News September 24, 2024

తరిగిపోతున్న అమెజాన్ ఫారెస్ట్!

image

అతిపెద్ద రెయిన్‌ఫారెస్ట్ ‘అమెజాన్’ తరిగిపోతోంది. గత నాలుగు దశాబ్దాల్లో అటవీ నిర్మూలనతో ఏకంగా జర్మనీ & ఫ్రాన్స్‌ల పరిమాణమంత అడవిని కోల్పోయిందని ఓ అధ్యయనం తెలిపింది. ప్రధానంగా మైనింగ్ & వ్యవసాయం కోసం 1985- 2023 మధ్య అటవీ నిర్మూలన జరిగింది. 88 మిలియన్ హెక్టార్ల అడవిని కోల్పోవడం ఆందోళనకరం. అమెజాన్‌లో వృక్షసంపద కోల్పోతే అనేక దక్షిణ అమెరికా దేశాల్లో కరవు ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Similar News

News February 9, 2026

మాఘ స్నానం ఇంకా చేయలేదా?

image

మాఘ మాసం ఎంతో పవిత్రమైంది. ఈ నెలలో నదీ స్నానాలు చేయాలంటారు. ఒకవేళ చేయలేకపోతే చివరి రోజు ఓ పరిహారం పాటించాలంటున్నారు పండితులు. అలా అమ్మవారి అనుగ్రహం పొందవచ్చని చెబుతున్నారు. ‘ఇంట్లో ప్రతికూల శక్తి పోవాలంటే కర్పూరంలో 11 లవంగాలు వేయాలి. ఆ ధూపాన్ని ఇల్లంతా చూపాలి. ఆర్థిక ఇబ్బందుల తొలగింపునకు తమలపాకుపై కుంకుమపువ్వుతో ‘శ్రీ’ అని రాసి పూజ గదిలో ఉంచాలి. భార్యాభర్తలు దీపారాధన చేయాలి’ అని సూచిస్తున్నారు.

News February 9, 2026

రూ.3వేల కోట్లతో రోడ్ల నిర్మాణం: సీఎం

image

AP: వచ్చే మూడేళ్లలో అమరావతిని మోస్ట్ లివబుల్ సిటీగా మారుస్తామని సీఎం చంద్రబాబు మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో అన్నారు. పోలవరాన్ని 2027 పుష్కరాల నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చెప్పారు. మెగా డీఎస్సీతో 16వేల టీచర్ ఉద్యోగాలు, 5వేల కానిస్టేబుల్ నియామకాలను పూర్తి చేశామన్నారు. రూ.1,000 కోట్లతో రోడ్ల మరమ్మతులు చేశామని, మరో రూ.3వేల కోట్లు ఖర్చు చేసి రోడ్లను నిర్మిస్తున్నామని వెల్లడించారు.

News February 9, 2026

గేమింగ్ స్కామ్‌.. ఏకంగా రూ.5 వేల కోట్లు!

image

హైదరాబాద్‌లో ఆన్‌లైన్ గేమింగ్ స్కామ్‌ను DGGI అధికారులు బయటపెట్టారు. ఫిన్‌టెక్ పేరుతో ₹5వేల కోట్ల కుంభకోణం జరిగినట్లు తేల్చారు. పలు వెబ్‌సైట్లతో అక్రమ దందా చేశారని, GST ఎగ్గొట్టారని తెలుస్తోంది. ఓషనీక్ వెబ్ సొల్యూషన్స్, వెబ్‌విన్ సొల్యూషన్స్ అనే షెల్ కంపెనీలకు రెంటెడ్ ఖాతాలతో నిధులు మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారని, మాస్టర్‌మైండ్ దుబాయ్‌లో ఉన్నాడని సమాచారం.