News August 2, 2024

అమరావతిపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు

image

AP: రాజధాని రైతులకు కౌలు, పెన్షన్‌ను మరో ఐదేళ్లు పొడిగిస్తున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు.
*CRDA పరిధిలోకి పల్నాడు, బాపట్ల జిల్లాలు.
*32 కన్సల్టెన్సీలు తిరిగి నియామకం.
*హైవేకి సీడ్ యాక్సిస్ రోడ్డు అనుసంధానం, కరకట్ట 4 లేన్లుగా విస్తరణ.
*ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు వెస్ట్రన్ బైపాస్, కృష్ణా నదిపై 6 బ్రిడ్జిలు, 9 థీమ్ నగరాల నిర్మాణం.
*సోమవారం నుంచి జంగిల్ క్లియరెన్స్ పనులు

News August 2, 2024

రేపు ఏపీ వ్యాప్తంగా వర్షాలు

image

AP: రేపు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ గుంటూరు, అల్లూరి, ఏలూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయంది.

News August 2, 2024

టీచర్లు తేనెటీగల్లాంటి వారు: సీఎం రేవంత్

image

TG: టీచర్ల విషయంలో జోక్యం చేసుకోవాలంటే ఎవరైనా భయపడతారని, వాళ్లు తేనెటీగల్లాంటి వారని CM రేవంత్ అన్నారు. ‘తేనెటీగలు ఎవరి జోలికి పోవు. వాటి మీద ఎవరైనా రాయేస్తే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. టీచర్లు కూడా తమను ఎవరైనా రాయితో కొడితే మూకుమ్మడిగా ఎవరిపనైనా చెబుతారు’ అని CM అన్నారు. టీచర్ల బదిలీల విషయంలోనూ తనను కొందరు హెచ్చరించారని, అయితే వాళ్ల సమస్యను పరిష్కరించాలనే నిర్ణయం తీసుకున్నానన్నారు.

News August 2, 2024

రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి: CM

image

AP: రైతాంగానికి పగటిపూటే 9 గంటల నాణ్యమైన విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను CM చంద్రబాబు ఆదేశించారు. అందుకు అనుగుణంగా ఆయా ఫీడర్ల సామర్థ్యాన్ని మెరుగుపర్చాలని సూచించారు. ‘సోలార్ పవర్ ఉత్పత్తికి ప్రాధాన్యత ఇవ్వాలి. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ విధానంపై ప్రణాళికలు రూపొందించాలి. డిమాండ్‌కు తగ్గట్టుగా, తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తికి, సరఫరాకు చర్యలు తీసుకోవాలి’ అని చెప్పారు.

News August 2, 2024

‘OG’, ‘రాజా సాబ్’ మూవీలపై అప్డేట్స్ ఇచ్చిన తమన్

image

పవన్ కళ్యాణ్ ‘OG’తో పాటు ప్రభాస్ ‘రాజా సాబ్’ సినిమాలపై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అప్డేట్స్ ఇచ్చారు. ట్విటర్‌లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ‘OG’ ఫస్ట్ సింగిల్ గురించి త్వరలో ఓ అప్డేట్ ఉంటుందని దీనికోసం డైరెక్టర్ సుజీత్‌తో కలిసి వర్క్ చేస్తున్నట్లు తెలిపారు. ఎప్పుడూ చూడని విధంగా మూవీ ఉంటుందని మూవీపై అంచనాలు పెంచేశారు. ‘రాజా సాబ్’ సినిమా ఫస్ట్ సింగిల్ జనవరిలో ఉండొచ్చని ట్వీట్ చేశారు.

