India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే బురద జల్లుతున్నారని సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత రోజా మండిపడ్డారు. ‘మొదటి కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలోనే మాది పొలిటికల్ గవర్నెన్స్.. మా వారు చెప్పిందే చేయండి’ అని చెప్పారు. దందాలపై వ్యతిరేకత వచ్చే సరికి ఇప్పుడు తప్పులను ఎమ్మెల్యేలపై నెడుతున్నారు. బాబుకు చిత్తశుద్ధి ఉంటే తప్పు ఎవరు చేసినా కఠినంగా వ్యవహరించాలి’ అని ఆమె ట్వీట్ చేశారు.

మహిళా ఓటర్లలో వ్యతిరేకత వచ్చినా కమలా హారిస్ను ఎదుర్కోవడంలో వెనక్కు తగ్గబోనని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. పెన్సిల్వేనియా సభలో ఆయన మాట్లాడుతూ.. ‘నేను మృదువుగా ఉండకపోతే మహిళలకు నచ్చనని అంటున్నారు. నేను దీన్ని పట్టించుకోను. అయినా మహిళలకు జాతిహితం మీదే దృష్టి ఉంటుంది. నా వ్యాఖ్యలను పట్టించుకోరు. కమల అసమర్థురాలు. అధ్యక్ష బాధ్యతలకు అనర్హురాలు’ అని పేర్కొన్నారు.

JKలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న NCకి ఇక కాంగ్రెస్ అవసరం కనిపించడం లేదు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 46 మంది MLAల బలం వీరికి ఉంది (NC 42+కాంగ్రెస్ 6). అయితే స్వతంత్రులుగా గెలిచిన నలుగురు సభ్యులు తాజాగా NCకి మద్దతు ప్రకటించారు. దీంతో NC, స్వతంత్రుల బలం 46కు చేరింది. తద్వారా NCకి కాంగ్రెస్ అవసరం లేకుండాపోయింది. మరి NC ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉంటుందా? లేదా? అన్నది వేచిచూడాలి.

బాడీలోని ఇమ్యూన్ సిస్టమ్ ఇన్ఫెక్షన్లపై పోరాడుతుంది. మనం తీసుకున్న ఆహారాన్ని శత్రువుగా భావించి అది జరిపే చర్యనే ఫుడ్ అలర్జీ అంటారు. కొన్నిసార్లిది ప్రాణాంతకం కావొచ్చు. చాలా మందికి పాలు, గుడ్లు, పల్లీలు, సోయ, గోధుమ, ఫిష్ తింటే ఫుడ్ అలర్జీ వస్తుంది. కొన్నిసార్లిది Anaphylaxisకు దారితీయొచ్చు. అంటే ఉన్నట్టుండి లక్షణాలు డేంజరస్గా మారొచ్చు. అందుకే పిల్లల్లో ఫుడ్ ఇంటాలరెన్స్ను గమనించాలని డాక్టర్ల సలహా.

నందమూరి బాలకృష్ణ ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించినా సూపర్ పవర్స్ ఉన్న హీరో రోల్ మాత్రం ఇప్పటి వరకూ చేయలేదు. త్వరలోనే ఆ పాత్రను కూడా ఆయన పోషించే ఛాన్స్ కనిపిస్తోంది. రేపే దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ వస్తుందని టాలీవుడ్ సర్కిల్స్ చెబుతున్నాయి. దీంతో నందమూరి ఫ్యాన్స్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఆయన తనయుడు మోక్షజ్ఞ ఇలాంటి కథతోనే ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

పాకిస్థాన్ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ ఫాతిమా సనా ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి ఆకస్మికంగా మరణించారు. దీంతో ఆమె హుటాహుటిన దుబాయ్ నుంచి కరాచీ బయల్దేరి వెళ్లారు. ఆస్ట్రేలియాతో జరగబోయే మ్యాచ్కు వైస్ కెప్టెన్ మునీబా అలీ సారథిగా వ్యవహరిస్తారు. కాగా మహిళల టీ20 వరల్డ్ కప్లో ఫాతిమా సారథ్యంలో పాక్ ఒక మ్యాచ్ గెలిచి, మరొకటి ఓడింది.

AP: నగరాలకే పరిమితమైన డ్రగ్స్ కల్చర్ పట్టణాలకూ విస్తరిస్తోంది. తాజాగా తూ.గో(D) భూపాలపట్నంలోని ఓ గెస్ట్హౌస్లో జరిగిన బర్త్డే పార్టీలో డ్రగ్స్ కలకలం రేపింది. తాడేపల్లిగూడెంకు చెందిన నలుగురు యువకులు టెలిగ్రామ్లో కొకైన్ కొనుగోలు చేశారు. ఢిల్లీ నుంచి కొరియర్ ద్వారా టౌన్కు తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. 4గ్రా. కొకైన్, 50గ్రా. గంజాయి, కారును స్వాధీనం చేసుకున్నారు.

తెలంగాణలోని ఏపీ కేడర్ IASలపై కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వెంటనే ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. తమను తెలంగాణలోనే కొనసాగించాలని రొనాల్డ్ రోస్, ఆమ్రపాలి సహా 11 మంది IAS ఆఫీసర్లు విజ్ఞప్తి చేయగా కేంద్రం తిరస్కరించింది. ఏపీకి వెళ్లాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఉత్తర్వులు జారీ చేసింది.

2024 ఏడాదికిగానూ సాహిత్యంలో దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్ను నోబెల్ వరించింది. మానవ జీవితంలోని చరిత్రాత్మక సంఘర్షణలు, దుర్భలత్వాన్ని కళ్లకు కడుతూ ఆమె రాసిన ప్రభావవంతమైన కవితలకు గుర్తింపుగా ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కింది. సియోల్లో స్థిరపడ్డ హాన్ సాహిత్యంతోపాటు, కళలు, సంగీతానికి జీవితాన్ని అంకితం చేశారని ది స్వీడిష్ అకాడమీ పేర్కొంది.

1998లో టాటా తయారుచేసిన తొలి హాచ్బ్యాక్ కారు ఇండికా సక్సెస్ కాలేదు. దీంతో ఫోర్డ్ కంపెనీకి విక్రయించాలనుకున్నారు. చర్చల సమయంలో ఫోర్డ్ యజమాని బిల్ ఫోర్డ్ రతన్ టాటాను అవమానించేలా మాట్లాడారు. దీంతో రతన్కు పౌరుషం వచ్చి ఆ డీల్ను ఆపేశారు. తన ప్రతిభతో మార్కెట్లో అదే కారును అగ్రస్థానంలోకి తీసుకొచ్చారు. చివరికి ఫోర్డ్కే చెందిన జాగ్వార్, లాండ్ రోవర్లను కూడా టాటా కొనుగోలు చేసింది. దటీజ్ రతన్ టాటా.
Sorry, no posts matched your criteria.