News August 14, 2024

మీ ఫోన్ ఎప్పుడు ఎక్స్‌పైర్ అవుతుందో తెలుసా?

image

ప్రతి వస్తువుకి ఉన్నట్లే స్మార్ట్‌ఫోన్లకూ ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. అయితే దాన్ని డైరెక్ట్‌గా కంపెనీలు చెప్పవు. మీ ఫోన్ బాక్స్‌పై ఉండే OS అప్డేట్స్, సెక్యూరిటీ అప్డేట్స్ ముగిసే తేదీనే ఎక్స్‌పైరీ డేట్‌గా పరిగణించవచ్చు. ఇది కంపెనీలను బట్టి మారుతుంది. సాధారణంగా 2ఏళ్లు ఉంటుంది. యాపిల్, సామ్‌సంగ్, వన్‌ప్లస్ 7ఏళ్లు అప్డేట్స్ ఇస్తాయి. అప్డేట్స్ రావడం ఆగితే ఆ తర్వాత వచ్చే యాప్స్ మీ ఫోన్లలో పని చేయకపోవచ్చు.

News August 14, 2024

దూర విద్యను అభ్యసించే వారికి యూజీసీ కొత్త మార్గదర్శకాలు

image

ఈ విద్యా సంవత్సరం నుంచి ఓపెన్, దూర విద్య(ODL), ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌లను అభ్యసించే విద్యార్థులకు UGC కొత్త గైడ్‌లైన్స్ జారీ చేసింది. విద్యార్థులు తప్పనిసరిగా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో <>వెబ్‌సైట్‌లో<<>> ఎన్రోల్ చేసుకోవాలని ఛైర్మన్ జగదీశ్ పేర్కొన్నారు. ఈ ఐడీ శాశ్వతమని, విదేశీ విద్యార్థులకు మినహాయింపు ఇస్తున్నట్లు చెప్పారు. దీని అమలులో ఉన్నత విద్యాసంస్థలకు సహకరిస్తామన్నారు. వచ్చే నెల నుంచి ఇది అమలు కానుంది.

News August 14, 2024

Stock Market: కొంత లాభాలు

image

దేశీయ సూచీల్లో సెన్సెక్స్ కొంత లాభాలతో గట్టెక్కగా, నిఫ్టీ ఫ్లాట్‌గా ముగిసింది. బుధవారం ఉద‌యం కొంత గ్యాప్ అప్‌తో నిఫ్టీలో ట్రేడింగ్ ప్రారంభ‌మ‌వ్వ‌గా రోజంతా క‌న్సాలిడేషన్ జరిగింది. చివ‌రికి ఐదు పాయింట్ల లాభంతో 24,143 వ‌ద్ద నిలిచింది. అటు సెన్సెక్స్ 150 పాయింట్లు బ‌ల‌ప‌డి 79,105 వ‌ద్ద ముగిసింది. ఈ రోజు ఐటీ కంపెనీలు భారీగా లాభ‌ప‌డ్డాయి.

News August 14, 2024

వైద్యుల ర‌క్ష‌ణ స‌మాజం బాధ్య‌త‌

image

కోల్‌క‌తాలో ట్రైనీ డాక్ట‌ర్ హ‌త్యాచార ఘ‌ట‌న త‌రువాత ప్రాణాలు కాపాడే వైద్యుల ర‌క్ష‌ణ గురించి అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు స్పందించ‌క‌పోవ‌డంపై ప్ర‌శ్న‌లు వెల్లువెత్తుతున్నాయి. తీవ్ర ఒత్తిడిలో పని చేసే వైద్యుల‌ను కాపాడుకోవాల్సిన బాధ్య‌త స‌మాజంలో అంద‌రిపై ఉంద‌ని వైద్య వ‌ర్గాలు అభిప్రాయ‌ప‌డుతున్నాయి. దీనిపై ప్ర‌తిఒక్క‌రూ గొంతెత్తాల‌ని కోరుతున్నాయి.

