News October 2, 2024

ఫోన్ల ధరలు పెరిగే ఛాన్స్!

image

ప్రపంచవ్యాప్తంగా సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్స్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు పెరిగే ఛాన్స్ ఉంది. అమెరికాలోని నార్త్ కరోలినాలో హెలెన్ హరికేన్ కారణంగా క్వార్ట్జ్ ఉత్పత్తి ఆగిపోయింది. బ్రెజిల్, రష్యాల్లో క్వార్ట్జ్ లభించినా.. సెమీకండక్టర్లలో ఉపయోగించే నాణ్యమైన క్వార్ట్జ్ నార్త్ కరోలినాలోనే దొరుకుతుంది. వరదల కారణంగా విద్యుత్ సరఫరా, రవాణా ఆగిపోవడంతో సప్లై చైన్ తెగిపోయింది.

News October 2, 2024

వడ్డీరేట్ల కోతకు టైమొచ్చింది: RBI మాజీ గవర్నర్ రంగరాజన్

image

ఇన్‌ఫ్లేషన్ స్లోడౌన్ అవ్వడంతో వడ్డీరేట్ల కోతకు టైమ్ వచ్చిందని RBI మాజీ గవర్నర్ సీ రంగరాజన్ అన్నారు. రెండు దఫాల్లో 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించడం మంచిదన్నారు. ఒకవేళ రెపోరేట్ తగ్గిస్తే మార్కెట్లను నడిపించడం కాకుండా అనుసరించడం కిందకు వస్తుందన్నారు. ఆగస్టులోనే RBI రెపోరేట్ తగ్గిస్తుందని ఎకానమిస్టులు అంచనా వేశారు. ఫుడ్ ఇన్‌ఫ్లేషన్ నిలకడగా 4% లోపు ఉంటేనే ఆలోచిస్తామని శక్తికాంతదాస్ స్పష్టం చేశారు.

News October 2, 2024

జపాన్‌లో పేలిన అమెరికా బాంబు!

image

జపాన్‌లో మియజాకీ ఎయిర్ పోర్టులో ఉన్న రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు తాజాగా పేలింది. దాన్ని చాలాకాలం క్రితమే రన్ వే అడుగున మట్టిలో పూడ్చిపెట్టారు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడెందుకు పేలిందన్నదానిపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పేలుడు సంభవించిన చోట పెద్ద గొయ్యి ఏర్పడిందని, దగ్గర్లో విమానాలేవీ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని వివరించారు. ఈ ఘటనతో 80 విమానాల్ని రద్దు చేశారు.

News October 2, 2024

లక్ష కోట్ల డాలర్ల వైపు భారత డిజిటల్ ఎకానమీ

image

2028 నాటికి భారత డిజిటల్ ఎకానమీ లక్ష కోట్ల డాలర్లకు చేరుకుంటుందని ఆస్క్ క్యాపిటల్ రిపోర్టు తెలిపింది. ప్రభుత్వ డిజిటల్ స్కీములు, పెరిగిన ఇంటర్నెట్ వినియోగం, చీప్ 4G, 5G వంటివి ఇందుకు దోహదం చేస్తున్నాయని పేర్కొంది. UPI వంటి రియల్‌టైమ్ పేమెంట్స్ టెక్నాలజీ ఎకనామిక్ డెవలప్మెంట్‌లో గేమ్ ఛేంజర్‌ అన్న సంగతి తెలిసిందే. ICRIER ప్రకారం డిజిటలైజేషన్లో జపాన్, UK, జర్మనీ కన్నా భారత్ మెరుగైన స్కోర్ సాధించింది.

