News April 25, 2024

స్ట్రాంగ్ రూమ్ భద్రతా ప్రమాణాలేంటి? 1/2

image

ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలు, వీవీప్యాట్‌లను స్ట్రాంగ్ రూమ్‌లలో EC భద్రపరుస్తుంది. అయితే స్ట్రాంగ్ రూమ్‌‌ ఏర్పాటులో కొన్ని భద్రతా ప్రమాణాలు తప్పక పాటించాల్సి ఉంటుంది. అవేంటంటే..
➣స్ట్రాంగ్ రూమ్‌కు ఒకటే తలుపు ఉండాలి
➣ప్రవేశ ద్వారం మినహా వేరే మార్గంలో లోనికి వెళ్లేందుకు ఆస్కారం ఉండకూడదు.
➣అగ్ని ప్రమాదం సంభవించినా గోడలకు ఎలాంటి నష్టం జరగకుండా ఏర్పాట్లు ఉంటాయి.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 25, 2024

మూడంచెల భద్రతలో స్ట్రాంగ్ రూమ్..2/2

image

➢ డబుల్ లాక్ సిస్టమ్ కలిగి ఉండే స్ట్రాంగ్ రూమ్ వద్ద 24 గంటలు సీఏపీఎఫ్ బందోబస్తు, సీసీ కెమెరాల నిఘా ఉంటుంది.. స్ట్రాంగ్ రూమ్ సమీపంలో కంట్రోల్ రూమ్ ద్వారా భద్రతను పర్యవేక్షిస్తారు.
➢సీఏపీఎఫ్ గార్డులు, పోలీసులు, జిల్లా కార్యనిర్వాహక గార్డులతో చెందిన దళాలతో మూడంచెల భద్రత ఉంటుంది
➢విద్యుత్ శాఖ సహకారంతో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చేస్తారు. జనరేటర్ సైతం అందుబాటులో ఉంచుతారు.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 25, 2024

డిపాజిట్ దక్కని వ్యక్తి ఎమ్మెల్యే అయ్యారు!

image

1952 ఎన్నికల్లో విశాఖ(D) పరవాడలో ఉన్న 60,780 ఓట్లలో 25,511 మాత్రమే పోలయ్యాయి. ఇందులో వీరభద్రం(CPI)కి అత్యధికంగా 7,064 ఓట్లు వచ్చాయి. అప్పటి రూల్ ప్రకారం డిపాజిట్ దక్కాలంటే పోలైన ఓట్లలో 3వ వంతు.. అంటే 8,504 ఓట్లు రావాలి. అయితే ప్రత్యర్థిపై ఒక్క ఓటు అధికంగా వచ్చినా వారే విజేత అన్న కమ్యూనిస్టుల వాదనతో వీరభద్రంను MLAగా EC ప్రకటించింది. ఆ తర్వాత డిపాజిట్ దక్కేందుకు 6వ వంతు ఓట్లు రావాలని రూల్ మార్చింది.

News April 25, 2024

BREAKING: టికెట్లు విడుదల

image

AP: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. జులై నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం(రూ.300 కోటా) టికెట్లను TTD <>ఆన్‌లైన్‌లో<<>> విడుదల చేసింది. తిరుమల, తిరుపతిలో గదుల కోటా టికెట్ల(జులై నెల)ను నేడు మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులోకి తీసుకురానుంది. అలాగే శ్రీవారి సేవ కోటా టికెట్లను 27న ఉదయం 11 గంటలకు, నవనీత సేవ టికెట్లను మ.12 గంటలకు, పరకామణి సేవ కోటాను మ.ఒంటి గంటకు విడుదల చేయనుంది.

News April 25, 2024

లంచం ఇవ్వకండి.. సమాచారం ఇవ్వండి: ACB

image

TG: ACB డీజీ CV ఆనంద్ ప్రజలకు కీలక సూచన చేశారు. ప్రభుత్వాధికారులు లంచం డిమాండ్ చేస్తే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. ‘లంచం ఇవ్వకండి.. మాకు సమాచారం ఇవ్వండి’ అనే పోస్టర్‌ను ఆనంద్ ఆవిష్కరించారు. అందుకు టోల్ ఫ్రీ నంబర్ 1064కు కాల్ చేయాలన్నారు. లేదా dgacb@telangana.gov.inకి మెయిల్ చేయాలన్నారు.

