India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఛత్రపతిగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లేకి 1674 జూన్ 6న రాయగఢ్ కోటలో పట్టాభిషేకం జరిగింది. ఈ సందర్భంగా మరాఠా సామ్రాజ్యానికి రాజుగా శివాజీ పట్టాభిషేకం జరిగింది ఈరోజేనంటూ ఆయన ఫాలోవర్స్ Xలో పోస్టులు పెడుతున్నారు. శివాజీ లౌకిక పాలకుడని, అన్ని మతాలకు అనుకూలంగా ఉండి, ప్రజలందరినీ సమానంగా చూసుకునేవారని గుర్తుచేసుకుంటున్నారు.
AP: రాష్ట్ర ప్రయోజనాలే అందరి ప్రథమ కర్తవ్యం కావాలని కొత్తగా ఎన్నికైన ఎంపీలకు టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు. ప్రజలిచ్చిన తీర్పుతో ఆకాశంలో విహరించొద్దని, పదవులు శాశ్వతమని ఎవరూ అనుకోవద్దని చెప్పారు. వైసీపీ ఎంపీలు గతంలో జగన్ కేసుల మాఫీ అజెండాతోనే ఢిల్లీలో పైరవీలు చేశారని ఆరోపించారు. టీడీపీ నేతలు ఈ విజయాన్ని సమాజసేవకు వినియోగించాలని స్పష్టం చేశారు.
ఢిల్లీలో నిన్న జరిగిన ఎన్డీఏ కూటమి సమావేశానికి జనసేనాని పవన్ కళ్యాణ్ హాజరైన విషయం తెలిసిందే. అనంతరం కుటుంబసమేతంగా నరేంద్ర మోదీని కలిశారు. భార్య అన్నా లెజినోవా, కుమారుడు అకీరాను పవన్ ఆయనకు పరిచయం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోను జనసైనికులు నెట్టింట షేర్ చేస్తున్నారు.
ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తుండటంపై అభినందనలు తెలిపారు. రెండు రాష్ట్రాల విభజన హామీలు, సమస్యలు పరిష్కరించుకుందామని CBNను కోరారు. తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు. కాగా, ప్రమాణస్వీకారానికి చంద్రబాబు పిలిస్తే వెళ్తానని నిన్న రేవంత్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
AP: అమలాపురం మాజీ MP, తొలి దళిత లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి తనయుడు హరీశ్ పార్లమెంట్ గడప తొక్కనున్నారు. అమలాపురం నుంచి ఆయన భారీ మెజార్టీతో నెగ్గారు. తన ప్రత్యర్థి రాపాక వరప్రసాద్(YCP)పై 3,42,196 ఓట్ల మెజార్టీ సాధించి విజయ దుందుభి మోగించారు. గత ఎన్నికల్లో ఆయన TDP తరఫున ఇక్కడి నుంచే పోటీ చేసి ఓడిపోయారు. బాలయోగి మరణానంతరం 2002లో జరిగిన ఉప ఎన్నికలో హరీశ్ తల్లి విజయకుమారి అమలాపురం MPగా గెలిచారు.
NDA కూటమిలో భాగమైన టీడీపీ ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్నట్లు NDTV తెలిపింది. దాంతో పాటు స్పీకర్ పదవి, రెండు కేబినెట్ బెర్తులు అడుగుతోందని పేర్కొంది. అటు జేడీయూ రైల్వేతో పాటు వ్యవసాయశాఖను కోరుతోందట. ఇక హోం, ఆర్థిక, రక్షణ, విదేశీ వ్యవహారాల లాంటి కీలక మంత్రిత్వ శాఖలను బీజేపీనే అట్టిపెట్టుకుంటుందని NDTV వివరించింది.
వన్డే WC ఫైనల్లో ఓటమి తర్వాత నాలుగైదు రోజుల పాటు షాక్ నుంచి తేరుకోలేకపోయానని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ‘ఫైనల్ జరిగిన తర్వాత రోజు నిద్ర లేచా. ఆ రాత్రి మనం ఓడిపోయినట్లు కల వచ్చింది. మరుసటి రోజు ఫైనల్ అనుకొని నిజంగా ఇలాగే జరుగుతుందా అని నా భార్య రితికాను అడిగా. కాసేపటికే తేరుకొని మనం ఓడిపోయామని గ్రహించా’ అని వెల్లడించారు.
NDA కూటమిలో ఉన్న JDU కీలక డిమాండ్ను బీజేపీ ముందు ఉంచినట్లు తెలుస్తోంది. అగ్నిపథ్/అగ్నివీర్ స్కీమ్ అమలును పున: సమీక్షించాలని కోరినట్లు సమాచారం. కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ ఓటమికి ఈ నిర్ణయం ఓ కారణమై ఉండొచ్చని అభిప్రాయపడింది. అలాగే ఒకే దేశం ఒకే ఎన్నిక(ONOP), యూనిఫాం సివిల్ కోడ్(UCC)ను సపోర్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఈ సూచనపై కొత్త ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
AP: వైసీపీ నేతలు ఇవాళ సాయంత్రం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్తో సమావేశం కానున్నారు. కౌంటింగ్ తర్వాత వైసీపీ సానుభూతిపరులు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై ఫిర్యాదు చేయనున్నారు. ప్రభుత్వం ఏర్పాటు కాకముందే TDP ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయని, గవర్నర్ జోక్యం చేసుకోవాలని <<13390762>>జగన్<<>> ఇప్పటికే ట్వీట్ చేశారు.
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్టైన టాలీవుడ్ నటి హేమ ‘మా’ సభ్యత్వం రద్దు చేశారు. ప్రాథమిక సభ్యత్వం తొలగిస్తూ MAA(మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) అధ్యక్షుడు మంచు విష్ణు నిర్ణయం తీసుకున్నారు. రేవ్ పార్టీ కేసులో ఆమెకు ‘మా’ పంపిన నోటీసులపై హేమ స్పందించలేదని సమాచారం. వివరణ ఇచ్చేంతవరకు ఆమెపై సస్పెన్షన్ కొనసాగనుంది.
Sorry, no posts matched your criteria.