India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రైవసీ పాలసీని ఉల్లంఘించిన 84.58 లక్షల ఖాతాలను వాట్సాప్ బ్యాన్ చేసింది. ఒక్క ఆగస్టులోనే ఈ సంఖ్యలో నిషేధం విధించినట్లు పేర్కొంది. వీటిలో అనుమానాస్పదంగా ఉన్న 16.61 లక్షల అకౌంట్లను ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా ముందుగానే గుర్తించి జాగ్రత్త చర్యగా బ్యాన్ చేసినట్లు తెలిపింది. కాగా ఆగస్టులో వాట్సాప్ గ్రీవెన్స్కు 10,707 ఫిర్యాదులు అందినట్లు వెల్లడించింది.

దేవర సినిమా విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ ఎన్టీఆర్ ఈరోజు ఓ లేఖ విడుదల చేశారు. ‘దేవర సినిమాకు నా హృదయంలో ఎప్పటికీ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. మీరు అందిస్తున్న ఆదరణకు థాంక్స్. నా సహనటులు, టెక్నీషియన్స్, నిర్మాతలు అందరికీ ధన్యవాదాలు. నెల రోజులుగా దేవరను ఓ పండుగలా జరుపుకొంటున్న నా ఫ్యాన్స్కు శిరసు వంచి కృతజ్ఞతలు చెబుతున్నాను. ఎప్పటికీ మీరు గర్వపడే సినిమాలే చేయడానికి ప్రయత్నిస్తాను’ అని పేర్కొన్నారు.

WTC చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన భారత కెప్టెన్గా కోహ్లీ పేరిట రికార్డు ఉంది. WTCలో ఆయన 22 టెస్టులకు కెప్టెన్సీ చేయగా 14 మ్యాచుల్లో గెలిచి, ఏడింట్లో ఓడారు. ఒకటి డ్రాగా ముగిసింది. రోహిత్ శర్మ ఇప్పటివరకూ 18 మ్యాచుల్లో కెప్టెన్గా ఉన్నారు. ఇందులో 12 విజయాలు, 4 అపజయాలు, రెండు డ్రా మ్యాచులు ఉన్నాయి. NZతో జరిగే 3 మ్యాచుల టెస్ట్ సిరీస్ను 3-0తో గెలిస్తే కోహ్లీ రికార్డును హిట్మ్యాన్ బ్రేక్ చేస్తారు.

2019 Octలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో BJP- అప్పటి ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన కూటమి 161 స్థానాలు గెలుచుకుంది. BJP105, శివసేన 56 సీట్లు దక్కించుకున్నాయి. అయితే, ఫలితాల తరువాత తమకూ CM పదవి ఇవ్వాలని శివసేన మెలిక పెట్టింది. దీనికి BJP అంగీకరించలేదు. దీంతో కాంగ్రెస్ (44), ఎన్సీపీ (54)ల మద్దతుతో ఉద్ధవ్ ఠాక్రే CM అయ్యారు. తద్వారా మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ ప్రభుత్వం ఏర్పడింది.

తక్కువ డివైజ్ కాస్ట్, డిజిటల్ కనెక్టివిటీ, డేటా వినియోగ వసతి, డిజిటల్ ఫస్ట్ తమ Digital India నాలుగు స్తంభాలని PM మోదీ పేర్కొన్నారు. World Telecommunication Standardization Assembly-2024 సదస్సును ఆయన ప్రారంభించారు. 120 కోట్ల మొబైల్ ఫోన్ల యూజర్లలో 95 కోట్ల మంది ఇంటర్నెట్ వాడుతున్నారని పేర్కొన్నారు. టెలికాం, టెలికాం సంబంధిత సాంకేతిక వృద్ధిలో భారత్ వేగంగా ముందుకెళ్తోందని మోదీ అన్నారు.

ఉద్ధవ్ ప్రభుత్వం Nov 28, 2019న ఏర్పడింది. కాంగ్రెస్, NCPలు అధికారంలో భాగస్వామ్యం అయ్యాయి. అయితే, జూన్ 29, 2022న, అంటే ఉద్ధవ్ CM పదవి చేపట్టిన 31 నెలలకు BJP రాజకీయ ఎత్తుగడలకు శివసేన, NCP చీలిపోయాయి. 40 మంది MLAలతో ఏక్నాథ్ శిండే వర్గం శివసేన పార్టీని క్లైం చేసుకొని BJP వెంట నడిచింది. దీంతో MVA కూటమి ప్రభుత్వం కూలిపోయింది. BJP అండతో ఏకనాథ్ శిండే CM పదవి దక్కించుకున్నారు.

2019 ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో 81 స్థానాల్లో JMM(30)-కాంగ్రెస్ (16) కూటమి 46 సీట్లు గెలిచి అధికారాన్ని చేపట్టింది. BJP 25 సీట్లు గెలిచింది. JMM నేత హేమంత్ సోరెన్ CM అయ్యారు. అయితే మనీ లాండరింగ్ కేసులో ఈ ఏడాది Jan 31న ED ఆయన్ను అరెస్టు చేయడంతో శిబు సోరెన్ సన్నిహితుడు చంపై సోరెన్ CM అయ్యారు. Jun 28న జైలు నుంచి విడుదలైన హేమంత్ మళ్లీ CM పదవి చేపట్టడంతో చంపై పార్టీని వీడి BJPలో చేరారు.

* MH అసెంబ్లీ సీట్ల సంఖ్య: 288 (జనరల్-234, ST-25, SC-29)
* మొత్తం ఓటర్ల సంఖ్య: 9.63 కోట్లు
* పురుషులు-4.97 కోట్లు, స్త్రీలు: 4.66 కోట్లు
* తొలిసారి ఓటు హక్కు పొందిన వారు: 20.93 లక్షలు
* ఝార్ఖండ్ సీట్ల సంఖ్య: 81 (జనరల్ -44, ST-28, SC-09)
* మొత్తం ఓటర్లు-2.6 కోట్లు
* పురుషులు-1.29 కోట్లు, స్త్రీలు-1.31 కోట్లు
* తొలిసారి ఓటు హక్కు పొందిన వారు: 11.84 లక్షలు

బాలయ్య, బోయపాటి కాంబోలో ‘BB4’ ప్రకటన రావడంతో ట్విటర్లో అఖండ-2 హాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. వీరిద్దరి కాంబినేషన్లో 2021లో విడుదలైన అఖండ మూవీ సెన్సేషనల్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో దాని సీక్వెల్నే వీరు తెరకెక్కించనున్నారని బాలయ్య ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి ‘BB4’గా పిలుస్తున్న ఈ మూవీ ముహూర్తపు షాట్ను రేపు చిత్రీకరించనుండగా.. టైటిల్ను కూడా రేపే అనౌన్స్ చేస్తారని సమాచారం.

AP: 2027లో జమిలి ఎన్నికలు వస్తే కూటమి ప్రభుత్వం మరో మూడేళ్లే అధికారంలో ఉంటుందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి చెప్పారు. TDP నేతల మాటలు వినే అధికారులకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. నూతన మద్యం పాలసీలో అనేక అక్రమాలు జరిగాయని, 90% షాపులు TDP నేతలకే దక్కాయని ఆరోపించారు. ఇసుక, గ్రానైట్, విద్య, వైద్యంలో సిండికేట్ రాజ్యం కొనసాగుతోందని మండిపడ్డారు. దోచుకోవడంలో CM చంద్రబాబు దిట్ట అని దుయ్యబట్టారు.
Sorry, no posts matched your criteria.