India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పొలంలో పాము కాటుకు గురైన వ్యక్తి ఆస్పత్రికి వెళ్లడం లేటవడంతో ఓ వ్యక్తి మరణించాడు. బిహార్లోని కైమూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. రామ్ లఖన్ ప్రసాద్ అనే వ్యక్తిని పాము కాటేయడంతో ఆస్పత్రికి పరిగెత్తాడు. మద్యం తాగి పరిగెడుతున్నాడని అనుమానించి పోలీసులు అడ్డుకున్నారు. పాము కాటు గురించి చెప్పినా నమ్మలేదు. వదిలేయాలంటే రూ.2వేలు లంచం అడగ్గా అతని సోదరుడు రూ.700 ఇచ్చి తీసుకెళ్లాడు. లేట్ అవడంతో రామ్ చనిపోయాడు.

దేశవ్యాప్తంగా 4G నెట్వర్క్ను విస్తరిస్తున్న BSNL కస్టమర్లను ఆకర్షించేందుకు తక్కువ ధరతో కొత్త ప్లాన్లను తీసుకొస్తోంది. తాజాగా 60 రోజుల వ్యాలిడిటీతో రూ.345 ప్రీప్రెయిడ్ ప్లాన్ను ప్రవేశపెట్టింది. ఇందులో అపరిమిత కాలింగ్, రోజూ 1GB డేటా, 100 SMSలు ఉంటాయి. డేటా లిమిట్ పూర్తయ్యాక నెట్ స్పీడ్ 40Kbpsకు తగ్గుతుంది. ఇలాంటి ప్లాన్ జియో, ఎయిర్టెల్, Viలో లేదు.

AP: సనాతన ధర్మం పేరుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డ్రామాలు చేస్తున్నారని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శించారు. ‘భార్యకు విడాకులు ఇవ్వకుండానే ఇంకొకరితో కలిసి ఉండమని ఏ ధర్మంలో ఉంది? చేగువేరా ఆదర్శాలు ఎటు వెళ్లిపోయాయి? బాప్టిజం తీసుకున్నానని ఆయన చెప్పారు. అలాగే తన భార్య క్రిస్టియన్, పిల్లలు ఆర్థోడాక్స్ క్రిస్టియన్స్ అని తెలిపారు. ఇవన్నీ ఏ సనాతన ధర్మంలో ఉన్నాయో చెప్పాలి?’ అని ప్రశ్నించారు.

సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమించిన వారు రైతులు కాదంటూ కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్ వ్యాఖ్యానించారు. పంజాబ్కు చెందిన కొందరు రైతుల ముసుగులో కేంద్రం, హరియాణా ప్రభుత్వాలను పడగొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారని పేర్కొన్నారు. ఆ మారువేషంలో ఉన్న వ్యక్తులు ట్రాక్టర్లతో రాజధానికి చేరుకొని ఎర్రకోటపై దాడి చేశారని, వారంతా రైతులు కాదని కట్టర్ పేర్కొన్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తన గాత్రంతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. చాలా రోజుల తర్వాత పవన్ ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. అయితే, ఈ సినిమాలో ఒక ఇంట్రెస్టింగ్ సందర్భంలో ఆయనతో పాట పాడించేందుకు కీరవాణి డిసైడ్ అయినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. దర్శకుడు జ్యోతి కృష్ణ కూడా దీనికి ఓకే చెప్పినట్లు టాక్. దీనిపై మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

హెజ్బొల్లా చీఫ్ నస్రుల్లా మృతితో ఇరాన్ జాగ్రత్తపడుతోంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని కట్టుదిట్టమైన భద్రత మధ్య సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు తెలుస్తోంది. నస్రుల్లా మృతిపై ఇరాన్ సెక్యూరిటీ కౌన్సిల్తో ఖమేనీ సమావేశమైనట్టు The New York Times తెలిపింది. అలాగే తదుపరి క్యాచరణపై హెజ్బొల్లా, ప్రాంతీయ గ్రూప్లతో ఇరాన్ చర్చలు జరుపుతున్నట్టు కథనాలు వస్తున్నాయి.

విదేశీ చొరబాటుదారులను ఓటు బ్యాంకుగా స్వాగతిస్తూ సొంత పౌరులను అపహాస్యం చేసే అర్బన్ నక్సల్స్ నియంత్రణలో కాంగ్రెస్ పార్టీ ఉందని PM మోదీ విమర్శించారు. జమ్మూ ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నడూ జవాన్ల త్యాగాలను గౌరవించలేదని ఆరోపించారు. ఈరోజు JKలో జరుగుతున్న మార్పులతో కాంగ్రెస్-NC, PDPలు రెచ్చిపోతున్నాయని, ఇక్కడి ప్రజల అభివృద్ధి వారికి నచ్చడం లేదని దుయ్యబట్టారు.

IPL 18 సీజన్ మెగా వేలానికి ముందు BCCI మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒక్కో ఫ్రాంచైజీ కి 5 రిటెన్షన్లతోపాటు ఒక రైట్ టు మ్యాచ్ (RTM)కు అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఫ్రాంచైజీల నుంచి వస్తున్న ఒత్తిడి మేరకే BCCI ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు తెలుస్తోంది. IPL 2025 మెగావేలం ఈ ఏడాది చివర్లో యూఏఈలో జరగనుందని సమాచారం.

ఇజ్రాయెల్కు కంటిమీద కునుకు లేకుండా చేసిన హెజ్బొల్లా చీఫ్ <<14217449>>నస్రుల్లా<<>> Middle Eastలో తిరుగులేని శక్తిగా ఎదిగాడు. 16 ఏళ్ల వయసులో అప్పటి చీఫ్ అబ్బాస్ అల్-ముసావి దృష్టిని ఆకర్షించాడు నస్రుల్లా. 1992లో ముసావి మరణానంతరం హెజ్బొల్లాకు నాయకత్వం వహించాడు. ఎవరూ ఊహించని రీతిలో దాన్ని పటిష్ఠ పరిచాడు. 1997లో ఇజ్రాయెల్ బలగాల చేతిలో కుమారుడిని కోల్పోయిన నస్రుల్లా హెజ్బొల్లాను సాయుధ, రాజకీయ శక్తిగా మలిచాడు.

తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వేళ దీనిపై మాట్లాడేందుకు రజనీకాంత్ నిరాకరించారు. చెన్నై ఎయిర్పోర్టులో కనిపించిన ఆయనను ఈ అంశంపై స్పందించాలని ఓ రిపోర్టర్ కోరారు. అయితే రజనీ ‘సారీ.. నో కామెంట్స్’ అని చెప్పి వెళ్లిపోయారు. ఇటీవల హీరో కార్తీ లడ్డూ అంశం సెన్సిటివ్ టాపిక్ అని, మాట్లాడొద్దని చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ విమర్శలు చేయడంతో ఆయన సారీ చెప్పారు.
Sorry, no posts matched your criteria.