News September 27, 2024

YCPలో వివిధ హోదాల్లో నాయకులను నియమించిన YS జగన్

image

☞ కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కురసాల కన్నబాబు
☞ అంబేడ్కర్ కోనసీమ అధ్యక్షుడిగా పినిపే విశ్వరూప్
☞ జగ్గయ్యపేట అసెంబ్లీ సమన్వయకర్తగా తన్నీరు నాగేశ్వరరావు
☞ విజయవాడ వెస్ట్ సమన్వయకర్తగా వెల్లంపల్లి శ్రీనివాసరావు
☞ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్తగా మల్లాది విష్ణు
☞ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మార్గాని భరత్ రామ్

News September 27, 2024

అభివృద్ధి పనులు పండుగలా మొదలుపెట్టాలి: డిప్యూటీ సీఎం

image

AP:ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు పండుగలా మొదలుపెట్టాలని డిప్యూటీ CM పవన్ ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై అధికారులతో ఆయన సమీక్షించారు. ‘అక్టోబర్ 14 నుంచి 20వ తేదీ వరకూ ప్రతి పల్లెలో పనులకు శ్రీకారం చుట్టాలి. స్థానిక MLAలు, MPలు, MLCలను ఇందులో భాగస్వామ్యం చేయాలి. 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టే పనులకు సంబంధించి 13,326 గ్రామాల్లో గ్రామసభలు పెట్టి తీర్మానాలు చేశారు’ అని తెలిపారు.

News September 27, 2024

ఇది నా బెస్ట్ ఫిల్మ్ అంటున్నారు: కొరటాల

image

ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘దేవర’ చిత్రం తన కెరీర్‌లో బెస్ట్ ఫిల్మ్ అని అభిమానులు అంటున్నారని దర్శకుడు కొరటాల శివ చెప్పారు. ప్రతి ఒక్కరి కష్టమే ఈ ఫలితమని మూవీ సక్సెస్ మీట్‌లో తెలిపారు. ఎవరి పనులు వారిని చేసుకోనిస్తే ఇలాంటి సక్సెస్‌లు వస్తాయని పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి అన్నారు. ఈ సినిమాకు త్వరలోనే విజయోత్సవ సభ ఉంటుందని పేర్కొన్నారు.

News September 27, 2024

ALERT: రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. రేపు APలోని అల్లూరి, ఏలూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వానలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని APSDMA వెల్లడించింది. అటు TGలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, వరంగల్ జిల్లాల్లో వానలు పడతాయని HYD వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News September 27, 2024

DEVARA: రెమ్యునరేషన్ ఎవరికెంతంటే?

image

ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ మూవీ థియేటర్లలో రిలీజైంది. ప్రస్తుతం ఈ సినిమాకు ఎవరెంత రెమ్యునరేషన్ తీసుకున్నారనేది చర్చగా మారింది. ఎన్టీఆర్ ఈ సినిమాకు రూ.60 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ కొరటాల శివ రూ.30 కోట్లు, సైఫ్ అలీఖాన్ రూ.10 కోట్లు, జాన్వీ కపూర్ రూ.5 కోట్లు, ప్రకాశ్ రాజ్ రూ.1.5 కోట్లు, శ్రీకాంత్ రూ.50 లక్షలు, మురళీ శర్మ రూ.40 లక్షలు తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

News September 27, 2024

పసిఫిక్‌లో చైనా నౌక.. జపాన్ ఆందోళన

image

చైనాకు చెందిన యుద్ధవిమాన వాహక నౌక ‘లావోనింగ్’ గత ఏడు రోజులుగా పసిఫిక్ మహాసముద్రంలో కనిపిస్తోందని జపాన్ రక్షణ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ నౌకకు అండగా మరిన్ని చైనా నౌకలు వెంట వెళ్తున్నాయని పేర్కొంది. తమకు చెందిన ఒకినొటోరీ దీవికి సుమారు 1,020 కిలోమీటర్ల దూరంలో ఆ నౌకలతో చైనా విన్యాసాలు చేయిస్తోందని ఆరోపించింది. భారత్, జపాన్, ఫిలిప్పీన్స్ సహా పలు ఆసియా దేశాలతో చైనాకు వివాదాలున్న సంగతి తెలిసిందే.

News September 27, 2024

మూసీ బఫర్ జోన్ నిర్వాసితులకు పునరావాసం, పరిహారం: దానకిశోర్

image

TG: మూసీ రివర్ బెడ్ నిర్వాసితుల ఆందోళనల నేపథ్యంలో మూసీ రివర్ ఫ్రంట్ ఎండీ దానకిశోర్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే మూసీ బఫర్‌జోన్‌లో నిర్మాణాలపై సర్వే చేస్తామని, అక్కడ పట్టాలున్న కుటుంబాలకు పునరావాసం, పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. నదీ గర్భంలో పట్టాలున్న వారు జిల్లా కలెక్టర్లను కలవాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లోని విద్యార్థులు విద్యాసంవత్సరం నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

News September 27, 2024

లెబనాన్‌పై భీకర దాడికి సిద్ధమవుతున్న ఇజ్రాయెల్!

image

లెబనాన్ భూభాగంలోకి చొచ్చుకుపోవడానికి ఇజ్రాయెల్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్ ఉత్తర సరిహద్దులో భారీగా సాయుధ వాహనాలను మోహరించింది. హెజ్బొల్లా దాడులు కొన‌సాగితే లెబ‌నాన్‌ కూడా గాజా ప‌రిస్థితే ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని ఇజ్రాయెల్ హెచ్చ‌రించింది. ‘హెజ్బొల్లాపై గగనతలం, సముద్రం నుంచి దాడి చేశాం. ఇప్పుడు భూదాడికి సిద్ధం కండి’ అని సైన్యానికి రక్షణ మంత్రి యోవ్ పిలుపునిచ్చారు.

News September 27, 2024

‘ఆమెను ప్రేమించాను.. కానీ ఆమె న‌న్ను బెదిరించింది’

image

బెంగ‌ళూరులో మ‌హిళ‌ను ముక్క‌లుగా న‌రికి హ‌త్య చేసిన కేసులో నిందితుడు రంజ‌న్ ఆత్మ‌హ‌త్య చేసుకొనే ముందు తన త‌ల్లితో నేరం గురించి చెప్పిన‌ట్టు తెలిసింది. మ‌హాల‌క్ష్మిని ప్రేమించాన‌ని, అయితే ఆమె త‌న‌ను కిడ్నాప్ కేసులో ఇరికిస్తాన‌ని బెదిరించింద‌ని త‌ల్లికి చెప్పిన‌ట్టు ఒడిశా పోలీసులు చెబుతున్నారు. ఆమె కోసం ఎంత ఖ‌ర్చు చేసినా త‌న ప‌ట్ల స‌రిగా ప్ర‌వ‌ర్తించేది కాద‌ని అవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

News September 27, 2024

‘పూరీ’ మహాప్రసాదం నాణ్యత కోసం యంత్రాంగం: ఒడిశా

image

పూరీ జగన్నాథ ఆలయంలో ఇచ్చే మహాప్రసాదాన్ని నిరంతరం పర్యవేక్షించాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచంద్రన్ తాజాగా ప్రకటించారు. నెయ్యి విషయంలో అత్యంత శ్రద్ధ తీసుకోనున్నట్లు వెల్లడించారు. ప్రసాదం తయారీ గదిలోకి కఠిన పరీక్షల తర్వాతే ఏ పదార్థమైనా వెళ్లేలా నిబంధనల్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.