News April 25, 2024

ఓటమికి కారణం అదే: రుతురాజ్ గైక్వాడ్

image

మార్కస్ స్టొయినిస్ అద్భుత ఇన్నింగ్స్‌తోనే తాము మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చిందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తెలిపారు. ‘ఈ మ్యాచ్ బాగా సాగింది. 13-14 ఓవర్ల వరకు మ్యాచ్ మా చేతుల్లోనే ఉంది. పిచ్ మీద తేమ ఎక్కువగా ఉండటంతో మా స్పిన్నర్లకు బంతిపై పట్టు దొరకలేదు. అందుకే ప్రభావం చూపలేకపోయారు. లేదంటే ఫలితం వేరేలా ఉండేది. మేము మరో 20 పరుగులు చేయాల్సింది. లక్నో టీమ్ గొప్పగా ఆడింది’ అని రుతురాజ్ తెలిపారు.

News April 25, 2024

WAY2NEWS యాప్‌లో ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి..

image

మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఉ.11 గంటలకు నాంపల్లిలో విద్యాశాఖ కార్యదర్శి రిజల్ట్స్ రిలీజ్ చేస్తారు. అందరికంటే ముందుగా, వేగంగా WAY2NEWS యాప్‌లో మీ ఫలితాలు తెలుసుకోవచ్చు. యాప్ ఓపెన్ చేయగానే ఉండే స్క్రీన్‌లో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే క్షణాల్లో ఫలితం వస్తుంది. అంతే సులువుగా ఒక్క క్లిక్‌తో దీన్ని షేర్ చేయొచ్చు.
#Be Ready

News April 25, 2024

సచిన్ టెండూల్కర్ రికార్డుల్లో కొన్ని..!

image

నేడు సచిన్ టెండూల్కర్ 51వ జన్మదినం. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆయన సాధించిన కొన్ని రికార్డులు..
* 100 సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడు.
* అన్ని ఫార్మాట్లు కలిపి అత్యధిక పరుగులు(34,357).
* వన్డేల్లో ఒకే ఏడాదిలో అత్యధిక పరుగులు(1894).
* అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డులు(76).
* అత్యధిక అర్ధ శతకాలు(264), అత్యధిక ఫోర్లు(4076).
* టెస్టుల్లో వేగంగా 15వేల పరుగులు, వన్డేల్లో వేగంగా 18వేల పరుగులు.

News April 25, 2024

ఓటేస్తే ఫ్రీగా ఐస్‌క్రీమ్, జిలేబీ!

image

మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లోని ఆహార దుకాణాల యజమానులు ఓటర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. పోలింగ్ మొదలైన తొలి గంటల్లో ఓటేసేవారికి జిలేబీ, ఐస్‌క్రీమ్, అటుకుల ఉప్మా ఫ్రీగా అందిస్తామని తెలిపారు. ఈ మేరకు కలెక్టర్‌తో సమావేశం అనంతరం దుకాణదారుల సంఘం మీడియాకు తెలిపింది. ఎన్నికల పోలింగ్‌లో ఓటర్లు పెద్దఎత్తున పాల్గొనాలని కోరుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

News April 25, 2024

నిడదవోలు: గెలుపు ముంగిట నిలిచేదెవరు?

image

AP: కొవ్వూరు నియోజకవర్గంలో భాగంగా ఉన్న నిడదవోలు(తూర్పుగోదావరి) 2008లో కొత్త సెగ్మెంట్‌గా ఏర్పడింది. 2009, 14లో బూరుగుపల్లి శేషారావు(TDP), 2019లో శ్రీనివాసనాయుడు(YCP) గెలిచారు. ఈసారి కూడా YCP నుంచి ఆయనే బరిలో దిగుతుండగా, కూటమి అభ్యర్థిగా జనసేన నేత కందుల దుర్గేశ్ పోటీ చేస్తున్నారు. ఎవరికివారు గెలుపుపై ధీమాగా ఉన్నారు. 2019లో YCPకి 81వేల ఓట్లు రాగా, TDP, JSPకి కలిపి 82,386 ఓట్లు వచ్చాయి.
<<-se>>#ELECTIONS2024<<>>