News October 31, 2024

టీస్పూన్ కన్నా ఎక్కువ ఉప్పు వాడుతున్నారా?

image

రోజుకు 2gms కన్నా తక్కువ సోడియం తీసుకుంటే పదేళ్లలో 3 లక్షల మరణాలను అడ్డుకోవచ్చని WHO తెలిపింది. ఒక టీస్పూన్ లేదా 5gms కన్నా తక్కువ ఉప్పు తీసుకోవాలని సూచించింది. దీంతో 17 లక్షల హార్ట్ అటాక్స్/స్ట్రోక్స్, 7 లక్షల కిడ్నీ రోగాలను అడ్డుకోవచ్చని వెల్లడించింది. పైగా $80 మిలియన్లను ఆదా చేసుకోవచ్చని తెలిపింది. అధిక, మధ్య ఆదాయ దేశాల్లో పరిమితికి మించి ఉప్పు వాడుతున్నారని వార్నింగ్ ఇచ్చింది. మరి మీరేమంటారు?

News October 31, 2024

‘అమరన్’ సినిమా రివ్యూ

image

భారత ఆర్మీ ఆఫీసర్ మేజర్ ముకుంద్ వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితాన్ని డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియస్వామి తెరపై అద్భుతంగా చూపించారు. ఫ్యామిలీ రిలేషన్స్, దేశభక్తిని బ్యాలెన్స్ చేశారు. డైలాగ్స్, ఎమోషనల్ సీన్స్, మ్యూజిక్, శివకార్తికేయన్ నటన సినిమాకు ప్లస్. మరోసారి సాయిపల్లవి సూపర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అక్కడక్కడా స్టోరీ స్లో అవడం, పెద్దగా ట్విస్టులు లేకపోవడం మైనస్.
RATING: 3/5

News October 31, 2024

IPLలో అసలు ఈరోజు ఏం జరగనుంది?

image

IPL2025 కోసం రిటెన్షన్, రైట్ టు మ్యాచ్ అనే 2 ఆప్షన్లను ఫ్రాంచైజీలు వినియోగించుకోనున్నాయి. అంటే ఇప్పటి వరకు తమ జట్లలో ఉన్న క్రికెటర్లలో గరిష్ఠంగా ఆరుగురిని తమతో ఉంచుకొని మిగిలిన వారిని మెగా వేలంలోకి వదలాల్సి ఉంటుంది. కాగా అన్ని జట్లు ఇప్పటికే తమ లిస్టును ప్రిపేర్ చేసుకున్నాయి. సాయంత్రం 5గంటల్లోపు ఆ లిస్టును ప్రకటించనున్నాయి. దీంతో ఎవరు వేలంలోకి వస్తారు? ఎవరు రిటైన్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది.

News October 31, 2024

‘ఇంతకు మించి’.. చైనా సమస్యపై రాజ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు

image

LAC వద్ద భారత్, చైనా సైనికుల ఉపసంహరణ దాదాపుగా ముగిసిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. డ్రాగన్ కంట్రీతో ‘ఇంతకు మించి’ పరిష్కారాలను కోరుకుంటున్నామని, అందుకు కాస్త సమయం పడుతుందని వెల్లడించారు. అరుణాచల్‌‌లోని తవాంగ్‌లో ఆయన సర్దార్ పటేల్ జయంతి, దీపావళిని సైనికులతో కలిసి జరుపుకున్నారు. మేజర్ బాబ్ ఖాథింగ్ శౌర్య మ్యూజియాన్ని ఆరంభించారు. ఈశాన్య భారతం భద్రతకు ఆయనెంతగానో కృషి చేశారని గుర్తుచేశారు.

