News November 8, 2024

సరిహద్దుల్లో వాళ్లు సైన్యంతో కలిసి పనిచేస్తారు

image

ఆత్మరక్షణ కోసం ఆ గ్రామాల ప్రజలు తుపాకీ చేతపట్టారు. 1990లో JKలోని దేశ సరిహద్దు గ్రామాల్లోని స్థానికులు, హిందువులు, దుర్భర పరిస్థితుల్లో ఉన్న ముస్లింలు తీవ్రవాదం నుంచి రక్షణ పొందేందుకు విలేజ్ డిఫెన్స్ గార్డుల వ్యవస్థ ఏర్పాటైంది. VDGలు స్థానిక పోలీసులు, బలగాలతో కలిసి పనిచేస్తారు. పాక్ సరిహద్దుల నుంచి చొరబడే ఉగ్రవాదులను ఎదుర్కోవడానికి వీరికి ప్రత్యేకంగా ఆయుధాల వినియోగం, గూఢచర్యంపై శిక్షణ ఇస్తారు.

News November 8, 2024

చదువుకున్న వాళ్లు కమలకు.. మిగిలిన వారు ట్రంప్‌నకు ఓటేశారు

image

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ఓట‌ర్లు విద్యార్హ‌త‌ల ఆధారంగా విడిపోయిన‌ట్టు యాక్సియోస్ నివేదిక అంచ‌నా వేసింది. కాలేజీ గ్రాడ్యుయేట్లు అత్య‌ధికంగా ఉన్న రాష్ట్రాలు క‌మ‌ల వైపు నిలిస్తే, డిగ్రీ లేని వారు అత్య‌ధికంగా ఉన్న రాష్ట్రాలు ట్రంప్‌న‌కు జైకొట్టాయి. మొత్తం గ్రాడ్యుయేట్ ఓట‌ర్ల‌లో 55% మంది క‌మ‌ల‌కు, గ్రాడ్యుయేష‌న్ లేనివారిలో 55% మంది ట్రంప్‌న‌కు ఓటేసిన‌ట్టు నివేదిక వెల్ల‌డించింది.

News November 8, 2024

మా సినిమా ట్రైలర్ లాక్ అయింది: పుష్ప టీమ్

image

పుష్ప-2 సినిమా విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆ మూవీ టీమ్ ప్రమోషన్స్ జోరు పెంచింది. రిలీజ్ ట్రైలర్‌ను లాక్ చేసినట్లు ప్రకటించింది. ‘ఎదురుచూపులు ముగిశాయి. ది రూల్ టేక్స్ ఓవర్. త్వరలో ట్రైలర్ అనౌన్స్‌మెట్’ అని ట్వీట్ చేసింది. వచ్చే నెల 5న పుష్ప: ది రూల్ విడుదల కానున్న సంగతి తెలిసిందే. సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది.

News November 8, 2024

రంజీల్లో ఆడటం వృథానేనా?: హర్భజన్

image

రంజీల్లో 6000 రన్స్, 400 వికెట్స్ తీసిన తొలి క్రికెటర్‌గా కేరళ ప్లేయర్ జలజ్ సక్సేనా చరిత్ర సృష్టించారు. అయితే దేశవాళీ టోర్నీల్లో అద్భుతంగా రాణిస్తున్నా అతడిని జాతీయ జట్టుకు ఎంపిక చేయట్లేదని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. దీనిపై స్పందించిన మాజీ క్రికెటర్ హర్భజన్ ‘అతడిని ఇండియా-Aకైనా ఎంపిక చేయాల్సింది. రంజీల్లో ఆడటం వృథానేనా? ప్లేయర్లు IPL నుంచే ఎంపికవుతున్నారు’ అని అసంతృప్తి వ్యక్తం చేశారు.

News November 8, 2024

ఏ వయసులో స్మోకింగ్ మానేసినా ప్రయోజనాలుంటాయ్

image

దశాబ్దాల పాటు స్మోకింగ్ చేసి లేటు వయసులో మానేయడం వల్ల ఉపయోగం లేదనే కొందరి వాదన తప్పు అని నిపుణులు చెబుతున్నారు. ఎంత పొగతాగేవారైనా, ఏ వయసులోనైనా దాన్ని వదిలేస్తే ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చంటున్నారు. ‘1-2ఏళ్లు మానేస్తే గుండె వ్యాధులు, 5-10ఏళ్ల తర్వాత క్యాన్సర్ ముప్పు సగానికి తగ్గుతుంది. రోగనిరోధక వ్యవస్థ, ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. శ్వాసకోశ వ్యాధులు దూరమవుతాయి’ అని పేర్కొంటున్నారు.

