News September 26, 2024

పెట్రోల్ రేటు తగ్గింపు?

image

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (క్రూడాయిల్) రేట్లు భారీగా తగ్గడంతో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ ‘ఇక్రా’ తెలిపింది. ఈ ఏడాది మార్చిలో బ్యారెల్ రేట్ 83-84 డాలర్లు ఉన్నప్పుడు పెట్రోల్ లీటరుపై రూ.2 తగ్గించారని, ఇప్పుడు బ్యారెల్ ధర 74 డాలర్లకు పడిపోయిందని పేర్కొంది. దీంతో పెట్రోల్, డీజిల్ లీటరుకు రూ.2-3 చొప్పున తగ్గించే ఛాన్స్ ఉందని అంచనా వేసింది.

News September 26, 2024

సనాతన ధర్మం అంటే ఏంటి?

image

సనాతనం అంటే శాశ్వతమైన, పవిత్రమైన, స్థిరమైన అని అర్థం. సనాతన ధర్మం అంటే శాశ్వతంగా నిలిచే ధర్మం అని పండితులు చెబుతారు. హిందువులు తమను తాము సనాతన వాదులుగా పిలుచుకుంటారు. అంటే శాశ్వతమైన ధర్మాన్ని అనుసరించేవారని అర్థం. హిందూ ధర్మానికి అసలు పేరు సనాతన ధర్మం అని ప్రవచనకర్తలు నిర్వచిస్తారు. ‘హిందూ’ అనే పదం భౌగోళిక గుర్తింపు కారణంగా విదేశీయుల నుంచి వచ్చిందని సద్గురు చెబుతారు.

News September 26, 2024

ESPN టీమ్ఇండియా శతాబ్దపు బెస్ట్ టెస్ట్ టీమ్-11 ఇదే!

image

ప్రముఖ స్పోర్ట్స్ మీడియా ESPN CRICINFO నిపుణులు 21వ శతాబ్దంలో అత్యుత్తమ భారత టెస్ట్ -11ని ఎంపిక చేశారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ, వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ ఉన్నారు. టీమ్-11లో వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, సచిన్ టెండూల్కర్, రవీంద్ర జడేజా, అశ్విన్, అనిల్ కుంబ్లే, జస్ప్రిత్ బుమ్రా, జహీర్ ఖాన్ ఉండగా 12వ ప్లేయర్‌గా షమీని ఉంచారు. ధోనీ, పుజారాలకు చోటు దక్కలేదు.

News September 26, 2024

ఈ నెల 30న విశ్వహిందూ పరిషత్ శాంతియుత నిరసనలు

image

TG: తిరుమల లడ్డూ అపవిత్రమైన ఘటన హిందూ మనోభావాలను గాయపరిచిందని తెలంగాణ విశ్వహిందూ పరిషత్ ఆందోళన వ్యక్తం చేసింది. లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వినియోగించి మహా పాపం తలపెట్టారని మండిపడింది. దీనిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఈనెల 30న రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత నిరసనలకు పిలుపునిచ్చింది.

News September 26, 2024

బిహార్‌లో విషాదం.. నీట మునిగి 46 మంది మృతి

image

బిహార్‌లో జివుతియా పండుగ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నదీ స్నానాలు చేసే క్రమంలో మూడు రోజుల వ్యవధిలో 46 మంది మరణించారు. వీరిలో 37 మంది చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ విషాద ఘటనలపై ప్రభుత్వం దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు పరిహారం అందజేస్తామని తెలిపింది.

