India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఢిల్లీ-ఛత్తీస్గఢ్ రైలులో ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. ఆమె బెర్త్ పైన సీట్లో ప్రయాణించిన ఆర్మీకి చెందిన వ్యక్తి మద్యం మత్తులో మూత్రవిసర్జన చేశాడు. అది కింద సీట్లో నిద్రిస్తున్న మహిళపై పడింది. దీంతో ఆమె భర్త రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయినా నిందితుడిపై చర్యలు తీసుకోలేదని ఆగ్రహించిన సదరు మహిళ ఘటనపై PM కార్యాలయానికి, రైల్వే మంత్రికి ఆన్లైన్లో ఫిర్యాదు చేసింది.
AP: ప్రభుత్వ స్కూళ్లలో ఏడాదిలోగా పూర్తిస్థాయి మౌలిక వసతులు కల్పిస్తామని మంత్రి లోకేశ్ వెల్లడించారు. విద్యాశాఖపై ఆయన అధికారులతో సమీక్షించారు. ‘కొత్త పనులు, నిలిచిన పనులను ఏడాదిలోగా పూర్తి చేయాలి. ప్రభుత్వ స్కూళ్ల నుంచి ప్రైవేట్ బడులకు విద్యార్థులు మారేందుకు గల కారణాలను విశ్లేషించి నివేదిక ఇవ్వాలి. గత ఐదేళ్లలో ఎన్ని బడులు మూతపడ్డాయి? దానికి కారణాలు ఏంటి?’ అనే వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
పీఎం కిసాన్ స్కీమ్ 17వ విడత నిధులు ఈ నెల 18వ తేదీన విడుదల కానున్నాయి. రూ.2వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. వారణాసి పర్యటనలో PM మోదీ ఈ నిధులను విడుదల చేస్తారని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ తెలిపారు. మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన మోదీ తొలి సంతకం ఈ నిధుల విడుదల దస్త్రంపైనే పెట్టారు. ఈ స్కీమ్ కింద ఏటా రూ.6వేలను(3 విడతల్లో రూ.2వేలు) రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్రం అందిస్తోంది.
AP: గత ఐదేళ్లలో వైసీపీ నేతలు తిన్న సొమ్మంతా కక్కించే వరకు వదిలిపెట్టమని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని ఆ పార్టీ నేతలు దోచుకున్నారని విమర్శించారు. వారు ఎక్కడ దాచినా బయటికి తీసుకొస్తామని పేర్కొన్నారు. కాగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కసరత్తు చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే దీనిపై ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.
మైక్రోసాఫ్ట్ సాధించిన విజయం వెనుక భారతీయుల కృషి ఎంతగానో ఉందని ఆ సంస్థ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. భారత్ నుంచి నైపుణ్యమున్న గ్రాడ్యుయేట్లను అమెరికా తీసుకెళ్లామని, వారే తిరిగి భారత్కు వచ్చి డెవలప్మెంట్ సెంటర్లను నెలకొల్పారని వెల్లడించారు. తమ విజయంలో భాగస్వాములైన చాలామంది భారతీయులేనని, ప్రస్తుతం ఇండియాలో 25వేలమంది సంస్థలో పనిచేస్తున్నారని గేట్స్ వివరించారు.
FY06 నుంచి ఐటీ రిటర్న్స్కు ఫైల్ చేసే వారికి 26AS ఫారం ముఖ్యమైనది. ఇందులో లావాదేవీలు, పన్ను చెల్లింపుల వివరాలన్నీ ఉంటాయి. A, B, C అని మూడు భాగాలుగా ఉండే ఈ ఫారం కోసం incometaxindiaefiling.gov.inలో లాగిన్ అవ్వాలి. మై అకౌంట్ > వ్యూ ఫార్మ్ 26AS > కన్ఫామ్ క్లిక్ చేస్తే TRACES సైట్కు రీడైరెక్ట్ అవుతుంది. అందులో వ్యూ ట్యాక్స్ క్రెడిట్ క్లిక్ చేసి ఫారం పొందొచ్చు. FY24 ITR ఫైలింగ్కు జులై 31 లాస్ట్ డేట్.
ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రారంభంకానున్న టీమ్ఇండియా-కెనడా మ్యాచ్కు వరుణుడి ముప్పు పొంచి ఉంది. ఫ్లోరిడాలో భారీ వర్షాలు పడుతుండటంతో ఈ మ్యాచ్ రద్దయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని weather.com పేర్కొంది. మ్యాచ్ సమయంలో వర్షం పడే అవకాశం 50 శాతంగా ఉందని తెలిపింది. ఈ మైదానంలో నిన్న అమెరికా, ఐర్లాండ్ మ్యాచ్ కూడా వర్షార్పణమైంది. కాగా గ్రూప్-ఏలో ఇండియా, అమెరికా ఇప్పటికే సూపర్-8కి అర్హత సాధించాయి.
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాత, నటుడు సౌబిన్ షాహీర్ను ఈడీ ప్రశ్నిస్తోంది. మనీలాండరింగ్ కేసులో ఆయనను ఈడీ విచారిస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా మంజుమ్మల్ బాయ్స్ సినిమా రూ.20 కోట్లతో రూపొందించగా రూ.250 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది. 2006లో 10 మంది స్నేహితులు గుణ కేవ్స్ సందర్శనకు వెళ్తారు. అక్కడ సుభాష్ అనే వ్యక్తి లోయలో పడిపోతాడు. అతడిని ఎలా కాపాడారనేది సినిమా కథ.
స్పామ్ కాల్స్ను అదుపు చేసేందుకు ట్రాన్సాక్షన్, సర్వీస్ వాయిస్ కాల్స్కు ‘160 సిరీస్’ను కేటాయిస్తున్నట్లు TRAI ప్రకటించింది. దీంతో కాలర్లను గుర్తించడం యూజర్లకు సులువు అవుతుందని తెలిపింది. RBI, SEBI, IRDAI, PFRDA పరిధిలోని సంస్థలకు తొలుత ట్రాయ్ ఈ సిరీస్ కేటాయించింది. డిజిటల్ కన్సెంట్ మెకానిజమ్స్ (యూజర్ల అనుమతి ఉంటేనే యాడ్ కాల్స్/SMS వెళ్లే విధానం)పై క్షేత్రస్థాయిలో మార్పులు చేసేందుకు సిద్ధమైంది.
TG: బీఆర్ఎస్ హయాంలో పంటలు సాగు చేయని వారికీ రైతు బంధు ఇచ్చారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. దీనివల్ల పథకం దుర్వినియోగమైందనే భావన ప్రజల్లో ఉందని తెలిపారు. అందుకే సాగు చేసే వారికే రైతు భరోసా ఇవ్వాలని తమ ప్రభుత్వం యోచిస్తోందన్నారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పంటల బీమా పథకాన్ని కూడా అర్హులకే వర్తించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.