India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: 4 నెలల కాలానికి ₹1.30లక్షల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. 40 విభాగాలకు చెందిన డిమాండ్లు, గ్రాంట్లకు ఆమోదం లభించేలా బడ్జెట్ రూపొందించింది. పూర్తిస్థాయి బడ్జెట్ను సెప్టెంబర్లో ప్రవేశపెట్టే ఛాన్సుంది. రాష్ట్రంలో ఒకే ఏడాది 2 సార్లు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టడం ఇదే తొలిసారి. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు రేపటితో ముగియనుంది.

కేరళ: వయనాడ్లో కొండచరియలు విరిగిపడి 123 మంది మృతి చెందారు. ఆ బాధిత కుటుంబాలను కలవడంతో పాటు పరిస్థితిని సమీక్షించడానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీ రేపు వయనాడ్కు వెళ్లాల్సి ఉంది. అయితే ఎడతెరిపిలేని వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పర్యటన వాయిదా వేసుకున్నారు. త్వరలోనే వయనాడ్కు వస్తానని రాహుల్ X వేదికగా హామీ ఇచ్చారు. అటు కేరళకు తమిళనాడు రూ.5కోట్లు విరాళం ప్రకటించింది.

‘హాయ్ నాన్న’ సినిమా డైరెక్టర్ శౌర్యువ్తో Jr.NTR సినిమా చేయనున్నట్లు బాలీవుడ్ మీడియా తెలిపింది. ఈ యాక్షన్ మూవీ రెండు పార్టులుగా రానుందని, 2026లో పార్ట్-1 షూటింగ్ జరగనున్నట్లు పేర్కొంది. స్టోరీ డిస్కషన్స్ ఇప్పటికే జరిగాయని, తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. 2028లో పార్ట్-1, 2031లో పార్ట్-2 రిలీజ్కు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు హీరో సన్నిహిత వర్గాలు తెలిపాయని ‘పింక్ విల్లా’ పేర్కొంది.

AP: ఎస్సీలకు ఆర్థిక భద్రత కల్పించే కార్యక్రమాలు రూపొందించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. సాంఘిక సంక్షేమ శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. 2014-2019 మధ్య కాలంలో అమలు చేసిన అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి, ఎన్టీఆర్ విద్యోన్నతి, బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు, చంద్రన్న పెళ్లికానుక లాంటి పథకాలను గత ప్రభుత్వం నిలిపివేసిందని గుర్తు చేశారు. వాటితో పాటు మరిన్ని కొత్త పథకాలు రూపొందించాలని ఆదేశించారు.

TG: త్వరలో అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్ అసెంబ్లీలో ప్రకటించారు. ఎల్లుండి మంత్రివర్గ సమావేశంలో దీనిపై విధివిధానాలు ఖరారు చేస్తామని చెప్పారు. రేషన్ కార్డు ఉన్నవాళ్లందరికీ సన్నబియ్యం పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. BRS హయాంలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని మంత్రి విమర్శించారు.

TG: మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి పరీక్షల షెడ్యూల్ను ప్రభుత్వం ప్రకటించింది. CDPO అభ్యర్థులకు జనవరి 3, 4న, ఎక్స్టెన్షన్ ఆఫీసర్(E0) అభ్యర్థులకు జనవరి 6, 7న పరీక్షలు ఉంటాయంది. గతేడాది నిర్వహించిన ఈ రెండు పరీక్షలను క్వశ్చన్ పేపర్ లీకేజీ కారణంగా టీజీపీఎస్సీ రద్దు చేసింది. 23 CDPO, 181 ఈవో పోస్టులను ఈ పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నారు.

* ఫాల్స్: వాలు తక్కువుండే(దాదాపు నిటారుగా) ప్రాంతం నుంచి రాళ్లు, మట్టి హఠాత్తుగా కిందకు పడడం.
* టోపెల్స్: రాళ్లు, మట్టి ఉన్నచోట నుంచి కిందకు కూలిపోవడం.
* స్లైడ్స్: రాళ్లు, మట్టి కిందకు దొర్లుకుంటూ రావడం.
* స్ప్రెడ్స్: మట్టి, బురద వంటివి కింద ఆధారంగా ఉన్నప్రాంతం వదులుగా మారినప్పుడు కిందకు జారుకుంటూ వెళ్లడం.
* ఫ్లోస్: బురద వంటి వదులుగా ఉన్నవి కిందకు కొట్టుకుపోవడం.

కొండలు వంటి ఎత్తైన ప్రాంతాల నుంచి రాళ్లు, మట్టి కిందకు జారిపడటాన్ని కొండచరియలు విరిగిపడటం అంటారు. ఏటవాలుగా ఉన్న ప్రాంతాల్లో ఇలా జరుగుతుంది. వర్షం, మంచు కరగడం, నీటి మట్టాల్లో మార్పులు, ప్రవాహాల వల్ల కోత, భూగర్భ జలాల్లో మార్పులు, భూకంపాలు, అగ్నిపర్వతాలు, మానవ కార్యకలాపాలు.. వంటివన్నీ కొండచరియలు విరిగిపడేందుకు కారణాలే. ఇందులో 5 రకాలుంటాయి. ఫాల్స్, టోపెల్స్, స్లైడ్స్, స్ప్రెడ్స్, ఫ్లోస్.

వివాహితలు తమ ఇంటి పేరును మార్చుకోవాలంటే(పుట్టింటి పేరుకు) భర్త నుంచి NOC తప్పనిసరి అని కేంద్రం చెప్పింది. ఇటీవల పేరు మార్పు ప్రక్రియలో ప్రభుత్వం చేసిన పలు మార్పులను సవాల్ చేస్తూ 40ఏళ్ల మహిళ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ అంశం రాజ్యసభలో ప్రస్తావనకు రాగా ‘ఈ నిబంధనతో చట్టపరమైన సమస్యలను నివారించవచ్చు’ అని కేంద్రం తెలిపింది. ఢిల్లీ హైకోర్టు విచారణను ఆగస్టు 7కు వాయిదా వేసింది.

రైల్వేలో 7,951 జూనియర్ ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ నేటి నుంచి ప్రారంభమైంది. ఇంజినీరింగ్ డిగ్రీ లేదా డిప్లొమా కలిగి ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 36 ఏళ్లు. పోస్టును బట్టి జీతం నెలకు రూ.35,400 నుంచి రూ.44,900 వరకు ఉంది. చివరి తేదీ: ఆగస్టు 29. స్టేజ్-1, స్టేజ్-2 కంప్యూటర్ టెస్టులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి. దరఖాస్తు చేసుకునేందుకు <
Sorry, no posts matched your criteria.