News June 14, 2024

అహంకారులను రాముడు 241 వద్దే ఆపాడు: RSS నేత ఇంద్రేశ్

image

తన అహంభావం వల్ల బీజేపీ 241 సీట్లకే పరిమితమైందని ఆర్ఎస్ఎస్ నేత ఇంద్రేశ్ కుమార్ ఘాటు విమర్శ చేశారు. అందుకే రాముడు ఆ పార్టీని తక్కువ సీట్లకు పరిమితం చేశాడని పేర్కొన్నారు. ఇండియా కూటమి రాముడికి వ్యతిరేకమని ఆరోపించారు. అందుకే వారు కూడా 234 సీట్లతో సరిపెట్టుకున్నట్లు ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఇంద్రేశ్ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.

News June 14, 2024

RARE: ఏనుగుకు కవల పిల్లలు

image

థాయ్‌లాండ్‌లో ఓ ఏనుగుకు కవల పిల్లలు జన్మించాయి. ఇందులో ఆడ, మగ ఏనుగు ఉన్నాయి. రాయల్ క్రాల్‌లోని ఆయుత్తాయ ఎలిఫెంట్ ప్యాలెస్‌లో చంచూరి (35) అనే ఏనుగుకు ఒకదాని తర్వాత ఒకటి జన్మించాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఏనుగులకు కవలలు జన్మించేందుకు ఒక శాతం మాత్రమే అవకాశం ఉంటుంది. అవి 22 నెలలపాటు గర్భధారణతో ఉంటాయి. నాలుగేళ్లకోసారి పిల్లలకు జన్మనిస్తాయి.

News June 14, 2024

SSC కానిస్టేబుల్.. 20,471 పోస్టులు పెంపు

image

నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) శుభవార్త చెప్పింది. కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ)-2024 ద్వారా భర్తీ చేయాల్సిన ఖాళీల సంఖ్యను 46,617కు పెంచింది. 2023లో 26,146 పోస్టులకు నోటిఫికేషన్ రాగా, 2024 ఫిబ్రవరి-మార్చిలో పరీక్షలు జరిగాయి. తాజాగా 20,471 పోస్టులను పెంచింది. అత్యధికంగా CISFలో 13,632, BSFలో 12,076, CRPFలో 9,410, ITBPలో 6,287 ఖాళీలు ఉన్నాయి. త్వరలో ఫలితాలు విడుదల కానున్నాయి. ssc.gov.in/

News June 14, 2024

కాలు విరిగితే అట్టముక్క కట్టారు!

image

కాలు విరిగిందని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లిన ముకేశ్ కుమార్ అనే వ్యక్తి అక్కడి వైద్యులు చేసిన చికిత్సకు నిర్ఘాంతపోయాడు. ఫ్రాక్చర్ అయిన కాలుకు అట్టముక్క కట్టి పంపించారు. ఈ ఘటన బిహార్‌లోని ముజఫర్‌పూర్‌ పరిధిలోని మినాపూర్‌లో ఈనెల 7న జరిగింది. ఇక్కడి వైద్యం నచ్చక శ్రీకృష్ణ మెడికల్ కాలేజ్ అనే మరో చోట చూపించుకున్నాడు. అయితే వారు కూడా ఈ కార్డ్‌బోర్డ్ తీయకుండానే ఈనెల 7-11 మధ్య చికిత్స అందించడం కొసమెరుపు.

News June 14, 2024

WOW.. వాట్సాప్‌‌లో 3 అదిరిపోయే ఫీచర్స్

image

వాట్సాప్‌ కాల్స్‌లో మరో మూడు కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. దీనితో ఒకేసారి 32 మంది స్నేహితులతో వీడియో కాల్‌ మాట్లాడొచ్చు. ఇప్పటి వరకూ ఉన్న స్క్రీన్ షేరింగ్ ఫీచర్ ఇకపై ఆడియోతో అందుబాటులోకి వస్తుంది. మెరుగైన ఆడియో, వీడియో నాణ్యతను అందించేందుకు MLow కోడెక్‌ ఫీచర్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది వాయిస్ క్లారిటీతో పాటు HDలో వీడియో కాల్ మాట్లాడే సదుపాయాన్ని అందిస్తుంది.

