News November 8, 2024

సమోసాల మిస్సింగ్‌పై నో ఎంక్వైరీ: CID

image

హిమాచల్ ప్రదేశ్ CID ఆఫీసులో సమోసాలు మిస్ అవ్వడంపై అధికారికంగా ఎలాంటి విచారణకు ఆదేశించలేదని DG సంజీవ్ రంజన్ తెలిపారు. CM సుఖ్వీందర్ సింగ్ పాల్గొన్న సమావేశంలో అతిథుల కోసం తెప్పించిన స్నాక్స్ ప్యాకెట్లు కనిపించకపోవడంతో అధికారులు వాటి కోసం వెతికారని వెల్లడించారు. ఇదో సామాన్యమైన అంతర్గత విషయమన్నారు. బాక్సులను వెతికేందుకు కేవలం అప్పీల్ చేశామన్నారు. దీన్ని రాజకీయం చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు.

News November 8, 2024

యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట.. సీఎం రేవంత్ ఆదేశం

image

TG: యాదాద్రి ఆలయం పేరును మారుస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. యాదాద్రి బదులు యాదగిరిగుట్టగా పేరు మార్చాలని అధికారులను ఆదేశించారు. ఇకపై రికార్డుల్లో ఇదే కొనసాగించాలని సూచించారు. ఇక టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. యాదాద్రి ఆలయ అభివృద్ధిపై జరిపిన సమీక్షలో రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

News November 8, 2024

ఇంట్లో ఈ మొక్కలుంటే ఆరోగ్యమే!

image

గాలిని శుద్ధిచేసి స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను అందించే మొక్కలను ఇంట్లో పెంచుకోవడం ఎంతో శ్రేయస్కరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. స్పైడర్ ప్లాంట్ ఇంట్లోని కార్బన్ మోనాక్సైడ్, ఫార్మాల్డిహైడ్ & జిలీన్‌లను పీల్చుకుని గాలిని శుద్ధి చేసి ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుందని తెలిపారు. ఇవి సురక్షితమైనవని చెప్పారు. బెస్ట్ బెడ్‌రూమ్ మొక్కలివే.. లావెండర్, అలోవెరా, జాస్మిన్, స్నేక్ ప్లాంట్, ఇంగ్లీష్ IVY.

News November 8, 2024

మహిళల బట్టలు పురుషులు కుట్టకూడదు: మహిళా కమిషన్

image

మహిళల దుస్తులు పురుషులు కుట్టకూడదని, ఇది బ్యాడ్ టచ్ కిందకే వస్తుందని UP మహిళా కమిషన్ తెలిపింది. స్త్రీల దుస్తుల కొలతలు స్త్రీలు మాత్రమే తీసుకోవాలని, టైలరింగ్ షాపులో CC కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. మహిళల శిరోజాలనూ పురుషులు కత్తిరించకుండా, స్త్రీలే కత్తిరించేలా చర్యలు తీసుకోవాలని UP ప్రభుత్వానికి ప్రతిపాదించింది. బ్యాడ్ టచ్ నుంచి మహిళలను రక్షించేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది.

News November 8, 2024

AUSvsPAK: రెండో వన్డేలో పాక్ ఘన విజయం

image

ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో పాకిస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కంగారూలు 35 ఓవర్లలో 163 పరుగులకే ఆలౌటయ్యారు. హారిస్ రౌఫ్ 5, షాహీన్ అఫ్రిదీ 3 వికెట్లు తీశారు. 164 రన్స్ లక్ష్యాన్ని పాక్ 26.3 ఓవర్లలో ఛేదించింది. సయీమ్ ఆయుబ్ 82, అబ్దుల్లా 64*, బాబర్ 15* రన్స్ చేశారు. 3 వన్డేల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో ఉన్నాయి.

