India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
✒ ఫజర్: తెల్లవారుజామున 4.43 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 5.59 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.21 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.48 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.43 గంటలకు
✒ ఇష: రాత్రి 7.59 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
✒ తిథి: బహుళ చవితి ఉ.08.16 వరకు
✒ నక్షత్రం: ఉత్తరాభాద్ర మ.1.03 వరకు
✒ శుభ సమయం: ఏమీ లేవు
✒ రాహుకాలం: మ.12.00-మ.1.30
✒ యమగండం: ఉ.07.30-ఉ.09.00
✒ దుర్ముహూర్తం: ఉ.11.36-12.24
✒ వర్జ్యం: రా.12.21-రా.1.51
✒ అమృత ఘడియలు: ఉ.8.28-ఉ.10.00
* అతిభారీ వర్షాలు.. సెలవులు రద్దు: రేవంత్
*TG: 5 జిల్లాల్లో రేపు, ఎల్లుండి స్కూళ్లకు సెలవులు
* అమరావతి పనులు వేగంగా పూర్తి చేయాలి: చంద్రబాబు
* ముగిసిన పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉపఎన్నిక పోలింగ్
* పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికలను రద్దు చేయాలి: జగన్
* తెలుగు రాష్ట్రాల్లో రేపు, ఎల్లుండి అతి భారీ వర్షాలు
* తిరుమలకు వెళ్లే వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి
* ఏపీలో వార్ 2, కూలీ సినిమాలకు టికెట్ రేట్ల పెంపు
TG: భారీ వర్ష సూచన దృష్ట్యా విద్యాశాఖ ఐదు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. రేపు, ఎల్లుండి సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హనుమకొండ, వరంగల్, జనగామ, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్ జిల్లాల్లో రేపు, ఎల్లుండి స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం రేపు, ఎల్లుండి ఒంటిపూట బడులు ఉంటాయని వెల్లడించింది.
AP: ఒంగోలు తాలూకా పీఎస్లో రామ్ గోపాల్ వర్మ విచారణ ముగిసింది. ఫొటోల మార్ఫింగ్ కేసులో దాదాపు 11 గం.పాటు RGVని పోలీసులు విచారించారు. చంద్రబాబు, పవన్, లోకేశ్ ఫొటోలు మార్ఫింగ్ చేసి ఆయన ‘X’లో పోస్ట్ చేశారు. ఈ పోస్టుల వెనుక ఎవరైనా ఉన్నారా? అనే కోణంలోనూ ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఏపీ ఫైబర్ నెట్ నుంచి ఆర్జీవీకి రూ.2 కోట్లు అందడంపై కూడా విచారించినట్లు సమాచారం.
టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనాకు ఈడీ సమన్లు జారీ చేసింది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో భాగంగా రేపు విచారణకు హాజరు కావాలని కోరింది. ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యలయంలో రైనాను విచారించనున్నారు. ఓ బెట్టింగ్ యాప్కు సురేశ్ రైనా బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో పలువురు బాలీవుడ్ నటులు, సెలబ్రిటీలను ఈడీ విచారిస్తోంది.
అతి నిద్ర కూడా ఆరోగ్యానికి ముప్పేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ‘9 గంటల కంటే ఎక్కువసేపు నిద్రపోయేవారిలో మధుమేహం, ఊబకాయం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే వెన్ను నొప్పి, తల నొప్పితోపాటు డిప్రెషన్కు కూడా గురవుతారు. రాత్రి పూట ఎక్కువగా భోజనం చేయకూడదు. రోజూ ఒకే సమయానికి నిద్ర పోయి, ఒకే సమయానికి మేల్కోవడం అలవాటు చేసుకోవాలి. దీంతో నిద్రపోయే సమయాన్ని తగ్గించుకోవచ్చు’ అని చెబుతున్నారు.
‘వార్ 2’ మూవీకి టికెట్ రేట్లు <<17383707>>పెంచుతూ<<>> AP ప్రభుత్వం జీవో ఇవ్వడంపై హీరో జూ.ఎన్టీఆర్ స్పందించారు. ‘ఈ జీవో ఆమోదించినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు హృదయపూర్వక ధన్యవాదాలు. సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అని తారక్ ట్వీట్ చేశారు.
భారత్-చైనా మధ్య సర్వీసులను పున:ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకోవాలని ఎయిర్లైన్స్ సంస్థలకు కేంద్రం సూచించినట్లు జాతీయ మీడియా పేర్కొంది. SCO సమ్మిట్లో పాల్గొనేందుకు PM మోదీ ఈనెల 31న చైనా వెళ్లనున్నారు. ఈ సందర్భంగా దీనిపై ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది. కరోనా సమయం నుంచి ఫ్లైట్ సర్వీసులు నిలిచిపోయాయి. ఇటీవల ఇరుదేశాల మధ్య మైత్రి చిగురిస్తుండటంతో రాకపోకలు రిస్టోర్ కానున్నట్లు సమాచారం.
Sorry, no posts matched your criteria.