంటుంది?

image

కొన్ని ట్యాబ్లెట్ల వెనకవైపు రెడ్ కలర్ లైన్ ఉంటుంది. ప్రధానంగా యాంటీబయాటిక్స్‌లో కనిపిస్తుంది. దీని అర్థం ఏంటంటే ఈ ట్యాబ్లెట్లు వాడటానికి డాక్టర్‌ సలహా తప్పనిసరి. ఇష్టానుసారం ఈ మెడిసిన్ తీసుకుంటే ప్రాణాలకు ప్రమాదం ఉంటుంది. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గతంలోనే స్పష్టం చేసింది. అందుకే మీరు ట్యాబ్లెట్ల ఎక్స్‌పైరీ డేట్‌తో పాటు ఈ రెడ్ లైన్ కూడా గమనించడం ముఖ్యం. > SHARE

News August 14, 2024

మూవీ వీడియోలను షేర్ చేయకండి: హరీశ్ శంకర్

image

మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీశ్ శంకర్ తెరకెక్కించిన ‘మిస్టర్ బచ్చన్’ ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. సినిమాను చూస్తోన్న అభిమానులు తమ సంతోషాన్ని వీడియోల రూపంలో X వేదికగా పంచుకుంటున్నారు. ఈక్రమంలో ఈ సినిమా సన్నివేశాలను రివీల్ చేసే వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దని హరీశ్ శంకర్ అభిమానులకు విజ్ఞప్తి చేశారు. అలా చేస్తే సిల్వర్ స్క్రీన్‌పై చూసేటప్పుడు ఉండే ఎగ్జైట్‌మెంట్‌ పోతుందని తెలిపారు.

News August 14, 2024

ALERT.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: రేపు రాష్ట్రంలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. వైజాగ్, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో , ప.గో , ఏలూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, YSR, చిత్తూరులో తేలికపాటి జల్లులు పడే అవకాశముందని పేర్కొంది.

News August 14, 2024

డెంగ్యూ నివార‌ణ‌లో కీల‌క మైలురాయి

image

ICMR, పనాసియా బయోటెక్ భారతదేశంలో డెంగ్యూ వ్యాక్సిన్ కోసం మొట్టమొదటి ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించాయి. ఇది డెంగ్యూను ఎదుర్కోవడానికి దేశం చేస్తున్న ప్రయత్నాలలో కీలక మైలురాయని కేంద్ర ఆరోగ్య మంత్రి పేర్కొన్నారు. పనాసియా బయోటెక్ ఈ టెట్రావాలెంట్ డెంగ్యూ వ్యాక్సిన్‌ డెంగీఆల్‌ని అభివృద్ధి చేసింది. 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ట్రయల్స్ జరగనున్నాయి.

News August 14, 2024

ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయొద్దు: ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టు CEO

image

AP: ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామనే ఆసుపత్రుల హెచ్చరికల నేపథ్యంలో ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టు సీఈవో లక్ష్మీశ స్పందించారు. అనుబంధ ఆస్పత్రులకు రూ.200 కోట్ల బకాయిలు విడుదల చేసినట్లు తెలిపారు. వచ్చే సోమవారం మరో రూ.300 కోట్లు రిలీజ్ చేస్తామన్నారు. ఆరోగ్యశ్రీ సేవలకు అంతరాయం కలిగించవద్దని ఆసుపత్రులకు విజ్ఞప్తి చేశారు.

News August 14, 2024

రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ పబ్లిక్ టాక్

image

మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘మిస్టర్ బచ్చన్’ మూవీ ప్రీమియర్ షోలు స్టార్ట్ అయ్యాయి. డైలాగ్స్, కామెడీ, మ్యూజిక్ అదిరిపోయాయని నెటిజన్లు చెబుతున్నారు. రవితేజ యంగ్ లుక్‌లో దుమ్ముదులిపేశారని పోస్టులు చేస్తున్నారు. మాస్ మహారాజాకు మరో హిట్ బొమ్మ పడిందని కామెంట్స్ చేస్తున్నారు.
*కాసేపట్లో WAY2NEWS రివ్యూ..

News August 14, 2024

ఏ బ్యాంకు ఎంత ఛార్జ్ చేస్తుంది?(1/2)

image

ICICIలో ₹5000 మినిమ‌మ్ బ్యాలెన్స్ లేక‌పోతే త‌క్కువ ఉన్న డ‌బ్బుపై ₹100 + 5% జరిమానా ఉంటుంది. HDFCలో పట్టణాల్లో ₹10,000, సెమీ-అర్బన్‌లో ₹5,000 గ్రామాల్లో ₹2,500 బ్యాలెన్స్ లేక‌పోతే సగటు బ్యాలెన్స్‌లో త‌క్కువ ఉన్న‌దానిపై 6% లేదా ₹600 (ఏది తక్కువైతే అది) ఛార్జెస్ ఉంటాయి. పీఎన్‌బీలో గ్రామీణ ప్రాంతాలకు ₹400, సెమీ అర్బన్ అయితే ₹500, అర్బన్/మెట్రో ప్రాంతాల్లో ₹600 జరిమానా విధిస్తారు.

News August 14, 2024

ఏ బ్యాంకు ఎంత ఛార్జ్ చేస్తుంది?(2/2)

image

యాక్సిస్ బ్యాంకులో మెట్రో, పట్టణ ప్రాంతాల్లో ₹600 నుంచి ₹50, సెమీ అర్బన్ ఏరియాల్లో ₹300 నుంచి ₹50, గ్రామీణ ప్రాంతాల్లో ₹150 నుంచి ₹75 మధ్య ఉంది. ఎస్‌బీఐ, YES బ్యాంకులు ఈ ఛార్జీలు వేయ‌డం లేదు. మినిమమ్ బ్యాలెన్స్ లేకపోవడం వల్ల ప్రభుత్వ బ్యాంకులు ₹8,495 కోట్లు వసూలు చేసినట్టు వార్తలు వచ్చాయి. ఇందులో పీఎన్‌బీ గ‌త ఐదేళ్ల‌లో అత్య‌ధికంగా ₹1,538 కోట్లు ఛార్జ్ చేసింది.