News November 8, 2024

నా పోరాటం కొనసాగిస్తా: కేఏ పాల్‌

image

AP: తిరుమలను <<14559672>>కేంద్ర పాలిత ప్రాంతం<<>> చేయాలంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. దీనిపై KA పాల్ స్పందించారు. ‘తిరుమల వ్యవహారంపై నా పోరాటం ఆపను. మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తా. తిరుమలలో గొడవలు ఆగాలంటే కేంద్రం పాలిత ప్రాంతం చేయాల్సిందే. నా పిటిషన్‌ను విచారించిన ధర్మాసనానికి కృతజ్ఞతలు’ అని ఆయన వ్యాఖ్యానించారు.

News November 8, 2024

‘పుష్ప-2’: స్పెషల్ సాంగ్‌లో శ్రీలీలతో పాటు మరో బ్యూటీ!

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తోన్న ‘పుష్ప-2’ సినిమాలోని స్పెషల్ సాంగ్ చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల ఈ సాంగ్‌లో నటిస్తున్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. అయితే, సమంత సైతం అతిథిగా సాంగ్‌లో కనిపించాల్సి ఉందని, కానీ ఆమె ప్లేస్‌లో ఓ బాలీవుడ్ నటికి ఛాన్స్ వచ్చిందని వెల్లడించాయి. కాగా సాంగ్ షూట్‌తో సినిమా షూటింగ్ పూర్తికానుండగా DEC 5న మూవీ విడుదల కానుంది.

News November 8, 2024

మ్యూజిక్ డైరెక్టర్ స్థలం కబ్జా: ప్రభుత్వం స్వాధీనం

image

TG: సంగీత దర్శకుడు చక్రవర్తికి ఎన్టీఆర్ హయాంలో హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నం.14లో 20 గుంటల స్థలం కేటాయించారు. ఈ స్థలంలో చక్రవర్తి ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. ఆయన కుమారుడు కూడా ఈ స్థలాన్ని గాలికొదిలేశారు. దీంతో 40 ఏళ్లుగా ఖాళీగా ఉంటున్న రూ.65 కోట్ల విలువ చేసే ఈ స్థలాన్ని కొంతమంది కబ్జా చేశారు. విషయం తెలుసుకున్న షేక్ పేట్ రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాలను తొలగించి స్వాధీనం చేసుకున్నారు.

News November 8, 2024

అందుకే కేటీఆర్‌ను అరెస్ట్ చేయట్లేదు: బండి

image

TG: కేటీఆర్‌తో కుదిరిన ఒప్పందం‌తోనే ఆయనను రేవంత్ ప్రభుత్వం అరెస్ట్ చేయడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. CM పాదయాత్ర చేయాల్సింది మూసీ నది పక్కన కాదని ఇళ్లు కూల్చిన ప్రాంతంలో అని ఎద్దేవా చేశారు. BJPకి స్పేస్ లేకుండా కాంగ్రెస్, BRS డైవర్షన్, కాంప్రమైజ్ పాలిటిక్స్ చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు కేసులపై హంగామా చేశారన్నారు. ఇప్పుడు ఎలాంటి చప్పుడు లేదన్నారు.

News November 8, 2024

సమోసాల మిస్సింగ్‌పై నో ఎంక్వైరీ: CID

image

హిమాచల్ ప్రదేశ్ CID ఆఫీసులో సమోసాలు మిస్ అవ్వడంపై అధికారికంగా ఎలాంటి విచారణకు ఆదేశించలేదని DG సంజీవ్ రంజన్ తెలిపారు. CM సుఖ్వీందర్ సింగ్ పాల్గొన్న సమావేశంలో అతిథుల కోసం తెప్పించిన స్నాక్స్ ప్యాకెట్లు కనిపించకపోవడంతో అధికారులు వాటి కోసం వెతికారని వెల్లడించారు. ఇదో సామాన్యమైన అంతర్గత విషయమన్నారు. బాక్సులను వెతికేందుకు కేవలం అప్పీల్ చేశామన్నారు. దీన్ని రాజకీయం చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు.