India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి దిశగా వైసీపీ సాగుతోంది. దీంతో సీఎం జగన్ కాసేపట్లో తన పదవికి రాజీనామా చేయనున్నారు. గవర్నర్ జస్టిస్ నజీర్కు తన రాజీనామా లేఖను పంపనున్నారు.
నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో TDP అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లీడింగ్లో ఉన్నారు. మంత్రి కాకాణి గోవర్ధన్పై 4,313 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాగా ఇక్కడ గత 20 ఏళ్లుగా టీడీపీ గెలవడం లేదు. ఆ పార్టీ నుంచి గత నాలుగు ఎన్నికల్లో వరుసగా పోటీ చేసిన సోమిరెడ్డి ఓడిపోతూ వస్తున్నారు. కూటమి హవా రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న వేళ ఈసారి సర్వేపల్లిలోనూ TDP జెండా ఎగురుతుందేమో చూడాలి.
ఒడిశాలో నవీన్ పట్నాయక్కు బీజేపీ షాక్ ఇచ్చేలా కనిపిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న కౌంటింగ్లో కాషాయ పార్టీ 74 స్థానాల్లో లీడింగ్లో కొనసాగుతోంది. మరోవైపు బీజేడీ 57, కాంగ్రెస్ 13, స్వతంత్రులు 2, సీపీఐ ఒక చోట ముందంజలో ఉన్నాయి. దీంతో కొద్ది తేడాలో అధికారం మారే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
రాజకీయ రణరంగంలో ఎత్తుకు పైఎత్తులు వేయడం ఎంత ముఖ్యమో మళ్లీ నిరూపణ అయింది. బిహార్లో నితీశ్ను తమవైపు తిప్పుకోవడం బీజేపీకి చాలా కలిసొచ్చింది. లేదంటే యూపీ తరహాలో ఇక్కడా దెబ్బపడేది. ఈ రాష్ట్రంలో కులాలకు చాలా ప్రాధాన్యం ఉంది. ఈసీ వెబ్సైట్ ప్రకారం మొత్తం 40 సీట్లలో ఎన్డీయే పార్టీలైన జేడీయూ 15, బీజేపీ 13, ఎల్జేపీ 5 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. ఇండియా కూటమి 6 స్థానాల్లో పోటీలో ఉంది.
ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ తన ప్లాన్ బీ అమల్లో పెట్టేసింది. మ్యాజిక్ ఫిగర్కు అతి సమీపంలో ఉన్న ఇండియా కూటమి వైపు మరిన్ని ప్రాంతీయ పార్టీలను ఆహ్వానించాలన్న లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా బిహార్లో సీఎం నితీశ్ కుమార్ను కాంగ్రెస్ నేతలు కలుస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబుతో కూడా కాంగ్రెస్ మంతనాలు ప్రారంభించింది!
ఏపీలో బీజేపీ బోణీ కొట్టింది. అనపర్తిలో బీజేపీ MLA అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విజయం సాధించారు. టీడీపీ నేతగా ఉన్న నల్లమిల్లికి ఆ పార్టీ టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన కాషాయ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఏపీలో ప్రస్తుతం బీజేపీ 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
తెలంగాణలో పలువురు సిట్టింగ్ ఎంపీలు ఈ ఎన్నికల్లోనూ బరిలో ఉన్నారు. మహబూబాబాద్ నుంచి BRS అభ్యర్థి మాలోత్ కవిత, చేవెళ్లలో కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి(గతంలో BRS), మహబూబ్నగర్లో మన్నె శ్రీనివాస్రెడ్డి(BRS) వెనుకంజలో ఉన్నారు. బీజేపీ సిట్టింగ్ ఎంపీలు సికింద్రాబాద్లో కిషన్రెడ్డి, నిజామాబాద్లో అర్వింద్, కరీంనగర్లో బండి సంజయ్ ఆధిక్యంలో దూసుకెళుతున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుతో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ భేటీ కానున్నట్టు సమాచారం. ఎన్డీయేను 300 సీట్లు దాటనివ్వకుండా శాయశక్తులా కృషి చేస్తున్న ఇండియా కూటమి తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన బలాన్ని సంపాదించే పనిలో పడింది. అందులో భాగంగానే చంద్రబాబును వేణుగోపాల్ కలవనున్నట్టు తెలిసింది. ఇప్పుడు ఈ భేటీకి దేశవ్యాప్తంగా రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది.
మహారాష్ట్రలో NCP (SP) 10 స్థానాల్లో బరిలో నిలవగా 8 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు అజిత్ పవార్ సారథ్యంలోని NCP 5 స్థానాల్లో పోటీ చేయగా కేవలం ఒక్క స్థానంలో(రాయిగఢ్) ముందంజలో ఉంది. ఆ రాష్ట్రంలో ఇండియా కూటమి 28 స్థానాల్లో, ఎన్డీఏ 17 చోట్ల లీడింగ్లో కొనసాగుతున్నాయి.
AP: ఎస్టీ నియోజకవర్గాల్లో ఈసారి వైసీపీ చతికిలపడింది. రాష్ట్రంలో ఏడు ఎస్టీ రిజర్వుడు(పాలకొండ, కురుపాం, సాలూరు, అరకువ్యాలీ, పాడేరు, రంపచోడవరం, పోలవరం) నియోజకవర్గాలున్నాయి. వీటిలో ప్రస్తుతం పాలకొండ, అరకు, పాడేరులో వైసీపీ అభ్యర్థులు లీడింగ్లో ఉన్నారు. మిగతా చోట్ల కూటమి అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. కాగా గత ఎన్నికల్లో ఈ ఏడు స్థానాలను వైసీపీ గెలుచుకుంది.
Sorry, no posts matched your criteria.