News October 31, 2024

భారీ నష్టాలు.. రూ.3లక్షల కోట్లు లాస్!

image

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. దీపావళికి రాకెట్లలా దూసుకుపోతాయనుకుంటే తోకపటాకులా తుస్సుమనడం ఇన్వెస్టర్లను నిరాశపరిచింది. మధ్యాహ్నం ఒంటిగంటకు బీఎస్ఈ సెన్సెక్స్ 523 పాయింట్లు పతనమై 79,420, ఎన్ఎస్ఈ నిఫ్టీ 137 పాయింట్ల నష్టంతో 24,203 వద్ద ట్రేడవుతున్నాయి. దీంతో రూ.3లక్షల కోట్ల సంపద ఆవిరైంది. IT స్టాక్స్ ఘోరంగా క్రాష్ అవుతున్నాయి. TECHM, HCLTECH, INFY, TCS 3%మేర నష్టపోయాయి.

News October 31, 2024

టీజర్ రాకపోయేసరికి.. మెగా ఫ్యాన్స్ నిరాశ

image

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ ‘గేమ్ ఛేంజర్’ మేకర్స్‌పై విమర్శలు వస్తున్నాయి. ఈరోజు మ.12.06గంటలకు టీజర్ రిలీజ్ చేస్తామని ఉదయం చెప్పి తీరా సమయానికి ఇంకాస్త సమయం కావాలని ట్వీట్ చేశారు. దీంతో నిరాశకు గురైన కొందరు ఫ్యాన్స్ ‘గేమ్ ఛేంజర్’ కాదు ‘డేట్ ఛేంజర్’ అని సెటైర్లు వేస్తున్నారు. లేటైనా ఫర్వాలేదు బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలని మరికొందరు కోరుతున్నారు.

News October 31, 2024

ఏ సినిమాకు వెళ్తున్నారు?

image

దీపావళి కానుకగా సినీ ప్రియుల కోసం ఈరోజు పలు సినిమాలు రిలీజయ్యాయి. వాటిల్లో కిరణ్ అబ్బవరం నటించిన ‘క’, దుల్కర్ సల్మాన్ మూవీ ‘లక్కీ భాస్కర్’, శివకార్తికేయన్-సాయిపల్లవి జంటగా నటించిన ‘అమరన్’ సినిమాలకు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. దీంతో చాలామంది ఈ దీపావళికి ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి సినిమాకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. మీరు సినిమాకు వెళ్తున్నారా? దేనికో కామెంట్ చేయండి.

News October 31, 2024

స్వీట్లు పంచుకున్న భారత్-చైనా సైనికులు

image

దేశ సరిహద్దుల్లో భారత్, చైనా జవాన్లు పరస్పరం స్వీట్లు పంచుకున్నారు. LAC వెంట భారత బలగాలు దీపావళి ఉత్సవాలు ఆనందోత్సాహాలతో నిర్వహించుకున్నాయి. కాగా ఎల్ఏసీ వెంబడి గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులకు ఇటీవల ముగింపు పలికిన సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య గస్తీ ఒప్పందం కుదిరింది. దీంతో లద్దాక్‌లోని దెప్సాంగ్, డెమ్‌చోక్ ప్రాంతాల్లో ఇరు దేశాలు బలగాలను ఉపసంహరించుకున్నాయి.

News October 31, 2024

దీపావళి కానుకగా ‘పుష్ప 2’ పోస్టర్ రిలీజ్

image

దీపావళి పండుగ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప 2’ మూవీ నుంచి ఓ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. డిసెంబర్ 5న బిగ్ స్క్రీన్‌లో కలుసుకుందాం అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్టర్‌లో అల్లు అర్జున్, రష్మిక మందన్న పోజ్ ఆకట్టుకుంటోంది. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.

News October 31, 2024

ఇందిరాగాంధీ, పటేల్‌కు CM నివాళులు

image

TG: ఈరోజు భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి, మాజీ ఉప ప్రధాని వల్లభభాయ్ పటేల్‌ జయంతి కావడంతో సీఎం రేవంత్ వారి చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. సీఎంతో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కూడా పాల్గొన్నారు.