India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహబూబాబాద్లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ ముందంజలో ఉన్నారు.
విజయవాడ లోక్సభ సీటులో టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని 1200 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆయన ప్రత్యర్థి, సోదరుడు కేశినేని నాని(వైసీపీ) వెనుకంజలో ఉన్నారు. తిరువూరు అసెంబ్లీలో టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్ ముందంజలో ఉన్నారు. మైలవరంలో టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ లీడ్లో ఉన్నారు.
AP: హిందూపురం అసెంబ్లీ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణ లీడింగులో ఉన్నారు. అక్కడ వైసీపీ నుంచి దీపిక బరిలో ఉన్నారు. అయితే హిందూపురం ఎంపీ సెగ్మెంట్లో వైసీపీ అభ్యర్థి శాంతమ్మ ఆధిక్యంలో ఉన్నారు. అక్కడ టీడీపీ నుంచి పార్థసారథి పోటీ చేస్తున్నారు. అలాగే డోన్లో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెనకంజలో ఉన్నారు. అక్కడ టీడీపీ నుంచి కోట్ల సూర్యప్రకాశ్ బరిలో ఉన్నారు.
AP: పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ ముందంజలో ఉన్నారు. ఇక్కడ వైసీపీ నుంచి బూడి ముత్యాలనాయుడు పోటీలో ఉన్నారు. 1వ రౌండ్లో సీఎం రమేశ్కు 4,278 ఓట్లు పోలవ్వగా.. బూడి ముత్యాలనాయుడుకి 3,289 ఓట్లు పడ్డాయి. సీఎం రమేశ్ 989 మెజార్టీలో ఉన్నారు.
మధ్యప్రదేశ్లో వార్ వన్సైడ్ కొనసాగుతోంది. ఎర్లీ ట్రెండ్స్లో ఎన్డీయే అత్యధిక స్థానాల్లో దూసుకుపోతోంది. మొత్తం 29 నియోజకవర్గాల్లో బీజేపీ 17 స్థానాల్లో అదరగొడుతోంది. విపక్ష ఇండియా కూటమి రెండిట్లో ఆధిక్యంలో ఉంది. గుణలో జ్యోతిరాధిత్య సింధియా, విదిశాలో శివరాజ్ సింగ్ చౌహాన్ దూసుకెళ్తున్నారు. చింద్వాడాలో నకుల్ కమల్నాథ్ (కాంగ్రెస్), బాలాఘాట్లో అశోక్ సింగ్ (కాంగ్రెస్) పోటీనిస్తున్నారు.
ఉమ్మడి ప.గో. జిల్లా భీమవరంలో జనసేన అభ్యర్థి అంజిబాబు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అటు కాకినాడ రూరల్లో జనసేన క్యాండిడేట్ పంతం నానాజీ, తాడేపల్లిగూడెంలో జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ఆధిక్యంలో ఉన్నారు. అటు ఉండి, రాజమండ్రి సిటీ, పాలకొల్లు, దెందులూరులో టీడీపీ అభ్యర్థులు రఘురామకృష్ణరాజు, ఆదిరెడ్డి వాసు, నిమ్మల రామానాయుడు, చింతమనేని ప్రభాకర్ లీడ్లో ఉన్నారు.
AP: ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్ధన్ రావు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 2,760 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వెనుకంజలో ఉన్నారు.
TG: ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఫస్ట్ రౌండ్లో 19,935 ఓట్ల లీడింగ్లో ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
AP: గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారు రోశయ్య వెనుకంజలో ఉన్నారు. పొన్నూరులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర ముందంజలో ఉన్నారు.
AP: తిరుపతి పార్లమెంట్ స్థానంలో వైసీపీ సిట్టింగ్ ఎంపీ మద్దెల గురుమూర్తి ఆధిక్యంలో వచ్చారు. తొలి రౌండులో బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ లీడింగులో ఉండగా, ఇప్పుడు గురుమూర్తి ముందంజలో ఉన్నారు. అనంతపురం అర్బన్ అసెంబ్లీ స్థానంలో టీడీపీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆధిక్యంలో ఉన్నారు. వైసీపీ నుంచి అనంత వెంకట్రామిరెడ్డి పోటీ చేస్తున్నారు. పుట్టపర్తిలో శ్రీధర్రెడ్డి(వైసీపీ) లీడింగులో ఉన్నారు.
Sorry, no posts matched your criteria.