News September 24, 2024

మోదీలాంటి నాయకుడుంటే ‘$7ట్రిలియన్ల ఎకానమీ’ సాధ్యమే: JP మోర్గాన్

image

‘$7ట్రిలియన్ల ఎకానమీ’ని భారత్ సాధించగలదని JP మోర్గాన్ CEO జేమీ డిమాన్ అన్నారు. ఇందుకు PM మోదీలాంటి బలమైన నాయకత్వం అవసరమన్నారు. ‘ఆధార్, బ్యాంకింగ్ A/Cs, GST రిఫార్మ్స్, ఇన్ఫ్రా బిల్డింగ్, నియంత్రణల తగ్గింపు సంపన్నులకే కాకుండా దేశం, తక్కువ ఆదాయ వర్గాలకూ సాయపడ్డాయి. గతంతో పోలిస్తే దేశం మరింత డెవలప్ అయింది. మేమిక్కడి నుంచే ఎందరో క్లైంట్లకు సేవలందిస్తున్నాం. మాకు 55వేల ఉద్యోగులున్నారు’ అని చెప్పారు.

News September 24, 2024

బుల్ రంకెలు: ఫస్ట్‌టైమ్ 85,000 బ్రేక్ చేసిన సెన్సెక్స్

image

దేశీయ స్టాక్ మార్కెట్లలో రికార్డుల పరంపర కొనసాగుతోంది. చరిత్రలో తొలిసారి BSE సెన్సెక్స్ 85,000 స్థాయిని టచ్ చేసింది. 85,021 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 85 పాయింట్ల లాభంతో 85,014 వద్ద చలిస్తోంది. NSE నిఫ్టీ వేగంగా 26,000 వద్దకు పరుగులు తీస్తోంది. ఇంట్రాడేలో 25,971 వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ 26 పాయింట్లు ఎగిసి 25,965 వద్ద ట్రేడవుతోంది. టాటా స్టీల్, హిందాల్కో టాప్ గెయినర్స్.

News September 24, 2024

చేనేతలకు ఉచిత విద్యుత్, ఆరోగ్య బీమా: సీఎం చంద్రబాబు

image

AP: చేనేత మగ్గాలున్న వారికి 200 యూనిట్లు, మర మగ్గాలు ఉన్నవారికి 500 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. త్వరలో నూతన టెక్స్‌టైల్ పాలసీ తీసుకొస్తామని చెప్పారు. ఆప్కోలో పొరుగు సేవల సిబ్బంది నియామకానికి అనుమతిచ్చారు. చేనేత ఉత్పత్తులపై కేంద్రం GST ఎత్తివేయకపోతే ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే రీయింబర్స్ చేస్తుందని పేర్కొన్నారు. చేేనేతలకు ఆరోగ్య బీమా పథకం తీసుకొస్తామన్నారు.

News September 24, 2024

ప్రజారోగ్యంపై ప్రభుత్వానికి పట్టింపు లేదు: KTR

image

TG: ప్రజారోగ్యంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టింపు లేదని KTR విమర్శించారు. ‘రోగాలు, నొప్పులు, వ్యాధులు, బాధలతో జనం అల్లాడుతున్నా ప్రభుత్వానికి చలనం లేదు. ఎవడి చావు వాడు చస్తాడు మాకేం సంబంధం అన్నట్టుగా ప్రవర్తిస్తోంది. వైద్యారోగ్య శాఖకు చీమకుట్టినట్టు కూడా లేదు. ప్రభుత్వ శాఖలు మొద్దు నిద్ర వీడటం లేదు. ప్రాణాంతక రోగాలు పట్టి పీడిస్తుంటే అరికట్టాల్సిన ప్రభుత్వం అడ్రస్ లేదు’ అని ట్వీట్ చేశారు.

News September 24, 2024

జగన్‌ను నిందించట్లేదు.. కానీ: పవన్

image

AP: తిరుమల లడ్డూ వ్యవహారంలో తాను మాజీ సీఎం జగన్‌ను నిందించట్లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే జగన్ ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డులోనే ఈ తప్పు జరిగిందని పేర్కొన్నారు. ‘ఒకవేళ జగన్ ఎలాంటి తప్పు చేయకపోతే విచారణకు సహకరించాలి. లడ్డూ వ్యవహారంలో దోషులను శిక్షించమని చెప్పాలి’ అని పవన్ కళ్యాణ్ అన్నారు.

