India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: మహబూబ్నగర్లో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఫస్ట్ రౌండ్లో 3వేల ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ 7 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
విజయవాడ వెస్ట్లో బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ముందంజలో ఉన్నారు. గుడివాడలో వైసీపీ అభ్యర్థి కొడాలి నాని వెనుకంజలో ఉన్నారు. సమీప అభ్యర్థి వెనిగండ్ల రాము ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
జహీరాబాద్ పార్లమెంట్ స్థానం ఎన్నికల ఫలితాల్లో సురేశ్ కుమార్ ముందంజలో ఉన్నారు. ఆయన కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్నారు.
ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగా తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉంది. ప్రస్తుతం వెల్లడవుతున్న ఫలితాల్లో బీఆర్ఎస్ ఒక్క చోట కూడా ఆధిక్యత కనబర్చడం లేదు. ప్రభుత్వ వ్యతిరేకతను బీజేపీ అనుకూలంగా మలుచుకోగా ఇందులో గులాబీ పార్టీ విఫలమైందని స్పష్టమవుతోంది.
హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కంగనా రనౌత్ ముందంజలో ఉన్నారు. ఇండియా కూటమి అభ్యర్థి విక్రమాదిత్య సింగ్పై స్వల్ప ఆధిక్యంతో కొనసాగుతున్నారు.
గుజరాత్లో బీజేపీ మొత్తం 26 స్థానాల్లో లీడింగ్లో దూసుకెళ్తున్నాయి. తమిళనాడులో డీఎంకే 14, కాంగ్రెస్ 5 సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి. మహారాష్ట్రలో 7 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. కాంగ్రెస్ 6 స్థానాల్లో, సేన 4, NCP SP 3, SS UBT 6 స్థానాల్లో లీడింగ్లో కొనసాగుతున్నాయి. అటు కర్ణాటకలో 8 చోట్ల బీజేపీ, 7 చోట్ల INC, 2 చోట్ల JDS, కేరళలో 16 స్థానాల్లో UDF, 4 స్థానాల్లో LDF ఆధిక్యంలో ఉన్నాయి.
TG: భువనగిరిలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ముందంజలో ఉన్నారు. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థులు ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్, మల్కాజిగిరిలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
AP: నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోస్టల్ బ్యాలెట్లో ఆధిక్యంలో నిలిచారు. వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి వెనుకంజలో ఉన్నారు.
AP: కడప పార్లమెంట్ స్థానంలో సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి 2,274 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక్కడ టీడీపీ నుంచి భూపేశ్ రెడ్డి పోటీ చేస్తున్నారు. చిత్తూరు ఎమ్మెల్యే స్థానంలో టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ లీడింగులో ఉన్నారు. అక్కడ వైసీపీ నుంచి విజయానందరెడ్డి బరిలో ఉన్నారు. తిరుపతి బీజేపీ ఎంపీ(SC) అభ్యర్థి వరప్రసాద్ రావు లీడింగులో ఉన్నారు.
రాజస్థాన్లోని కోటా నుంచి పోటి చేసిన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ముందంజలో ఉన్నారు. బీజేపి నుంచి కాంగ్రెస్లో చేరిన ప్రహ్లాద్ గుంజాల్పై ఆయన ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
Sorry, no posts matched your criteria.