News June 14, 2024

ఆన్‌లైన్‌ గేమింగ్ జీఎస్‌టీపై కేంద్రం సమీక్ష!

image

ఆన్‌లైన్ గేమింగ్‌పై 28% పన్ను విధించడాన్ని GST కౌన్సిల్ ఈనెల 22న జరిగే సమావేశంలో పునఃపరిశీలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు పలు వస్తువులకు విధించే ఇన్వర్టెడ్ ట్యాక్స్ విధానంపైన ఫిట్‌మెంట్ కమిటీ సూచనలను సమీక్షించనున్నట్లు సమాచారం. కాగా 2023 అక్టోబరు 1న ఆన్‌లైన్ గేమింగ్‌పై 28% GSTని కేంద్రం అమలులోకి తీసుకొచ్చింది. ఆరునెలలు దాటడంతో ముందుగా అనుకున్నట్టు కౌన్సిల్ దానిని పరిశీలించనుంది.

News June 14, 2024

గిన్నిస్ రికార్డు: అత్యంత పొట్టి జంట

image

ప్రపంచంలోనే అత్యంత పొట్టి దంపతులుగా బ్రెజిల్ వాసులు పౌలో గాబ్రియెల్ ద సిల్వ (31), కట్యుసియా (28)ను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది. గాబ్రియెల్ ఎత్తు 90.28 cm కాగా, కట్యుసియా 91.13 cms ఉన్నారు. 2006లో తొలిసారి కలుసుకున్న వీరు 15 ఏళ్ల తర్వాత వివాహం చేసుకున్నారు. తాము పొట్టిగా ఉన్నా మనసులు పెద్దవని, ఒకరిపై ఒకరికి చాలా ప్రేమ ఉందని వారు చెబుతున్నారు.

News June 14, 2024

18వ లోక్‌సభలో టాప్-10 రిచెస్ట్ ఎంపీలు వీరే

image

☛చంద్రశేఖర్ పెమ్మసాని(TDP)- ₹5,705 కోట్లు
☛కొండా విశ్వేశ్వర్ రెడ్డి (BJP) – ₹4,568 కోట్లు
☛నవీన్ జిందాల్(BJP) – ₹1,241 కోట్లు
☛ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి (TDP) ₹716 కోట్లు,
☛సీఎం రమేశ్(BJP)- ₹497 కోట్లు
☛జ్యోతిరాదిత్య సింధియా(BJP)- ₹424 కోట్లు
☛ఛత్రపతి సాహు మహరాజ్(INC)- ₹342 కోట్లు
☛శ్రీభరత్ (TDP) – ₹298 కోట్లు
☛హేమ మాలిని (BJP)- ₹278 కోట్లు
☛ప్రభ మల్లికార్జున్ (INC)- ₹241 కోట్లు

News June 14, 2024

పేటీఎంపై ఉద్యోగుల తిరుగుబాటు!

image

పేటీఎం‌లో లేఆఫ్స్ పరంపరపై ఆ సంస్థ ఉద్యోగులు తిరుగుబాటు చేస్తున్నారు. ఉద్యోగానికి స్వచ్ఛంద రాజీనామా చేయాలని ఆ సంస్థ కోరుతున్నా వారు అందుకు ససేమిరా అంటున్నారు. ఉద్యోగాలు కోల్పోయిన కొంతమందికి ఎక్స్‌పీరియన్స్ లెటర్, బోనస్, ఇతర సౌకర్యాలు కల్పించడంలో ఆ సంస్థ విఫలమైంది. తీసుకున్న బోనస్ కూడా తిరిగిచ్చేయాలని ఒత్తిడి చేస్తుండటంతో వారు ఈ సమస్యను కార్మికశాఖ దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.

News June 14, 2024

ఈ బాలికలను చూస్తుంటే సంతోషంగా ఉంది: CM రేవంత్

image

TG: ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంతో బాలికలు పాఠశాలకు వెళ్తుండటం ఆనందాన్ని కలిగిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ‘సిద్దిపేట జిల్లా మగ్దుంపూర్ పాఠశాలలో చదువుతున్న ఈ బాలికలు ఊరికి కి.మీ. దూరంలో ఉన్న స్కూలుకు రూపాయి ప్రయాణఖర్చు లేకుండా వెళ్లగలుగుతున్నారు. ఉచిత ప్రయాణం వల్ల బస్సెక్కి స్కూలుకు వెళ్లగలుగుతున్నామని ఆధార్ కార్డులు చూపిస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు’ అని సీఎం పేర్కొన్నారు.