News September 26, 2024

ఉరిశిక్ష ఖైదీ.. 46ఏళ్ల జైలుజీవితం తర్వాత నిర్దోషిగా విడుదల

image

కాల మహిమ అంటే ఇదే! జపాన్‌లో ఓ ఉరిశిక్ష ఖైదీ 46 ఏళ్ల జైలుజీవితం తర్వాత నిర్దోషిగా బయటపడ్డారు. 1968లో తను పనిచేసే ఓనర్ ఫ్యామిలీని హత్యచేశారని ఇవాయో హకమాడను అరెస్టు చేశారు. క్రైమ్‌సీన్ దగ్గర్లోని బావిలో దొరికిన రక్తం అంటిన దుస్తులు అతడివేనని కోర్టు శిక్ష వేసింది. పోలీసుల టార్చర్‌తో చేయని నేరం అంగీకరించానని ఆ తర్వాత చెప్పడంతో మళ్లీ విచారణ కొనసాగింది. ఆ బట్టలపై రక్తం ఆయనది కాదని DNA టెస్టులో తేలింది.

News September 26, 2024

500+ T20లు ఆడింది కేవలం ఆరుగురే

image

కీరన్ పొలార్డ్ – 684, డ్వేన్ బ్రావో – 582 , షోయబ్ మాలిక్ – 542, సునీల్ నరైన్ – 525, ఆండ్రీ రసెల్ – 523, డేవిడ్ మిల్లర్ – 500.
ఈ లిస్టులో మిల్లర్ మినహా అందరూ ఆల్‌రౌండర్లే. పైగా విండీస్ వాళ్లే ఎక్కువ. ప్రపంచంలోని అన్ని లీగుల్లో ఆడటమే ఇందుకు కారణం. IPL, BBL, CPL, SA20, MLC, PSL సహా దేన్నీ వదలరు. సిక్సర్లు దంచుతూ, వికెట్లు తీస్తూ ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తారు కాబట్టే ఫ్రాంచైజీలు వీరికోసం ఎగబడతాయి.

News September 26, 2024

ఉపఎన్నికలు జరిగితే BRSకు డిపాజిట్ కూడా రాదు: కడియం

image

TG: అవినీతి, అక్రమాలకు BRS మారుపేరు అని MLA కడియం శ్రీహరి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థలను కాలరాసిందని, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందని విమర్శించారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావని, ఒకవేళ వచ్చినా కాంగ్రెస్ సిద్ధంగా ఉందని చెప్పారు. ఉపఎన్నికలు జరిగితే BRSకు డిపాజిట్ కూడా రాదని వ్యాఖ్యానించారు. కోర్టులపై తమకు గౌరవం ఉందన్నారు.

News September 26, 2024

ప్రజలు ఎగిరితంతారని భయపడుతున్నారా?: BJP

image

TG: కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘ప్రజలతో మంత్రుల ముఖాముఖి’ నిర్వహణ తీరును తెలంగాణ BJP విమర్శించింది. ‘కంచెలు లేని మంచి పాలన తెస్తామని గొంతు చించుకుని అరిచినోళ్లు ఈరోజు ఎవరినీ చెంతకు రానివ్వకుండా కంచెల చాటున దాక్కుని మాట్లాడుతున్నారెందుకో? మీ మోసాన్ని, మీరు పెడుతున్న గోసల్ని చూసి ఎవరు ఎక్కడినుంచి వచ్చి ఎగిరితంతారోనని భయపడుతున్నారా?’ అని ట్వీట్ చేసింది. నేటి ముఖాముఖిలో మంత్రి దామోదర పాల్గొన్నారు.

News September 26, 2024

యూట్యూబర్ హర్షసాయిపై మరో ఫిర్యాదు

image

TG: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ హర్షసాయిపై బాధితురాలు మరో ఫిర్యాదు చేశారు. హర్షసాయి తనకు ఈ-మెయిళ్లు పంపిస్తూ వేధిస్తున్నాడని హైదరాబాద్ నార్సింగి పీఎస్‌లో కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పటికే తనపై అత్యాచారం చేశాడని, రూ.2 కోట్ల డబ్బులు కూడా తీసుకున్నాడని హర్షపై ఇదే పీఎస్‌లో ఆమె కేసు పెట్టిన సంగతి తెలిసిందే.