India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

హరియాణా ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన బీజేపీ సరికొత్త రికార్డు సృష్టించింది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఆ రాష్ట్రంలో వరుసగా మూడు సార్లు ఏ పార్టీ గెలవలేదు. తాజాగా దాన్ని బీజేపీ సుసాధ్యం చేసింది. ఇంతకుముందు గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గోవా రాష్ట్రాల్లో కమలం హ్యాట్రిక్ నమోదు చేసింది. తాజాగా ఆ లిస్టులో హరియాణా చేరింది.

హరియాణాలో అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించినందుకు ప్రధాని మోదీతో పాటు బీజేపీ నేతలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయం ప్రధాని మోదీ నాయకత్వం, ప్రజా సంక్షేమంపై దృష్టి, ఆయనకున్న ప్రజల మద్దతును మరోసారి చాటి చెప్పిందని అన్నారు. హరియాణా, జమ్మూ&కశ్మీర్ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ నేతలకు విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ముందు ఇండియా ఏ జట్టుతో టీమ్ ఇండియా ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో ఈ మ్యాచ్ జరుగుతుందని సమాచారం. కాగా ఇండియా ఏ జట్టుకు మయాంక్ అగర్వాల్ కెప్టెన్గా ఉన్నారు. జట్టు: మయాంక్ అగర్వాల్, ప్రాతమ్ సింగ్, తిలక్ వర్మ, రియాన్ పరాగ్, శాశ్వత్ రావత్, కుమార్ కుశాగ్ర, షామ్స్ ములానీ, తనుష్ కొఠియాన్, అవేశ్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, అఖీబ్ ఖాన్.

రాత్రిపూట పడుకునే ముందు తప్పనిసరిగా దంతాలు శుభ్రం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. లేదంటే పళ్లు పుచ్చిపోవడం, చిగుళ్ల ఇన్ఫెక్షన్, హార్ట్ ప్రాబ్లమ్స్ లాంటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. నైట్ పళ్లు తోముకుంటే దంతాల మధ్యలో ఇరుక్కున్న ఆహారకణాలు తొలగిపోతాయి. బ్యాక్టీరియాకు చెక్ పడుతుంది. అయితే డిన్నర్ చేసిన వెంటనే కాకుండా కనీసం అరగంట ఆగి బ్రష్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

హరియాణాలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలుస్తుందని అంచనా వేసిన కేకే సర్వే పూర్తిగా విఫలమైంది. హరియాణాలో 90 ఎమ్మెల్యే సీట్లకు గాను కాంగ్రెస్ 75, బీజేపీ 11 సీట్లు గెలుచుకుంటాయని ఎగ్జిట్ పోల్స్లో పేర్కొంది. కానీ వాస్తవ ఫలితాలను చూస్తే బీజేపీ 48, కాంగ్రెస్ 37 చోట్ల గెలిచాయి. కాగా, ఏపీ ఎన్నికల్లో కూటమికి 160 సీట్లు వస్తాయని అంచనా వేసిన కేకే సర్వే అక్షరాలా నిజమైంది.

AP: రూ.23 కోట్ల అగ్గిపెట్టెలు, కొవ్వొత్తుల ప్రచారంపై రెవెన్యూ శాఖ స్పందించింది. రూ.23 లక్షలను రూ.23 కోట్లుగా ఫేక్ ప్రచారం చేస్తున్నారని మండిపడింది. ఎన్టీఆర్ జిల్లాలో వరదల తక్షణ సాయంగా రూ.139.75 కోట్ల అంచనా వేశాం. రూ.89 కోట్లు విడుదల చేసి రూ.79 కోట్ల చెల్లింపులు చేశాం. మరో రూ.10 కోట్ల నిధులు ఇంకా అందుబాటులో ఉన్నాయి. వరద సాయంపై ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దు’ అని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్కి ప్రస్తుతం దక్షిణాదిన అత్యంత డిమాండ్ నెలకొంది. రజినీకాంత్ నుంచి అల్లు అర్జున్ వరకూ స్టార్ హీరోల మూవీల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘పుష్ప’కు ఆయన రూ.3 కోట్ల వరకూ రెమ్యునరేషన్ తీసుకోగా, పుష్ప-2కి ఏకంగా రూ.7.2 కోట్ల వరకూ తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ డిసెంబరు 6న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ఫస్ట్ హాఫ్కు ఎడిటింగ్ పూర్తి చేసి లాక్ చేసినట్లు మూవీ టీమ్ అనౌన్స్ చేసింది.

AP: ఐపీఎస్ పీవీ సునీల్కుమార్పై రాష్ట్ర ప్రభుత్వం వేటు వేసింది. సాధారణ పరిపాలనశాఖ, అఖిల భారత సర్వీసు నిబంధనలు 1969 ఉల్లంఘించినందుకు క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ జీవో ఆర్టీ నంబర్ 1695 జారీ చేసింది. ప్రస్తుతం ప్రభుత్వ వెబ్సైట్లో కాన్ఫిడెన్షియల్ కింద ఉత్తర్వులు అప్లోడ్ అయినట్లు సమాచారం. గత ప్రభుత్వంలో CID చీఫ్గా పనిచేసిన సునీల్పై MLA RRR ఫిర్యాదు చేయడంతో పోలీసులు <<14296857>>కేసు<<>> నమోదు చేశారు.

హరియాణాలో BJP, కాంగ్రెస్ మధ్య ఓట్ల వ్యత్యాసం కేవలం 0.85% మాత్రమే కావడం గమనార్హం. BJP 48 స్థానాల్లో గెలుపొంది 39.94% ఓట్లు సాధించింది. అయితే, 37 స్థానాల్లో గెలుపొందిన కాంగ్రెస్ 39.09% ఓట్లు సాధించింది. కేవలం 0.85% ఓట్ల వ్యత్యాసంతో BJP కంటే 11 స్థానాలు వెనుకబడిపోయింది. INLD, ఆప్, BSP, JJPలు 7.75% ఓట్లు, ఇతరులు 11% ఓట్లు చీల్చారు. దీంతో రెబల్స్, చిన్న పార్టీలు కాంగ్రెస్ కొంపముంచాయి.

TG: HYDలోని ట్యాంక్ బండ్పై 10,000 మంది మహిళలతో ఈనెల 10న సద్దుల బతుకమ్మ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు సీఎస్ శాంతి కుమారి తెలిపారు. వేడుకల ఏర్పాట్లపై అధికారులతో ఆమె సమీక్షించారు. ఈనెల 10న సా.4కు అమరవీరుల స్మారక కేంద్రం నుండి మహిళలు బతుకమ్మలతో ఊరేగింపుగా ట్యాంక్ బండ్కు చేరుకుంటారని తెలిపారు. బుద్ధ విగ్రహం, సంజీవయ్య పార్క్ నుంచి ప్రత్యేకంగా ఫైర్ వర్క్స్, లేజర్ షో ప్రదర్శన ఉంటుందని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.