News October 2, 2024

సురేఖ క్షమాపణలు చెప్పాలన్న హరీశ్.. కాదు కేటీఆరే చెప్పాలన్న జగ్గారెడ్డి

image

TG: KTRపై మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. ఆమె వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ‘వాళ్లు మిమ్మల్ని వ్యక్తిగతంగా అటాక్ చేస్తున్నారంటే, పొలిటికల్‌గా ఆర్గ్యుమెంట్లు లేవని అర్థం-మార్గరెట్ థాచెర్’ అనే కోట్‌ను ఆయన పోస్ట్ చేశారు. మరోవైపు కేటీఆర్‌ను సురేఖ తిట్టడం తప్పుకాదని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. KTR వెంటనే సురేఖకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

News October 2, 2024

CRPFపై దాడికి దీపావళి టపాసులు వాడుతున్న మావోయిస్టులు

image

సెక్యూరిటీ ఫోర్సెస్ అటెన్షన్ డైవర్ట్ చేసేందుకు మావోయిస్టులు కొత్త పంథా అనుసరిస్తున్నారు. గ్రెనేడ్లు, IED, గన్స్‌తో దాడి చేసే ముందు CRPF క్యాంపుల సమీపంలో అగరబత్తీలు, దీపావళి టపాసులు పేల్చుతున్నారని అధికార వర్గాలు తెలిపాయి. వాటి సౌండ్, పొగకు క్యాంప్ నుంచి పోలీసులు బయటకు రాగానే నక్సలైట్లు అటాక్ చేస్తున్నారని పేర్కొన్నాయి. SEP 25న TG కొత్తగూడెం అడవుల్లో ఈ వ్యూహాన్ని గుర్తించామని వెల్లడించాయి.

News October 2, 2024

సురేఖ ఆరోపణలపై స్పందించిన నాగార్జున

image

చై-సామ్ విడాకుల్లో తన ప్రమేయం ఉందన్న తెలంగాణ మంత్రి <<14254371>>సురేఖ<<>> ఆరోపణలను నాగార్జున ఖండించారు. ప్రత్యర్థులను విమర్శించేందుకు సినిమా వారిని వాడుకోవద్దని కోరారు. ‘సాటి మనుషుల వ్యక్తిగత విషయాలు గౌరవించండి. బాధ్యత గల పదవిలోని మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలసిందిగా కోరుతున్నాను’ అని నాగార్జున ట్వీట్ చేశారు.

News October 2, 2024

నేతలకు దమ్ముంటే మా నీళ్లు తాగాలి: హరియాణాలో ప్రజల సవాల్

image

హరియాణాలోని చార్ఖీ దాద్రీ నియోజకవర్గంలోని సమస్‌పూర్‌ ప్రజలు రాజకీయ నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు సరఫరా అయ్యే తాగునీరు కనీసం పశువులు కూడా తాగలేనంత మురికిగా ఉంటోందని, చాలాకాలంగా నీటిని కొని తాగుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఓట్లు అడిగేందుకు వచ్చే ఎవరైనా సరే తమ వద్ద నీటిని తాగాలంటూ సవాలు చేస్తున్నారు.

News October 2, 2024

ప్రధాని ఫోన్‌ చేస్తే తిరస్కరించాను: వినేశ్ ఫొగట్

image

ఒలింపిక్స్‌లో అనర్హత అనంతరం PM మోదీ నుంచి తనకొచ్చిన ఫోన్‌ కాల్‌ను తిరస్కరించానని కాంగ్రెస్ నేత, మాజీ రెజ్లర్ వినేశ్ ఫొగట్ ఎన్నికల ప్రచారంలో తెలిపారు. ‘PM నుంచి ఫోన్ వచ్చిందని అధికారులు చెప్పారు. సరే మాట్లాడుదాం అనుకున్నా. కానీ నా వద్ద ఎవ్వరూ ఉండకూడదని, మాట్లాడుతున్నప్పుడు కాల్ రికార్డ్ చేస్తామని చెప్పారు. నా భావోద్వేగాలు రాజకీయం కాకూడదని మాట్లాడేందుకు నిరాకరించాను’ అని వెల్లడించారు.

News October 2, 2024

UN చీఫ్‌పై ఇజ్రాయెల్ నిషేధం

image

ఐక్యరాజ్య సమితి(UN) చీఫ్ ఆంటోనియో గుటెరస్‌పై ఇజ్రాయెల్ నిషేధం విధించింది. తమపై ఇరాన్ చేసిన దాడిని ఖండించని వారెవరికైనా తమ దేశంలోకి ప్రవేశం ఉండదని ఆ దేశ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ప్రకటించారు. గుటెరస్ ఉన్నా లేకపోయినా ఇజ్రాయెల్ తన పౌరులను రక్షించుకోగలదని వ్యాఖ్యానించారు.