India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

షూటింగ్లో భాగంగా తన అభిమాన హీరో షాహిద్ కపూర్ను కొట్టాలంటే భయమేసిందని స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తెలిపారు. ‘‘జెర్సీ’లో షాహిద్తో కలిసి నటించా. నేను ఆయనకు వీరాభిమానిని. తొలి రోజు షూట్లో ఆయననే చూస్తూ ఉండిపోయా. షూట్లో భాగంగా షాహిద్ను కొట్టాల్సి ఉంది. కానీ కొట్టలేకపోయా. మీ మాజీ బాయ్ఫ్రెండ్ను గుర్తు చేసుకుని నన్ను కొట్టండి అని షాహిద్ చెప్పారు. ఎలాగోలా ఆ సీన్ కంప్లీట్ చేశాం’ అని ఆమె చెప్పారు.

టీమ్ ఇండియా క్రికెటర్ సంజూ శాంసన్కు మరోసారి మొండిచేయి ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్ కప్లో పాల్గొనే భారత జట్టులో వికెట్ కీపర్గా కెఎల్.రాహుల్ను తీసుకునేందుకు సెలెక్టర్లు మొగ్గు చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే ఇప్పటికే పలు WCలు మిస్సైన సంజూ.. మరో WC వరకు ఎదురుచూడక తప్పదు. వారం రోజుల్లో జట్టును ప్రకటించనున్న నేపథ్యంలో సంజూ అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

ఒక్కసారి కూడా IPL ట్రోఫీ గెలవకపోయినా బ్రాండ్, ఫేమ్ విషయంలో RCBని కొట్టే జట్టే లేదంటే అతిశయోక్తి కాదు. 2024లో RCB బ్రాండ్ వాల్యూ 28% పెరిగి $10.7బిలియన్లకు చేరుకుంది. అయితే.. మైదానంలో ఆ జట్టు ప్రదర్శన అంతంతమాత్రమే. ఘోరమైన రికార్డులన్నీ RCBపైనే నమోదవుతాయనే ఓ అపవాదు కూడా ట్రెండ్ అవుతోంది. కాగా.. గెలవాలంటే బలమైన బ్యాటింగ్ ఒక్కటే సరిపోదని, బౌలింగ్ కూడా ఉండాలని విశ్లేషకులు అంటున్నారు.

హీరోయిన్ ఇలియానా భర్త ఎవరో చెప్పకుండానే గతేడాది ఆగస్టులో బిడ్డకు జన్మనివ్వడం చర్చనీయాంశంగా మారింది. US వ్యాపారవేత్త మైఖేల్ డోలన్ను పెళ్లాడినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే.. ఎట్టకేలకు ఆమె తన వివాహంపై మొదటిసారి ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. భర్తతో వైవాహిక జీవితం అందంగా సాగుతోందని అన్నారు. డోలన్ తనకు ఎంతో సపోర్టివ్గా ఉంటారని, కష్టకాలంలో తనకు తోడుగా నిలిచారని ఇలియానా చెప్పుకొచ్చారు.

ఆసియా రిచెస్ట్ బ్యాంకర్గా గుర్తింపు పొందిన ఉదయ్ కోటక్కు RBI ఆంక్షలతో భారీ నష్టం వాటిల్లింది. కోటక్ మహీంద్ర బ్యాంక్ కొత్త క్రెడిట్ కార్డులు, మొబైల్ బ్యాంకింగ్ అకౌంట్లను జారీ చేయడంపై RBI ఇటీవల నిషేధించింది. ఈ నేపథ్యంలో ఆ సంస్థ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఉదయ్ ఇప్పటివరకు $1.3 బిలియన్లు (రూ.10వేలకోట్లు) కోల్పోయారు. ఆయన ఇంతలా నష్టపోవడం గత నాలుగేళ్లలో ఇదే అత్యధికం. ప్రస్తుతం ఆయన సంపద $14.4 బిలియన్లు.

ప్రపంచంలోనే అత్యంత పురాతన చెట్టు అమెరికాలో ఉంది. కాలిఫోర్నియాలో ఉన్న ‘మెతుసెలా’ అనే చెట్టు వయసు దాదాపు 4,855 సంవత్సరాలు. సముద్ర మట్టానికి సుమారు 9500 అడుగుల ఎత్తులో బ్రిస్టిల్కోన్ పైన్ ఫారెస్టులో ఇది ఉంది. అడవిలో ఈ చెట్టు కచ్చితమైన స్థానాన్ని అమెరికా ఫారెస్ట్ అధికారులు ఇప్పటివరకు బహిర్గతం చేయలేదు. 1957లో ఎడ్మండ్, టామ్ హర్లాన్ అనే శాస్త్రవేత్తలు ఈ చెట్టు శాంపిల్ను పరీక్షించి వయసును అంచనా వేశారు.

AP: వైసీపీ పాలనలో రాష్ట్రానికి పట్టుమని 10 కంపెనీలు కూడా రాలేదని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. ‘రాష్ట్రంలో అభివృద్ధి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోలేదు. పండిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. సాగర్ కాలువలు ఆధునీకరించలేదు. మూడు రాజధానులు అని ఒక్కటీ నిర్మించలేదు. మంత్రి అంబటి కాలువల్లో మట్టి కూడా తీయించలేకపోయారు. ఆయన ఒక విఫల మంత్రి’ అని ఆమె ఫైర్ అయ్యారు.

ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ పదో తరగతి, ఇంటర్ పరీక్షల <

పాకిస్థాన్ మహిళా జట్టు మాజీ క్రికెటర్ బిస్మా మరూఫ్ క్రికెట్కు వీడ్కోలు పలికారు. 2006లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన బిస్మా.. పాకిస్థాన్ తరఫున వన్డేలు, టీ20ల్లో అత్యధిక పరుగులు చేశారు. 136 వన్డేల్లో 3369 రన్స్, 44 వికెట్లు.. 146 టీ20ల్లో 2893 రన్స్, 36 వికెట్లు పడగొట్టారు. బిస్మా 96 మ్యాచులకు కెప్టెన్గా వ్యవహరించారు.

రేపు దేశంలోని 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 88 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. 1202 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. 1.67 లక్షల పోలింగ్ స్టేషన్లలో 16 కోట్ల మంది ఓటర్లు నాయకుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. 34.8 లక్షల మంది తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కొన్ని ప్రాంతాల్లో మినహా అన్ని ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
Sorry, no posts matched your criteria.