News September 24, 2024

పీవీ సింధుకు కొత్త కోచ్: ఎవరంటే?

image

పారిస్ ఒలింపిక్స్‌లో తీవ్రంగా నిరాశపరిచిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కొత్త కోచ్‌ను నియమించుకున్నారు. భారత మాజీ షట్లర్ అనూప్ శ్రీధర్ ఆమెకు తాత్కాలిక కోచ్‌గా వ్యవహరిస్తారు. ప్రస్తుత కోచ్ అగస్ ద్వి శాంటోసో పదవీకాలం ఒలింపిక్స్‌తోనే ముగిసింది. కాగా శ్రీధర్ 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించారు. లక్ష్యసేన్‌కు ఈ ఏడాది జనవరి వరకు కోచ్‌గా ఉన్నారు

News September 24, 2024

అంబానీ కొత్త విమానం.. కదిలే ఇంద్రభవనమే!

image

బిలియనీర్ ముకేశ్ అంబానీ ‘బోయింగ్ 737 మ్యాక్స్ 9’ విమానం కొన్నారు. దీని విలువ సుమారు రూ.1,000 కోట్లు. ఈ విమానం గంటకు 838 కి.మీ వేగంతో నాన్ స్టాప్‌గా 11,770 కి.మీ ప్రయాణిస్తుంది. ఇందులో ముకేశ్ అభిరుచులకు తగ్గట్లు సకల సౌకర్యాలు ఉండేలా స్విట్జర్లాండ్‌లో రీ మోడల్ చేయించారు. త్వరలోనే ఈ విమానాన్ని ముంబైకి తీసుకువస్తారు. ఇప్పటికే ముకేశ్ వద్ద 9 ప్రైవేట్ జెట్లు ఉండగా ఈ కొత్తదానితో వాటి సంఖ్య 10కి చేరింది.

News September 24, 2024

‘గేమ్ ఛేంజర్’ నుంచి రేపు అనౌన్స్‌మెంట్: తమన్

image

రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీకి సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఓ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా నుంచి రేపు ఓ అనౌన్స్‌‌మెంట్ రానున్నట్లు తెలిపారు. కాగా అది రెండో సాంగ్ గురించేనని, ఈ నెల 27న దాన్ని రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. ఈ మూవీలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. DEC 20న ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది.

News September 24, 2024

భీకర యుద్ధం: 500కు చేరిన మృతుల సంఖ్య

image

హెజ్‌బొల్లా సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటివరకు 500 మందికిపైగానే మృతి చెందారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు 100కుపైగా ఉన్నారు. 1,650 మందికిపైగా గాయపడ్డారు. 2006 తర్వాత లెబనాన్‌పై జరిగిన అత్యంత ఘోరమైన దాడి ఇదేనని విశ్లేషకులు చెబుతున్నారు. 2006లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో దాదాపు 1,300 మంది లెబనాన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 5 లక్షల మందికిపైగా నిరాశ్రయులయ్యారు.

News September 24, 2024

బతుకమ్మ గిఫ్ట్.. రూ.500?

image

గత ప్రభుత్వం బతుకమ్మ పండుగ కానుకగా మహిళలకు చీరలు అందించగా ప్రస్తుత ప్రభుత్వం వాటి స్థానంలో నగదు అందించేందుకు యోచిస్తోంది. రూ.500 లేదా ఆపైనే ఇచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. బ్యాంకు ఖాతాల్లో వేయాలా? లేక నేరుగా చేతికి ఇవ్వాలా? అనేది ఇంకా నిర్ణయించలేదని సమాచారం. రేషన్ కార్డు లేదా స్వయం సహాయక బృందాల్లో సభ్యత్వం ప్రామాణికంగా అర్హులను గుర్తించేందుకు కసరత్తులు చేస్తోందని తెలుస్తోంది.