India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: కార్తీకమాసంలో దర్శించుకోవాల్సిన ప్రసిద్ధ శైవక్షేత్రాల్లో కడప(D) చిట్వేల్(M)లోని గుండాలకోన ఒకటి. విశ్వామిత్రుడు ఇక్కడ గుండాలేశ్వరస్వామిని ప్రతిష్ఠించినట్లు స్థల పురాణం. గుహలో ఎండ్రకాయ రూపంలో ఈశ్వరుడు దర్శనమిస్తాడు. ఇక్కడి గుండంలో మునిగి దేవుణ్ని దర్శించుకుంటే సర్వపాపాలు పోతాయని, సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. గుండాలకోన వెళ్లాలంటే వ్యయప్రయాసలకోర్చి 9కి.మీ అడవి బాటలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది.

‘క’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న హీరో కిరణ్ అబ్బవరం, దర్శకులు సుజిత్-సందీప్ను మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ కిరణ్ ట్వీట్ చేశారు. ‘బాస్ నుంచి అభినందనలు. గంటకుపైగా గుర్తుండిపోయే సంభాషణకు అవకాశమిచ్చిన మీకు ధన్యవాదాలు. మిమ్మల్ని కలిసిన ప్రతిసారి ఓ ఆశీర్వాదంగా భావిస్తాను’ అని రాసుకొచ్చారు. ఇటీవల ‘లక్కీ భాస్కర్’ డైరెక్టర్ వెంకీని కూడా చిరు అభినందించిన సంగతి తెలిసిందే.

కేంద్రం అమలు చేస్తోన్న ‘పీఎం ఇంటర్న్షిప్’ స్కీమ్కు రిజిస్ట్రేషన్ గడువు నేటితో ముగియనుంది. <

TG: 317 G.O. వల్ల స్థానికత కోల్పోయిన తమను వెంటనే సొంత జిల్లాలకు కేటాయించాలని ఉపాధ్యాయులు, ఉద్యోగులు కోరుతున్నారు. మంత్రివర్గ సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్టును బహిర్గతం చేయాలన్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో తాము అధికారంలోకి రాగానే 317 G.O. వల్ల స్థానికత కోల్పోయిన వారిని 48 గంటల్లోనే సొంత జిల్లాలకు పంపిస్తామని ఇచ్చిన హామీని సీఎం రేవంత్ నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు.

AP: వచ్చే నెలలో ఎర్ర చందనం వేలం వేస్తామని dy.CM పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆసక్తి ఉన్నవారు వేలంలో పాల్గొనవచ్చని చెప్పారు. గుంటూరులో పవన్ మీడియాతో మాట్లాడారు. ‘స్మగ్లర్ల బారి నుంచి అడవులను రక్షిస్తాం. ఈ విషయంలో అటవీ అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తాం. అటవీ శాఖకు నా సంపూర్ణ మద్దతు ఉంటుంది. అలాగే రాష్ట్రంలో మహిళల సంరక్షణే మా మొదటి బాధ్యత. విద్యార్థినులకు మార్షల్ ఆర్ట్స్ నేర్పుతాం’ అని ఆయన పేర్కొన్నారు.

కోల్ ఇండియా లిమిటెడ్(CIL)లో 640 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు ఈ నెల 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మైనింగ్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, E&T, సిస్టమ్ విభాగాల్లో 60% మార్కులతో బీటెక్ పాసైన వారు అర్హులు. వయసు 30-09-2024 నాటికి 30ఏళ్లు మించకూడదు. గేట్-2024 స్కోర్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జీతం ₹50,000-1,60,000 ఉంటుంది. పూర్తి వివరాల కోసం <
వెబ్సైట్: www.coalindia.in

పాలమూరు జిల్లాకు నిధుల వరద పారిస్తామని CM రేవంత్ తెలిపారు. ‘నా జిల్లాను అభివృద్ధి చేయకపోతే చరిత్ర క్షమించదు. KCRను పార్లమెంట్కు పంపింది ఇక్కడి ప్రజలే. కానీ ఇక్కడి ప్రాజెక్టులకు నిధులిస్తుంటే కొందరు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు. మీ నియోజకవర్గాలు అభివృద్ధి చేస్తుంటే మేం అడ్డుపడలేదు. KCR పాలనలో పాలమూరుకు పరిశ్రమలు రాలేదు. త్వరలో మక్తల్-NRPT ప్రాజెక్టు చేపడతాం’ అని అమ్మాపురం సభలో ప్రకటించారు.

బంగ్లాదేశ్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. షేక్ హసీనా రీఎంట్రీకి రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ట్రంప్తో ఆమెకు సయోధ్య ఉండగా యూనస్కు విరోధం ఉంది. పైగా అతడిని చీఫ్ అడ్వైజర్గా ఎంపికచేసింది డెమోక్రాట్లు, డీప్స్టేట్ అన్న ఆరోపణలూ ఉన్నాయి. మొన్న బంగ్లా ఆర్మీ చీఫ్ భారత్కు రావడం, యూనస్పై ICCలో ఫిర్యాదు, మైనార్టీలు, అవామీ లీగ్-విద్యార్థి ఉద్యమకారుల మధ్య పోటీ నిరసనలతో సందిగ్ధం నెలకొంది.

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ మహ్మద్ యూనస్పై ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు (ICC)లో అవామీ లీగ్ ఫిర్యాదు చేసింది. ఆయనతో పాటు క్యాబినెట్ మెంబర్స్, ADA స్టూడెంట్ లీడర్లు సహా 62 మంది పేర్లను చేర్చింది. షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయాక తమ పార్టీ వర్కర్స్, హిందువులు సహా మైనార్టీలపై నరమేధం జరిగిందని పేర్కొంది. సాక్ష్యాలుగా 800 పేజీల డాక్యుమెంట్ను సబ్మిట్ చేసింది. మరో 15000 ఫిర్యాదులకు సిద్ధమవుతోంది.

పాకిస్థాన్తో జరుగుతున్న 3 వన్డేల సిరీస్లో ఆస్ట్రేలియా చెత్త రికార్డు మూటగట్టుకుంది. ఈ సిరీస్లో ఆసీస్ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా అర్ధ సెంచరీ చేయలేకపోయారు. 53 ఏళ్ల వన్డే చరిత్రలో ఆస్ట్రేలియా ప్లేయర్లు ఇలాంటి పేలవ ప్రదర్శన చేయడం ఇదే తొలిసారి. ఆసీస్ బ్యాటర్లు ఘోరంగా విఫలమవ్వడంతో సిరీస్ కోల్పోయే ప్రమాదంలో పడింది.
Sorry, no posts matched your criteria.