India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తెలంగాణ-ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో సుమారు 1000మంది మావోలను 20వేలమంది భారత బలగాలు చుట్టుముడుతున్నట్లు సమాచారం. దేశ చరిత్రలోనే ఇది అతి పెద్ద యాంటీ-నక్సల్ ఆపరేషన్గా కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. ఈరోజు మావోయిస్టులకు చావు దెబ్బ తగలొచ్చని పేర్కొన్నాయి. ఇప్పటికే ఎన్కౌంటర్లో ఐదుగురు మావోలు మృతిచెందినట్లు సమాచారం. ఈ సంఖ్య భారీగా పెరగనుందని తెలుస్తోంది.
TG: KCR పాలనలో పదేళ్లపాటు మురిసిన పల్లె, నేడు కాంగ్రెస్ పాలనలో కన్నీరు పెడుతోందని KTR విమర్శించారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా BRS పాలనలో చేపట్టిన ‘పల్లె ప్రగతి’ పనులను గుర్తుచేసుకున్నారు. కానీ కాంగ్రెస్ పాలనలో గ్రామస్వరాజ్యం పూర్తిగా గాడి తప్పిందని అన్నారు. ‘స్థానిక సంస్థలకు ఎన్నికలు లేవు. గ్రామాల్లో కనీస వసతుల్లేవు. చివరికి పంచాయతీ సిబ్బందికి వేతనాలు లేవు’ అని ట్వీట్ చేశారు.
చంద్రుడిపై అంతర్జాతీయ అణు విద్యుత్ కేంద్రాన్ని(ILRS) సంయుక్తంగా ప్రారంభించాలని చైనా, రష్యా ప్రణాళిక రచిస్తున్నాయి. ‘2028 కల్లా చంద్రుడిపై స్థావరానికి ఏర్పాట్లు మొదలుపెట్టాలని భావిస్తున్నాం. దానికి విద్యుత్ అందించేందుకు అణువిద్యుత్ కేంద్రం అవసరం. రోదసి ప్రయోగాల్లో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న రష్యాతో కలిసి దాని నిర్మాణం కోసం పనిచేయాలని భావిస్తున్నాం’ అని చైనా పరిశోధకులు తెలిపారు.
పాక్ నిజ స్వరూపం మరోసారి బయటపడింది. పహల్గాం మారణహోమం తర్వాత ఆ దేశ ప్రభుత్వం సెలబ్రేట్ చేసుకుందని తెలుస్తోంది. ఢిల్లీలోని పాక్ హై కమిషనర్ కార్యాలయంలో కేక్ కట్ చేసుకుని ఆ దేశ దౌత్యాధికారులు రాక్షసానందం పొందారని విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా ఈ ఉదయం హై కమిషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రజలు భారీగా చేరుకుని పాక్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. PoKను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశమైంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరుగుతున్న ఈ మీటింగ్లో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్, సల్మాన్ ఖుర్షీద్, అంబికా సోనీ తదితర సీనియర్ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పహల్గామ్ ఉగ్రదాడిని సీడబ్ల్యూసీ ఖండించింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపింది.
భారత్-పాక్ ఉద్రిక్తతల నడుమ పాకిస్థాన్ క్షిపణి ప్రయోగాలు చేపట్టనుండటం చర్చనీయాంశంగా మారింది. ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే మిస్సైల్స్ను ఈరోజు, రేపు కరాచీ తీరంలో పాక్ పరిశీలించనున్నట్లు సమాచారం. ఈ పరిణామాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని భారత భద్రతావర్గాలు తెలిపాయి. భారత్ ఏమైనా చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని పాక్ మంత్రి ఒకరు హెచ్చరించడం గమనార్హం.
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అత్యవసర ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తోంది. దీనికి హోంశాఖ కార్యదర్శి, IB డైరెక్టర్, RAW చీఫ్ తదితరులు హాజరయ్యారు. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న వేళ వీరి భేటీ అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది దానిపై ఉత్కంఠ నెలకొంది.
సరైన టైమ్లో ఊపందుకున్న ముంబై ఇండియన్స్ మిగతా జట్లలో గుబులు రేపుతోంది. తొలి 5 మ్యాచుల్లో ఒకటే గెలిచిన ఆ జట్టు ఒక్కసారిగా పుంజుకుంది. బుమ్రా, బౌల్ట్, చాహర్, శాంట్నర్ దుర్భేద్యమైన బౌలింగ్కి తోడు రోహిత్ ఫామ్ అందుకోవడం, సూర్య నాటౌట్గా మ్యాచులు ఫినిష్ చేస్తుండటం, హార్దిక్ కెప్టెన్సీ అన్నీ ముంబైకి కలిసొస్తున్నాయి. హాట్ ఫేవరెట్ను చేశాయి. ప్లే ఆఫ్స్కి చేరితే MIని కప్పు కొట్టకుండా అడ్డుకోవడం కష్టమే.
పహల్గామ్ దాడిపై కేంద్రం నిర్వహించనున్న ఆల్ పార్టీ మీటింగ్కు తమలాంటి చిన్న పార్టీలనూ ఆహ్వానించాలని MIM చీఫ్ అసద్ డిమాండ్ చేశారు. ‘5-10 మంది MPలున్న పార్టీలనే ఆహ్వానిస్తామని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. చిన్న పార్టీలు కూడా వస్తే మీటింగ్ టైమ్ ఎక్కువ పడుతుందని చెప్పారు. అన్ని పార్టీల అభిప్రాయాలు వినడానికి PM 1hr అదనంగా కేటాయించలేరా? ఎంపీలందరినీ ఎన్నుకుంది భారతీయులే కదా’ అని ట్వీట్ చేశారు.
పాకిస్థాన్ ప్రభుత్వ అధికారిక ట్విటర్ ఖాతాను భారత్ బ్యాన్ చేసింది. ఆ ట్విటర్ పేజీ ఓపెన్ చేస్తే ‘విత్హెల్డ్’ అని చూపిస్తోంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్తో ఉన్న అన్ని దారుల్ని భారత్ మూసేస్తున్న సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య రాకపోకల్ని, దౌత్య సంబంధాల్ని కట్ చేసింది. అటు సింధు జలాల ఒప్పందాన్నీ సస్పెండ్ చేసింది. ఇప్పుడు నెట్టింట కూడా పాక్కు యాక్సెస్ లేకుండా అడ్డుకుంది.
Sorry, no posts matched your criteria.