News August 2, 2024

ఇది అసెంబ్లీ చరిత్రలో చీకటి రోజు: KTR

image

TG: అసెంబ్లీలో ఖైరతాబాద్ కాంగ్రెస్ MLA దానం నాగేందర్ మాట్లాడిన <<13762351>>బూతులను<<>> BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR తప్పుబట్టారు. ఇది అసెంబ్లీ చరిత్రలో చీకటి రోజుగా అభివర్ణించారు. ‘మమ్మల్ని ‘అమ్మ.. అక్క’ అని తిడుతుంటే CM రేవంత్ పైశాచికానందం పొందుతున్నారు. అందర్నీ ఉసిగొల్పుతున్నారు. ఆయన చీఫ్ మినిస్టర్ కాదు. చీప్ మినిస్టర్. యువత రేవంత్‌కు తగిన సమాధానం చెప్పే టైమ్ త్వరలోనే వస్తుంది’ అని KTR వ్యాఖ్యానించారు.

News August 2, 2024

దాదాపు 400 చైనా కంపెనీలపై కేంద్రం ఉక్కుపాదం!

image

దేశంలోని దాదాపు 400కుపైగా చైనా కంపెనీల (లోన్ యాప్స్, ఆన్‌లైన్ జాబ్ పోర్టల్స్ etc) గుర్తింపును కేంద్రం రద్దు చేయనున్నట్లు సమాచారం. ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 700 చైనా కంపెనీలపై దర్యాప్తు చేపడుతోందని అధికార వర్గాలు తెలిపాయి. 300-400 సంస్థలను రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ నుంచి కేంద్రం తొలగించనుందని తెలుస్తోంది. ఏపీ, కర్ణాటక, ఢిల్లీ సహా 17 రాష్ట్రాల్లో ఈ కంపెనీలు ఉన్నాయి.

News August 2, 2024

HOCKEY: ఆసీస్‌పై భారత్ విజయం.. 52ఏళ్లలో తొలిసారి

image

పారిస్ ఒలింపిక్స్‌ పూల్ మ్యాచ్‌లో భారత్ సత్తా చాటింది. ఆస్ట్రేలియాపై 3-2 తేడాతో విజయం సాధించి రికార్డ్ సృష్టించింది. ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియాపై భారత్ గెలవడం 52ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. పూల్ బీలో రెండో స్థానాన్ని కైవసం చేసుకోవడంలో ఈ విజయం కీలక పాత్ర పోషించింది. <<-se>>#Olympics2024<<>>

News August 2, 2024

నిరుద్యోగులను రెచ్చగొట్టి గెలిచారు: కేటీఆర్

image

TG: నిరుద్యోగులను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్‌లో ఉద్యోగాల సంఖ్య చెప్పకుండా మోసం చేసిందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR విమర్శించారు. అధికారంలోకి వస్తే 2లక్షల ఉద్యోగాలిస్తామని ఎన్నికల ముందు పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారని, ఆ ఉద్యోగాలు ఎక్కడకు పోయాయని ప్రశ్నించారు. ప్రజలు తంతారనే భయంతో జాబ్ క్యాలెండర్ పేరుతో ఓ కాగితాన్ని సభలో ప్రవేశపెట్టారని విమర్శించారు.

News August 2, 2024

తిరుమల లడ్డూ ప్రసాదానికి 308 ఏళ్లు

image

AP: వేంకటేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైన ప్రసాదం లడ్డూ. ఎవరైనా తిరుమల వెళ్లొస్తే ముందుగా అడిగేది దీనినే. ఎంతో ప్రాముఖ్యత గల లడ్డూని తిరుమలలో ప్రసాదంగా పెట్టడం ప్రారంభించి నేటికి 308 ఏళ్లు పూర్తైంది. 1715 AUG 2న లడ్డూను ప్రసాదంగా పెట్టడం ప్రారంభించారు. ఆలయపోటులో స్వచ్ఛమైన శనగ పిండి, పటిక బెల్లం, నెయ్యి, ఎండు ద్రాక్ష, యాలకులు, జీడిపప్పు, పచ్చకర్పూరంతో ప్రత్యేక పద్ధతుల్లో దీన్ని తయారుచేస్తారు.