India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మాజీ కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ మళ్లీ బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. రూపాలీ గంగూలీ కీలకపాత్ర పోషిస్తున్న ‘అనుపమా’లో స్మృతీ ప్రత్యేక అతిథి పాత్రలో నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆమె ఇప్పటికే పలు సినిమాలు, టీవీ షోల్లో కనిపించారు. తెలుగులో ‘జై బోలో తెలంగాణ’లో ఆమె ఉద్యమకారిణి, తల్లి పాత్ర పోషించారు. అయితే ఆమె కమ్బ్యాక్ గురించి ‘అనుపమా’ మేకర్స్ ప్రకటించాల్సి ఉంది.

APలోని పలు జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, GNT, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, NLR, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంది. శ్రీకాకుళం, VZM, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో, YSR, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయంది.

వార్తా సంస్థ ANI పేజీని ఎడిట్ చేసిన వారి వివరాలను వెల్లడించడానికి నిరాకరించినందుకు ఢిల్లీ హైకోర్టు వికీపీడియాకు చురకలంటించింది. కొందరు యూజర్లు ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికి ANI ప్రచార సాధనం అని ఎడిట్ చేశారు. దీంతో వికీపీడియాపై ANI పరువు నష్టం దావా వేసింది. కాగా ఆ యూజర్ల వివరాలివ్వాలని HC గతంలోనే వికీపీడియాకు సమన్లు పంపింది. వికీపీడియా వెల్లడించకపోవడంతో తాజాగా ఆగ్రహం వ్యక్తం చేసింది.

TG: గ్రూప్-1 పరీక్షలకు సంబంధించి హైకోర్టు రేపు తీర్పు ఇవ్వనుంది. ప్రిలిమ్స్ ఫైనల్ కీలలో తప్పులున్నాయని అభ్యర్థులు వాదించారు. తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాదని, వికీపీడియా, గూగుల్ ఆధారంగా కీ రూపొందించినట్లు TGPSC కోర్టులో వివరణ ఇచ్చింది. దీంతో పాటు ST రిజర్వేషన్లకు సంబంధించి జీవో-33పై దాఖలైన పిటిషన్పైనా రేపు వచ్చే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. అటు ఈ నెల 21 నుంచి మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి.

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వక్ఫ్ సవరణ బిల్లు-2024ను వ్యతిరేకిస్తూ కేరళ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ బిల్లు లౌకిక సూత్రాలను ఉల్లంఘించడమే కాకుండా వక్ఫ్ బోర్డులో నామినేటెడ్ సభ్యులు, ఛైర్మన్ను నియమించడం ద్వారా ప్రజాస్వామ్య విలువలకు ముప్పు కలిగిస్తుందని మంత్రి అబ్దురహిమాన్ పేర్కొన్నారు. అధికార LDF ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి UDF పలు సవరణలు సూచించి మద్దతిచ్చింది.

తిరుమలలో ఈ నెల 16న వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. రాగల 48 గంటల్లో భారీ వర్షం కురుస్తుందన్న వాతావరణ శాఖ అంచనాలతో భక్తుల భద్రత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 15న సిఫార్సు లేఖలను స్వీకరించబోమని వెల్లడించింది.

మహారాష్ట్ర ఎన్నికల్లో INDIA కూటమి గెలుపు కోసం వ్యూహకర్త సునీల్ కనుగోలు రంగంలోకి దిగారు. హరియాణాలో జాట్ల ఓట్ల సమీకరణ క్రమంలో మిగతా వర్గాలు దూరమవ్వడం కాంగ్రెస్ కొంపముంచింది. దీంతో MHలో అందరికీ సమ ప్రాధాన్యం ఇవ్వడం సహా, అసంతృప్తి నేతలను మచ్చిక చేసుకొనే వ్యూహాలను పార్టీ ముందుంచినట్టు తెలిసింది. హరియాణాలో కాంగ్రెస్ రెబల్స్కు BJP సహకరించడం వల్లే ఓడిపోయామని కాంగ్రెస్ భావిస్తోంది.

సంగీతానికి రాళ్లు కరిగించే శక్తి ఉంటుందంటారు. అదే సంగీతం మొక్కలను వేగంగా పెరిగేలా చేస్తుందనే విషయాన్ని పరిశోధకులు నిరూపించారు. మ్యూజిక్ ప్లే చేయడం ద్వారా మొక్కల పెరుగుదలను ప్రోత్సహించే ఫంగస్ కార్యాచరణను ప్రేరేపించవచ్చని తేలింది. శిలీంధ్రాలున్న పాత్రల చుట్టూ సౌండ్ బూత్లను అమర్చి పరీక్షించారు. 5 రోజుల తర్వాత శిలీంధ్రాలలో పెరుగుదల& బీజాంశం ఉత్పత్తిలో వేగం కనిపించింది.

జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ను రంగారెడ్డి జిల్లా కోర్టు కొట్టివేసింది. అత్యాచారం కేసులో బెయిల్ కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన చంచల్గూడ జైలులో ఉన్నారు.

బిష్ణోయ్ తెగ కృష్ణ జింకల్ని పవిత్రంగా భావిస్తుంది. వీటిని వేటాడాడన్న ఆరోపణలతో సల్మాన్ ఖాన్పై బిష్ణోయ్ పగ పెంచుకున్నాడు. సల్మాన్ స్నేహితులనీ టార్గెట్ చేశాడు. సింగర్ గిప్పీ నివాసం వద్ద కాల్పులు జరిపించాడు. సల్మాన్ ఇంటి బయట కాల్పుల వెనుక, కెనడాలో AP ధిల్లాన్ హత్యకు కుట్ర, బాబా సిద్దిఖీ హత్య వెనుక బిష్ణోయ్ మాస్టర్మైండ్! సిద్ధూ మూసేవాలా హత్యతో బిష్ణోయ్ గ్యాంగ్ పేరు తెరమీదకొచ్చింది.
Sorry, no posts matched your criteria.