India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

BJP పదేళ్ల పాలనలో ఎకానమీ పతనావస్థకు చేరుకుందని కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ ఆరోపించారు. వేతనాల్లో గ్రోత్ నిలిచిపోయిందని, ద్రవ్యోల్బణం పెరిగిందని విమర్శించారు. వస్తు వినియోగం తగ్గడంతో లాంగ్టర్మ్లో GDP గ్రోత్ తగ్గే ప్రమాదం ఉందన్నారు. 2015లో కామన్ మ్యాన్ రూ.100 వస్తువులు కొంటే 18% ఇండస్ట్రియలిస్ట్ ఓనర్కు వెళ్లేదన్నారు. ఇప్పుడు అదే ఓనర్కు రూ.36 వెళ్తోందని అదానీని పరోక్షంగా విమర్శించారు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి, విపక్ష మహా వికాస్ అఘాడీ కూటములను రెబల్స్ టెన్షన్ పెడుతున్నారు. మహాయుతి కూటమిలోని BJP, NCP, శివసేన టిక్కెట్లు ఆశించి భంగపడిన 40 మంది అభ్యర్థులు రెబల్స్గా బరిలో నిలిచారు. అటు MVA నుంచి 16 మంది రెబల్స్ పోటీ చేస్తున్నారు. నామినేషన్ల గడువు ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు (Nov 4th) వరకు ఎంత మంది బరిలో ఉంటారన్నది వేచిచూడాలి.

అమెరికా ఎన్నికలు సమీపిస్తోన్న వేళ Washington Post కీలక నిర్ణయం తీసుకుంది. ఏపార్టీకి సపోర్ట్గా కాకుండా న్యూట్రల్గా ఉండేందుకు నిర్ణయించినట్లు సంస్థ అధినేత బెజోస్ ప్రకటించారు. ‘సంప్రదాయ US మీడియాపై ప్రజలు విశ్వాసం కోల్పోయారు. సోషల్ మీడియాలో వస్తోన్న ఫేక్ వార్తలనే ఎక్కువగా నమ్ముతున్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా’ అని తెలిపారు. బెజోస్ నిర్ణయంతో Washington Post భారీగా సబ్స్క్రైబర్లను కోల్పోతోంది.

‘కలర్ ఫొటో’ దర్శకుడు సందీప్ రాజ్ పెళ్లి పీటలు ఎక్కనున్నారు. నటి చాందినీ రావును ఆయన ప్రేమ వివాహం చేసుకోనున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. నవంబర్ 11న వీరి ఎంగేజ్మెంట్ వైజాగ్లో జరగనుందని తెలిపాయి. డిసెంబర్ 7న తిరుపతిలో పెళ్లి చేసుకుంటారని వెల్లడించాయి. కాగా చాందినీ కలర్ ఫొటో, రణస్థలి వంటి చిత్రాలతో పాటు హెడ్స్ అండ్ టేల్స్ వెబ్ సిరీస్లో నటించారు.

కొత్త టెలికం నిబంధనల్ని అమల్లోకి తెచ్చేందుకు గాను గడువును ట్రాయ్ మరోసారి పెంచింది. రేపటితో గడువు ముగియనుండగా టెలికం ఆపరేటర్ల అభ్యర్థన మేరకు DEC 1 వరకు పొడిగించింది. టెలీమార్కెటింగ్, బ్యాంకులు, ఇతర సంస్థల నుంచి వచ్చే సందేశాలు, OTPలను బ్లాక్ చేయాలని ట్రాయ్ ఆదేశాలిచ్చింది. నకిలీ కాల్స్ను గుర్తించేలా సిస్టమ్ను తీసుకొచ్చింది. అయితే దీని వల్ల బ్యాంకింగ్ సందేశాలు, OTPలను స్వీకరించడంలో ఆలస్యం కావొచ్చు.

SSMB29 కోసం లోకేషన్ వేటలో ఆఫ్రికాలో ఉన్న దర్శకుడు రాజమౌళి మరో పోస్ట్ చేశారు. సింహాన్ని చూస్తున్నట్లుగా ఉన్న ఫొటోను ఇన్స్టాలో పంచుకున్నారు. ‘దీని పేరు బాబ్ జూనియర్. సెరెంగెటి(ఆఫ్రికాలోని ఓ ప్రాంతం)కి రాజు. ఈ ఫొటోను క్రిస్ ఫాలోస్ తీశారు’ అని రాసుకొచ్చారు. దీంతో మహేశ్ ఫ్యాన్స్ ఈ ఫొటోను షేర్ చేస్తూ హైప్ ఎక్కించు ఇంకా అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా క్రిస్ ప్రముఖ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్.

AP: జగన్తో వివాదం నేపథ్యంలో YCP <<14486706>>ఆరోపణలకు<<>> షర్మిల కౌంటర్ ఇచ్చారు. జగన్ బెయిల్ రద్దుకు కుట్ర అనడం ఈ శతాబ్దపు పెద్ద జోక్ అని సెటైర్లు వేశారు. ‘ఈడీ అటాచ్ చేసింది రూ.32 కోట్ల విలువైన కంపెనీ ఆస్తిని. షేర్ల బదిలీపై ఆంక్షలు లేవు. విజయమ్మకు రూ.42 కోట్ల షేర్లు ఎలా అమ్మారు? నాకు 100%వాటాలు ఇస్తామని MOUపై జగన్ సంతకం చేశారు. బెయిల్ రద్దవుతుందని సంతకం చేసినప్పుడు తెలియదా?’ అని ప్రశ్నించారు.

AP: రేపటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేయనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గ్యాస్ సరఫరా సంస్థలకు రూ.876 కోట్ల చెక్కును సీఎం చంద్రబాబు అందజేశారు. కాగా ఈ పథకానికి నిన్నటి నుంచే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. సిలిండర్ డెలివరీ అయిన 24-48 గంటల్లో లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేయనుంది.

కింగ్ ఛార్లెస్ III, కామిల్లా దంపతులు భారత్లో రహస్యంగా పర్యటిస్తున్నారని తెలిసింది. OCT 27 నుంచి వీరు బెంగళూరులోని SICHలో వెల్నెస్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని సమాచారం. యోగా, థెరపీ, మెడిటేషన్ థెరపీ తీసుకుంటున్నారని IE తెలిపింది. గతంలోనూ వీరిక్కడికి రావడం గమనార్హం. ఓ సీక్రెట్ ట్రిప్ కోసం వీరిద్దరూ OCT 21-26 మధ్య సమోవాకు వెళ్లారు. అక్కడి నుంచి నేరుగా బెంగళూరు HAL ఎయిర్పోర్టులో దిగారని తెలిసింది.

* కాటన్ దుస్తులే ధరించాలి.
* అందుబాటులో బకెట్ నీళ్లు, ఇసుకను ఉంచుకోండి.
* ఫెయిలైన బాణసంచాను మళ్లీ వెలిగించొద్దు.
* ఫ్లవర్పాట్లు, హ్యాండ్ బాంబ్లు కాల్చే సమయంలో చేతితో పట్టుకోవద్దు.
* ఫైర్ క్రాకర్స్ వెలిగించి బహిరంగ ప్రదేశాల్లో విసిరేయకండి.
* అగ్నిప్రమాదం జరిగితే 101,112,100,1070ను సంప్రదించండి.
Sorry, no posts matched your criteria.