News November 8, 2024

ప్రభాస్‌తో సినిమాలపై హొంబలే ప్రకటన

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో మూడు సినిమాలు తీయనున్నట్లు హొంబలే ఫిల్మ్స్ ప్రకటించింది. ఇప్పటికే తీసిన ‘సలార్’ సినిమా భారీ విజయం పొందగా ‘సలార్-2’తో పాటు మరో రెండిటికి ప్రభాస్ సైన్ చేసినట్లు తెలిపింది. ఇవి 2026,2027, 2028లో విడుదల అవుతాయని ప్రకటన విడుదల చేసింది. కాగా, ప్రశాంత్ వర్మ, లోకేశ్ కనగరాజ్‌తో తీసే సినిమాలను హొంబలే నిర్మిస్తున్నట్లు సమాచారం.

News November 8, 2024

REVANTH: స్టూడెంట్ లీడర్ టు సీఎం..

image

TG: ఉమ్మడి మహబూబ్ నగర్‌కు చెందిన సీఎం రేవంత్ పాఠశాల రోజుల్లోనే లీడర్ అయ్యారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేసి 2006లో జెడ్పీటీసీ, 2007లో ఎమ్మెల్సీగా సంచలన విజయం సాధించారు. ఆ తర్వాత టీడీపీలో చేరి తెలంగాణ పార్టీ విభాగానికి అధ్యక్షుడయ్యారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరి టీపీసీీసీ అధ్యక్ష పదవి దక్కించుకున్నారు. శపథం చేసి మరీ కేసీఆర్‌ను గద్దె దించి తాను CM అయ్యారు. ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నారు.

News November 8, 2024

రోజూ పాలు తాగితే బరువు పెరుగుతారా?

image

భారతీయులకు పాలతో విడదీయరాని అనుబంధం ఉంది. వాటిని రోజూ అధికంగా తాగడం వల్ల బరువు పెరుగుతారని చాలా మంది నమ్మకం. అది నిజమేనని వైద్యులు చెబుతున్నారు. విటమిన్లు, మినరల్స్, ఫ్యాట్‌, చక్కెరతో కూడిన పాల వల్ల క్యాలరీస్ అధికమై వెయిట్ గెయిన్‌కు అవకాశం ఉందంటున్నారు. దీన్ని నివారించడానికి పిల్లలు, గర్భిణులు 4 కప్పులు, ఇతరులు 3 కప్పులు మాత్రమే లో ఫ్యాట్ మిల్క్ తాగాలంటున్నారు.

News November 8, 2024

కారులో 20లక్షల కిలోమీటర్లు ప్రయాణం!

image

ఏదైనా ఓ కారు దాదాపు 10 లక్షల కిలోమీటర్ల వరకూ ప్రయాణించడమే గొప్ప. కానీ 1993 మోడల్ టయోటా కంపెనీకి చెందిన కరోలా కారును ఓ 72 ఏళ్ల గ్రేమ్ హెబ్లీ ఏకంగా 20 లక్షల కిలోమీటర్లు నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. 2000 సంవత్సరంలో 80వేలు తిరిగిన హెబ్లీ కరోలా కారును కొనుగోలు చేశారు. ఇప్పటివరకు 20లక్షల కిలోమీటర్లను కంప్లీట్ చేశారు. ఇప్పటికీ ఎలాంటి సమస్యలేకుండా కారు నడుస్తోందని ఆయన తెలిపారు.

News November 8, 2024

విజయమ్మ, షర్మిలపై జగన్ పిటిషన్.. విచారణ వాయిదా

image

AP: విజయమ్మ, షర్మిలతో ఆస్తుల వివాదంపై జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌లో విచారణ జరిగింది. తనకు తెలియకుండా తల్లి, చెల్లి షేర్లు బదిలీ చేసుకున్నారని పిటిషన్‌లో జగన్ పేర్కొన్నారు. జగన్, భారతి, క్లాసిక్ రియాల్టీ పేరిట షేర్లు కొనసాగేలా చూడాలని కోరారు. కౌంటర్ దాఖలకు విజయమ్మ, షర్మిల తరఫు న్యాయవాదులు సమయం కోరారు. దీంతో విచారణను వచ్చే నెల 13కు ఎన్‌సీఎల్‌టీ వాయిదా వేసింది.