India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాక్పై భారత్ పలు ఆంక్షలు విధించిన నేపథ్యంలో పాకిస్థాన్ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు చవిచూశాయి. ఈ క్రమంలో స్టాక్ ఎక్స్ఛేంజ్ వెబ్సైట్ను ఆ దేశం క్లోజ్ చేసింది. ఇవాళ ఉదయం నుంచే నష్టాల్లో ట్రేడ్ ప్రారంభించిన ఆ దేశ స్టాక్ మార్కెట్లు 2 శాతానికి పైగా షేర్లు కోల్పోయాయి. మున్ముందు మరింత పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతాయనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అర్జున్ టెండూల్కర్ను తన కుమారుడు యువరాజ్ సింగ్కు అప్పగిస్తే క్రిస్ గేల్లా తయారు చేస్తాడని ఆయన తండ్రి యోగ్రాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘3 నెలలపాటు యువీ దగ్గర అర్జున్ శిక్షణ తీసుకోవాలి. బౌలింగ్ కంటే బ్యాటింగ్పైనే ఆయన ఎక్కువగా దృష్టి సారించాలి. గిల్, అభిషేక్ శర్మలాగే అతడూ స్టార్గా ఎదుగుతాడు’ అని పేర్కొన్నారు. కాగా అర్జున్ ప్రస్తుతం ముంబై ఇండియన్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఇప్పటివరకు పాకిస్థాన్ ప్రజలకు ఇచ్చిన వీసాలన్నింటినీ భారత విదేశాంగ శాఖ రద్దు చేసింది. ప్రస్తుతం దేశంలో ఉన్న పాకిస్థానీల వీసాలు ఈ APR 27 వరకు మాత్రమే చెల్లుతాయని స్పష్టం చేసింది. ఇక మెడికల్ వీసాలతో భారత్లో ఉన్నవారు ఏప్రిల్ 29 లోపు వెళ్లిపోవాలని పేర్కొంది. మరోవైపు భారతీయులెవరూ పాక్కు వెళ్లొద్దని చెప్పడంతో పాటు ఇప్పటికే ఆ దేశంలో ఉన్న ఇండియన్స్ వీలైనంత త్వరగా తిరిగి రావాలని సూచించింది.
ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని గుడ్లతో తయారు చేసే మయోనీస్ను తమిళనాడు ప్రభుత్వం ఏడాది పాటు బ్యాన్ చేసింది. అలాగే దాన్ని హైరిస్క్ ఆహార పదార్థంగా ప్రకటించింది. అక్కడి ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం.. పచ్చి గుడ్డు, వెజిటెబుల్ ఆయిల్, వెనిగర్ తదితరాలతో మయోనీస్ తయారు చేస్తున్నట్లు పేర్కొంది. తయారీ, నిల్వ చేసే పద్ధతులు సరిగా లేకపోవడంతో దాన్ని తిన్న ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నట్లు వివరించింది.
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాక్తో సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపేయడంపై దాయాది దేశం స్పందించింది. సింధు నీటిలో ప్రతి నీటి చుక్కా తమ హక్కు అని తెలిపింది. ఒప్పందం నుంచి వైదొలగడం చట్ట వ్యతిరేకమని చెప్పింది. ఈ నిర్ణయాన్ని న్యాయ, రాజకీయపరంగా బలంగా ఎదుర్కొంటామని వివరించింది. ప్రపంచ బ్యాంక్ వంటి సంస్థలు కుదిర్చిన ఒప్పందం నుంచి భారత్ ఏకపక్షంగా వైదొలగలేదని ఆ దేశ మంత్రి అవాయిస్ లెఘారీ పేర్కొన్నారు.
AP: మే నెలలో జరిగే పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల <
✒ 19- ఫస్ట్ లాంగ్వేజ్& పేపర్-1(కాంపోజిట్ కోర్సు)
✒ 20- సెకండ్ లాంగ్వేజ్ ✒ 21- ఇంగ్లిష్ ✒ 22- గణితం
✒ 23- ఫిజిక్స్ ✒ 24- బయోలజీ ✒ 26- సాంఘిక శాస్త్రం
✒ 27- ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2(కాంపోజిట్ కోర్సు)&OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2
✒ 28-OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2
* పరీక్షలన్నీ ఉదయం 9.30 గంటలకు ప్రారంభం
ఇటీవల ప్రెగ్నెన్సీ ప్రకటించిన బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ బేబీ బంప్తో కనిపించారు. నిన్న రొటీన్ హెల్త్ చెకప్ కోసం ఆమె ముంబైలోని ఓ ఆసుపత్రికి వెళ్లారు. ఈ సందర్భంగా కెమెరామెన్లు ఆమె ఫొటోలు తీయగా అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే దీనిపై కియారా భర్త సిద్ధార్థ్ మల్హోత్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫొటోలు ఎందుకు తీస్తున్నారని ప్రశ్నించారు. కాగా కియారా, సిద్ధార్థ్ 2023లో పెళ్లి చేసుకున్నారు.
PM మోదీ సాధారణంగా హిందీలోనే ప్రసంగిస్తుంటారు. కానీ ఈరోజు బిహార్లో మాత్రం ఇంగ్లిష్లో హెచ్చరికలు జారీ చేశారు. పాకిస్థాన్ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదంపై భారత్ చేయనున్న పోరాటం గురించి ప్రపంచానికి తెలిపేందుకే ఆయన ఇంగ్లిష్లో మాట్లాడినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ‘బిహార్ గడ్డపై నిల్చుని ప్రపంచానికి చెబుతున్నా. ప్రతి ఉగ్రవాదిని పట్టుకుంటాం. భూమి అంచులకు వెళ్లినా వదిలే ప్రసక్తి లేదు’ అని PM అన్నారు.
పాకిస్థాన్ నటుడు ఫవాద్ ఖాన్ నటించిన ‘అబిర్ గులాల్’ సినిమాపై భారత సమాచార శాఖ నిషేధం విధించింది. 9 ఏళ్ల తర్వాత ఈ పాక్ నటుడు బాలీవుడ్లో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన క్రమంలో పహల్గామ్ ఉగ్రదాడి కలకలం రేపింది. ఈ నరమేధం వెనుక పాక్ హస్తం ఉందని తేల్చిచెప్పిన భారత్ పాక్ సినిమాలు, నటులపై బ్యాన్ విధించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మే 9న రిలీజ్ కావాల్సి ఉన్న సినిమా ఆగిపోయింది.
AP: సీఎం చంద్రబాబు రేపు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై రాజధాని, రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించనున్నారు. మే 2న అమరావతి పర్యటనకు రావాలని ఆయనను ఆహ్వానిస్తారని సమాచారం.
Sorry, no posts matched your criteria.