India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సన్ రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ ఎంచుకుంది.
MI: రోహిత్శర్మ, ఇషాన్కిషన్, తిలక్వర్మ, హార్దిక్ పాండ్య(C), టిమ్ డేవిడ్, నమన్ ధీర్, కోయెట్జీ, బుమ్రా, పీయూష్ చావ్లా, ములానీ, క్వేనా మఫాకా.
SRH: ట్రావిస్ హెడ్, మయాంక్ అగర్వాల్, అభిషేక్శర్మ, మార్క్రమ్, క్లాసెన్, సమద్, షాబాజ్ అహ్మద్, కమిన్స్ (C), భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉనద్కత్.
AP: మాజీ మంత్రి వివేకానంద మరణంపై CM జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మా వివేకం చిన్నాన్నను ఎవరు చంపారో ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసు. కానీ బురద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో? వారి వెనకాల ఎవరు ఉన్నారో మీ అందరికీ రోజూ కనిపిస్తూనే ఉంది. చిన్నాన్నను అతిదారుణంగా చంపిన హంతకుడికి మద్దతు ఇస్తున్నారు. వాడిని చంద్రబాబు, అతడి ఎల్లో మీడియా నెత్తిన పెట్టుకుంటున్నాయి’ అని ఆరోపించారు.
కెనడాలోని డా.కుల్వీందర్ కౌర్ గిల్ అనే భారత సంతతి వైద్యురాలికి X (ట్విటర్) అండగా నిలిచింది. ప్రభుత్వంపై ఆమె పోరాడుతున్న కేసుకు సంబంధించిన ఫీజు $3,00,000ను (రూ.2.4కోట్లు) తామే భరించనున్నట్లు ప్రకటించింది. కాగా గతంలో ప్రభుత్వం లాక్డౌన్ విధించడాన్ని తప్పుపడుతూ కుల్వీందర్ ట్విటర్లో పోస్టులు చేశారు. తాజాగా ఫీజు చెల్లించేందుకు ఆమె క్రౌడ్ ఫండింగ్కు పిలుపునివ్వగా మస్క్ ఇందుకు సానుకూలంగా స్పందించారు.
లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. మనీలాండరింగ్ ఆరోపణలతో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న ఆయన.. ఈడీ రిమాండ్ను సవాల్ చేస్తూ, మధ్యంతర బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వీటిపై విచారణ చేసిన హైకోర్టు బెయిల్ ఇవ్వలేదు. పిటిషన్పై తదుపరి విచారణను ఏప్రిల్ 3కు వాయిదా వేసింది. ఏప్రిల్ 2లోగా కౌంటర్ దాఖలు చేయాలని EDని ఆదేశించింది.
ఒకప్పుడు తనకు వరుస పరాజయాలు ఎదురై నిద్రలేని రాత్రులు గడిపినట్లు బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ తెలిపారు. తాను నటించిన ‘క్రూ’ సినిమా ప్రమోషన్లలో ఆమె మాట్లాడారు. ‘పాతికేళ్ల నా కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశా. నా సినిమాలు వరుసపెట్టి ఫ్లాప్ అయ్యేవి. హిట్స్ కంటే డిజాస్టర్స్తో అందరికీ తెలిసిపోయా. నాకే ఎందుకు ఇలా జరుగుతుందని బాధపడేదాన్ని. నేను కాబట్టి తట్టుకోగలిగాను’ అని ఆమె తెలిపారు.
AP: ఏప్రిల్, మే నెలల పింఛన్ల పంపిణీ నేపథ్యంలో వాలంటీర్లకు సెర్ప్ కీలక ఆదేశాలిచ్చింది. ఎన్నికల కోడ్ దృష్ట్యా బ్యాంకుల నుంచి నగదు తీసుకెళ్లే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తప్పనిసరిగా ఆథరైజేషన్ సర్టిఫికెట్ తీసుకోవాలని చెప్పింది. పంపిణీ సమయంలో ఎన్నికల ప్రచారం చేయొద్దని.. ఫొటోలు, వీడియోలు తీయొద్దని హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని సెర్ప్ స్పష్టం చేసింది.
TG: రాష్ట్రంలో ఇవాళ ఎండలు దంచికొట్టాయి. భానుడి భగభగతో పలు ప్రాంతాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా ఎండల తీవ్రత పెరగడంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. మరోవైపు పగటి పూట ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
లోక్సభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్ సీఈసీ సమావేశం ప్రారంభమైంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, భట్టి, ఉత్తమ్ హాజరయ్యారు. దేశ వ్యాప్తంగా 25 ఎంపీ స్థానాల అభ్యర్థుల ఖరారుపై ఇందులో చర్చించనున్నారు. భేటీ అనంతరం కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది.
NDAను పడగొట్టడమే లక్ష్యంగా ఏర్పడిన ఇండియా కూటమికి సీట్ల పంపకం తలనొప్పిగా మారింది. తాజాగా మహారాష్ట్రలో శివసేన (UBT), కాంగ్రెస్ మధ్య రచ్చ మొదలైంది. శివసేన 17 స్థానాల అభ్యర్థులను ప్రకటించుకోవడమే ఇందుకు కారణం. 48 స్థానాల్లో తాము 22 చోట్ల పోటీ చేస్తామని తేల్చి చెప్పింది. దీంతో పలువురు కాంగ్రెస్ నేతలు అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. పొత్తు ధర్మానికి విరుద్ధంగా శివసేన నడుచుకుంటోందని విమర్శిస్తున్నారు.
TG: మహబూబ్నగర్ స్థానిక సంస్థల MLC ఉపఎన్నిక రేపు జరగనుంది. మొత్తం 10 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న ZPTC, MPTC సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎక్స్ అఫీషియో మెంబర్ల(14 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్సీలు)తో కలిపి 1,439 మంది ఓటర్లు ఉన్నారు. దీంతో ఉమ్మడి మహబూబ్నగర్కు చెందిన CM రేవంత్ కూడా ఓటు వేయనున్నారు. ఉ.8 గంటల నుంచి సా.4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
Sorry, no posts matched your criteria.