News August 14, 2024

‘ఖడ్గం-2’ సినిమాపై కృష్ణవంశీ ఏమన్నారంటే?

image

కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఖడ్గం’ మూవీ ఆయన కెరీర్లోనే ప్రత్యేకంగా నిలిచింది. ఈ సినిమాకు పార్ట్-2 చేయాలని అడిగిన ఓ నెటిజన్‌కు ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ‘పార్ట్-2ల మీద నాకు నమ్మకం లేదండి. చేతకాదు. అందువల్ల ఖడ్గం-2 ఉండదు. కానీ సామాజిక సమస్యలపై చిత్రం ఉంటుంది’ అని బదులిచ్చారు. శ్రీకాంత్, రవితేజ, ప్రకాశ్ రాజ్ వంటి స్టార్లు ‘ఖడ్గం’లో ప్రధాన పాత్రల్లో కనిపించారు.

News August 14, 2024

వల్లభనేని వంశీకి ఊరట!

image

AP: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి హైకోర్టులో ఊరట దక్కింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం ఈనెల 20 వరకు ఆయనపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని, కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది.

News August 14, 2024

SHOCKING: ఆమెపై జరిగింది గ్యాంగ్ రేప్!

image

కోల్‌కతాలో లేడీ ట్రైనీ డాక్టర్‌ రేప్&మర్డర్ కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె డెడ్‌బాడీలో 150mg వీర్యం ఉన్నట్లు పోస్టుమార్టంలో తేలింది. దీంతో ఆమెపై గ్యాంగ్ రేప్ జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధిత కుటుంబం పిటిషన్‌తో కలకత్తా హైకోర్టు ఈ కేసు విచారణను CBIకి అప్పగించింది. మరోవైపు దీనికి బాధ్యత వహిస్తూ బెంగాల్ CM మమత రాజీనామా చేయాలని BJP డిమాండ్ చేస్తోంది.

News August 14, 2024

రెడ్ కార్పెట్ ప‌ర‌చరు: సిసోడియా

image

అవినీతి నిర్మూలన‌కు, ప్రజా జీవితంలో చోటు కోసం రాజ‌కీయాల్లోకి వ‌చ్చే వారికోసం ఎవ‌రూ రెడ్ కార్పెట్ ప‌ర‌చ‌రని ఢిల్లీ మాజీ మంత్రి మ‌నీశ్ సిసోడియా వ్యాఖ్యానించారు. ‘నేను 17 నెల‌లపాటు జైలులో ఉంటా అనుకోలేదు. లిక్క‌ర్‌ స్కాం కేసులో విచార‌ణ‌ను పొడిగించాల‌న్న ఉద్దేశంతో నాపై అభియోగాలు మోపారు. రాజ‌కీయాల్లో పరస్పర ఆరోప‌ణ‌లు స‌హ‌జ‌మే, అయితే ఒక వ్య‌క్తిని జైలుకు పంప‌డానికి కార‌ణాలు ఉండాలి’ అని అన్నారు.

News August 14, 2024

శశి థరూర్‌పై మాజీ మంత్రి పరువు నష్టం దావా

image

కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌పై కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పరువు నష్టం దావా వేశారు. వీరిద్దరూ తిరువనంతపురం నుంచి పోటీ చేశారు. ఎన్నికల సమయంలో ఓటర్లకు లంచం ఇస్తున్నారన్న థరూర్ ఆరోపణలతో తన పరువుకు భంగం కలిగిందని రాజీవ్ అన్నారు. అయితే థరూర్ ఎంపీ కావడంతో తాము పిటిషన్ విచారించలేమని ఢిల్లీ పటియాలా కోర్టు తెలిపింది. దీంతో ట్రాన్స్‌ఫర్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఆగస్టు 21న విచారణ చేపట్టనుంది.

News August 14, 2024

భారత బౌలింగ్ కోచ్‌గా మోర్నే మోర్కెల్‌!

image

టీమ్ఇండియా బౌలింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ మోర్నే మోర్కెల్‌ ఎంపికైనట్లు Cricbuzz తెలిపింది. ఆయన నియామకంపై త్వరలోనే బీసీసీఐ అధికారిక ప్రకటన చేయనుంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రికమెండ్ చేయడంతో బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 1 నుంచి మోర్కెల్ ఛార్జ్ తీసుకోనున్నట్లు సమాచారం. ఆయన పాకిస్థాన్, IPLలో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కోచ్‌గా పనిచేశారు.